రాష్ట్రీయం
Andhra Pradesh Debts Row: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా క్లియర్ కటౌట్ ఇదిగో, నాలుగేళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పులు రూ.1,77,991కోట్లు మాత్రమే
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై పార్లమెంట్‌ సాక్షిగా వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.
Tirumala: అధికమాసం ఎఫెక్ట్, తిరుమలలో ఈసారి ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Hazarath Reddyతిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు.
Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్
Hazarath Reddyరోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డు మీద వెళుతూ లైన్ క్రాస్ చేశాడు. దీంతో వెనక నుంచి వచ్చిన స్కూటి గుద్దడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోషేర్ చేస్తూ తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్ చేశారు సైబరాబాద్ పోలీసులు
Prithvi on Ambati Rambabu: వీడియో ఇదిగో, అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు, నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేయడం పై వస్తున్న కామెంట్ల పై స్పందించిన నటుడు పృథ్వీ. నాకు మంత్రి అంబటి ఎవరో తెలియదు. అంబటి రాంబాబు ఆస్కార్ లెవల్ నటుడేమీ కాదు ఇమిటేట్ చేయడానికి. ఓ పనికిమాలిన వెధవ, ఓ బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చేయాలని డైరెక్టర్ నాకు చెప్పారు.
Hyderabad Rains: ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన
Hazarath Reddyతగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.
CM Jagan Visakha Tour Schedule: సీఎం జగన్‌ విశాఖలో పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే, నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు
Hazarath Reddyవిశాఖపట్నంలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు.
Telangana Weather Update: ఎండలు వచ్చినా మళ్లీ అలర్ట్, తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు వర్షాలు, గోదావరిలో తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Ladies Special Bus: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ప్రారంభమైన లేడీస్‌ స్పెషల్‌ బస్సు, జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఉదయం, సాయంత్రం నడవనున్న ప్రత్యేక బస్సు
Hazarath Reddyహైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో లేడీస్‌ స్పెషల్‌ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
Kodangal Road Accident: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ దెబ్బకు తిరగబడిన ఆటో, 20 మంది విద్యార్థులకు గాయాలు, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘటన
Hazarath Reddyవికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ 20 మంది పాఠశాల విద్యార్థులు ఆటో రిక్షాలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ఓవర్‌లోడ్ చేయడంతో కంట్రోల్ కాక బండి అదుపుతప్పింది.
Telangana Road Accident: వీడియో ఇదిగో, అదుపుతప్పిన బైక్, టీ తాగుదామని బయటకుకి వచ్చిన బావ, బావమరిది మృతి
Hazarath Reddyజనగాంకు చెందిన ఉల్లెంగుల నరేష్ (23) కాప్రాలో ఉంటున్న మేనమామ కొడుకు క్రాంతి(23)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున టీ తాగుదామని బైక్ మీద బయటకు వెళ్లి ఈసీఐఎల్ చౌరస్తాలో స్కిడ్ అయ్యి పడిపోయి అంబేడ్కర్ విగ్రహం గద్దెకు ఢీకొని తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు.
Visakha old woman Murder Case: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన బయటకు వెళుతున్న గ్రామ వాలంటీర్‌
Hazarath Reddyబంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ దొరికాడు. వైజాగ్ - పెందుర్తిలో బంగారం కోసం 73 ఏళ్ళ వృద్ధురాలు వరలక్ష్మిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ వెంకట్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన అనంతరం ఇంటి నుండి బైటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
CID DSP Booked for Harassing Woman: డీఎస్పీ కాదు కామాంధుడు, నా కౌగిలిలో నలిగిపోవాలంటూ ఉద్యోగికి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyదక్షిణాది డిస్కమ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) సీనియర్‌ అకౌంటెంట్‌కు పోలీస్ ఉన్నతాధికారి లైంగగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.
Visakhapatnam Horror: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. కొంత కాలంగా బాధితురాలి షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న నిందితుడు
Rudraవిశాఖలో ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.
TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Rudraతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
Rudraతెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు
Rudraవరంగల్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత
Dil Raju: ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు, ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపు..
kanhaఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది.
Viral Video: తన పిల్లలని కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకున్న కుక్క, తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
kanhaఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన. తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించి వరదనీటిలో ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటిన పోలీసులు.
Hyderabad Shocker: గాజు పెంకుతో తండ్రి గొంతు కోసిన కూతురు, అంబర్ పేటలో దారుణం..
kanhaతండ్రి మందలించాడని గొంతు కోసిన కూతురు. అంబర్‌పేటలో తండ్రి మందలించాడని కోపంతో తండ్రి గొంతు కోసిన కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి. కూతురుని అరెస్ట్ చేసిన పోలీసులు.