ఆంధ్ర ప్రదేశ్

MP Vijayasai Reddy: విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తాం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు తప్పకుండా వస్తుంది, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖపట్నం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Covid in AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి, కొత్తగా 12,768 మందికి కరోనా పాజిటివ్‌, 15,612 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌, ప్రస్తుతం 1,43,795 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,768 మందికి కరోనా పాజిటివ్‌గా (New Coronavirus Positive Cases) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,14,261 మందికి కరోనా వైరస్‌ (Coronavirus Positive Cases) సోకింది.

YSR Jagananna Saswata Bhu Hakku-Bhu Raksha: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, భూసర్వే చురుగ్గా చేయాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు, అన్నిరకాల సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జరగాలని సూచన

Hazarath Reddy

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై (YSR Jagananna Saswata Bhu Hakku-Bhu Raksha) క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు‘‘భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

Vaindam Prasanth: ఎడారిలో లవర్ కోసం 40 కిలోమీటర్లు తిరిగా, పాక్ చెర నుంచి విడుదలైన ప్రశాంత్ కథ, సైబరాబాద్ సీపీని కలిసి ధన్యవాదాలు తెలిపిన హైదరాబాద్ టెకీ, కొత్త జీవితం ప్రారంభిస్తానని వెల్లడి

Hazarath Reddy

పాకిస్తాన్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు (Hyderabad techie returns home) విడుదలయ్యాడు. నాలుగేళ్లపాటు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీీ సజ్జనార్ ని కలిసి ధన్యవాదాలు తెలిపాడు.

Advertisement

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం, జూన్ 3న వైఎస్సార్ జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవం

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ (Advisors Tenure Extended To One year) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

Krishnapatnam Anandaiah Medicine: ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకు మార్చిన అధికారులు, ఇక నుంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ, కొరియర్ ద్వారా కృష్ణపట్నం మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య బృందం

Hazarath Reddy

నెల్లూరు బొనిగె ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు, హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పడు మందు (Nellore krishnapatnam anandaiah medicine) తయారీ పనిలో ఆనందయ్య నిమగ్నమయ్యారు. అయితే కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని ఉన్న ప్రదేశం నుంచి మరో చోటుకి మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీకి (cvr-security academy) మందు తయారీ కేంద్రాన్ని తరలించారు.

Coronavirus in AP: ఏపీలో కోటి దాటిన ఫస్ట్‌,సెకండ్‌​ డోసు టీకాలు తీసుకున్న వారి సంఖ్య, 24 గంటల్లో 11,303 మందికి కరోనా పాజటివ్, ఇప్పటి వరకు 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

Hazarath Reddy

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 104 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 18,257 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 46 వేల 617 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Anandaiah Medicine: ఆనందయ్య కరోనా మందులు ఎలా వాడాలి, వాటిని ఎలా తయారుచేస్తారు, కరోనా పేషెంట్లు అయితే ఏ మందులు వాడాలి, నెగిటివ్ ఉన్న వారు ఏమి వాడాలి, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై వివరణాత్మక కథనం

Hazarath Reddy

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులతో (Anandayya Ayurveda Medicine) దుష్ప్రభావాలు లేవని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌), ఇతర సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు ఈ మందు (Krishnapatnam Medicine) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.

Advertisement

Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 7,943 మందికి కరోనా, 19,845 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌, కొత్తగా 98 మంది మృత్యువాత, ప్రస్తుతం 1,53,795 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7,943 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కు చేరింది.

COVID Curfew Extended in AP: ఏపీలో జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

Hazarath Reddy

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ (COVID Curfew Extended in AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా (xtended till June 10 with same set of restrictions) కొనసాగుతుంది.

Krishnapatnam Anandaiah Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పేషెంట్ల బంధువులు మాత్రమే కృష్ణపట్నం రావాలని సూచన, మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

New Medical Colleges in AP: ఏపీలో కొత్తగా 14 వైద్య కళాశాలలు, శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టనున్న ఏపీ ప్రుభుత్వం, కొత్త కాలేజీలు ఏర్పాటయ్యే ప్రదేశాలు ఇవే..

Hazarath Reddy

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా (virtually laid foundation stone) పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు.

Advertisement

Srungavarapu Niranjan: తానా తదుపరి అధ్యక్షుడిగా కర్నూలు వాసి నిరంజన్‌ శృంగవరపు, సమీప ప్రత్యర్థి నరేన్‌ కొడాలిపై గెలుపు, 2023-25 కాలానికి అధ్యక్షుడిగా కొనసాగనున్న నిరంజన్

Hazarath Reddy

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ( Srungavarapu Niranjan) ఎన్నికయ్యారు. తానా ఎన్నికల్లో (Tana President Election) నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది.2023-25 కాలానికి గాను ఆయన తానా తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

Retired Headmaster Kotayya Dies: రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి, గతంలో ఆనందయ్య మందుపై ఆయన వీడియోలు వైరల్, బొనిగి ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం పూర్తి, నేడు సీఎం జగన్‌కు పూర్తి నివేదికను అందించనున్న ఆయుష్ కమిషనర్ రాములు

Hazarath Reddy

కరోనాతో రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి చెందారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన (Retired Headmaster Kotayya Dies) మరణించారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య.. ఆనందయ్య మందుతో (Anandaiah's Ayurvedic Treatment) కోలుకున్నానన్న వీడియోతో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

School Summer Holidays Extended in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు, జూన్ 3తో ముగియనున్నఈ ఏడాది విద్యా సంవత్సరం, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు వాయిదా

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను (School Summer Holidays) జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది.

Monsoon: ఎండల నుంచి ఇక ఉపశమనం, జూన్ 3న కేరళను తాకనున్న రుతుపవనాలు, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతు పవనాలు

Hazarath Reddy

ఎండల నుంచి ఉపశమనం కలిగించే వార్తను ఎఐండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా వచ్చేస్తున్నాయి. జూన్‌ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు (Monsoon likely to hit Kerala by June 3) వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి.

Advertisement

Covid in AP: ఏపీలో ఒక్కరోజే 21,133 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి, తాజాగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌, 94 మంది మృతితో 10,832కు పెరిగిన మరణాల సంఖ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Coronavirus Pandemic) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247 మందికి కరోనా వైరస్‌ (Coronavirus Positive Cases) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 94 మంది మృత్యువాతపడ్డారు.

CM YS Jagan's Two-Year Rule: రెండేళ్ల పాలనపై బుక్‌ని విడుదల చేసిన ఏపీ సీఎం, 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందని తెలిపిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

#2YearsForYSJaganAneNenu: వైయస్ జగన్ అనే నేను..రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ట్విట్టర్ ట్రెండింగ్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’ (#2YearsForYSJaganAneNenu) హ్యాష్‌ట్యాగ్‌ శనివారం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

Covid in AP: కర్ప్యూ దెబ్బకు తగ్గిన కరోనా కేసులు, పెరిగిన డిశ్చార్జ్ రేటు, తాజాగా 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో 13,756 మందికి పాజిటివ్, ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

Hazarath Reddy

Advertisement
Advertisement