ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus Update: అదిరిపోయే శుభవార్త, ఏపీలో ఆరు లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్‌ కేసులు కేవలం 64,876 మాత్రమే, తాజాగా 6,923 మందికి కరోనా, 7,796 మంది రికవరీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 64,876 (Coronavirus cases in Andhra Pradesh). వైరస్‌ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5,708కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
AP Cabinet Meeting: అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, సెప్టెంబర్‌ 3న చివరి మంత్రి వర్గ సమావేశం, ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ అంశంపై సమావేశంలో చర్చ
Hazarath Reddyఏపీ కేబినెట్‌ మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో అక్టోబర్‌ 1న సమావేశం (Andhra Pradesh cabinet meeting on October 1st) జరగనుంది.
TSRTC: ఏపీకి నో..మహారాష్ట్ర,కర్ణాటకకు తెలంగాణ బస్సు సర్వీసులు, సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని తెలిపిన టీఎస్ఆర్టీసీ, ఏపీతో ఒప్పందంపై ఇంకా తెగని పేచీ
Hazarath Reddyతెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు సోమవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రారంభం (TSRTC to resume bus services) కానున్నాయి. ఈ మేరకు బస్సులను నడపడానికి తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి అనుమతి లభించింది. ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అదే రోజున బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ (TSRTC) ఓ ప్రకటనలో తెలిపింది.
Coronavirus in Telangana: తెలంగాణలో 1,100కు చేరిన మృతుల సంఖ్య, తాజాగా 1,967 మందికి కరోనా, 1,54,499 మంది డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 30,234
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్‌ కరోనా కేసులు (Coronavirus in Telangana) నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
AP Coronavirus Report: గుడ్ న్యూస్..6 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసులు, ఏపీలో తాజాగా 7,293 మందికి కరోనా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,794 మాత్రమే
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 75,990 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 9,125 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,97,294. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,794. కోవిడ్‌బారిన పడ్డవారిలో తాజాగా 57 మంది ప్రాణాలు విడువడంతో ఆ మొత్తం సంఖ్య 5663 కి చేరింది.
AP Police Alert: మతం ముసుగులో దాడులకు పాల్పడే శక్తులను ఏరివేస్తాం, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏపీ పోలీస్ శాఖ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు చెలరేగుతున్న తరుణంలో, ముఖ్యంగా అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ (Sri Lakshmi Narasimha Swamy temple) రథం మంటల ఘటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రార్థనా స్థలాలను భద్రపరచాలని ప్రభుత్వం పోలీసు శాఖను (Andhra Pradesh Police) ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చిలు, దేవాలయాలు, మసీదులు మరియు ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరగకుండా అప్రమత్తంగా ఉండటానికి , నిఘా కెమెరాలను పరిష్కరించడానికి రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు మరియు మత పెద్దలను పిలిచే ప్రక్రియను రాష్ట్ర పోలీసు శాఖ ఇప్పటికే ప్రారంభించింది.
AP PGECET 2020: ఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి, సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు, వివరాలను వెల్లడించిన పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు
Hazarath Reddyఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు (PG Set Convener P Srinivasa Rao) తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ సెట్ (AP PGECET 2020) కోసం 13 పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
Heavy Rains Hits Telugu States: భయపెడుతున్న భారీ వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, నాగార్జునసాగ‌ర్ 10 గేట్లు ఎత్తివేత‌, పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో నదులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాన‌లు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains Hits Telugu States) నదులు, డ్యాములు నిండిపోయాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister K Kannababu) తెలిపారు.
New Excise Policy in AP: తిరుపతిలో కొన్ని చోట్ల మద్యం అమ్మకాలపై నిషేధం, అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ, 2,934 ప్రభుత్వ దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్‌ చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyఏపీలో ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్‌ (Excise Policy in Andhra Pradesh) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి (New Excise Policy in AP) రానున్నది. ప్రస్తుతం ఏపీలో 2934 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలన్నింటినీ మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,073 పాజిటివ్ కేసులు నమోదు, 8,695 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 67,683గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగడిచిన ఒక్కరోజులో మరో 48 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,606కు పెరిగింది....
SP Balasubrahmanyam Passed Away: గాన గంధర్వుడు ఇక లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తీవ్ర దిగ్భ్రాంతిలో అభిమాన లోకం
Team Latestlyఆగష్టు 5న ఆసుపత్రిలో చేరారు. దాదాపు 41 రోజుల పాటు ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది, బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. చివరకు....
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,855 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,54,385కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5,558కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyఉభయ గోదావరి జిల్లాల్లో నుంచే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1095 కేసులు నమోదయ్యాయి....
Dharani Portal: అక్టోబర్ 3 నుంచి తెలంగాణ ధరణి పోర్టల్ ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్‌బుక్ జారీ, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయమన్న సీఎం కేసీఆర్
Team Latestlyఇక ముందు ఒక ఇంచు భూమి కూడా ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి...
AP Coronavrius Report: ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 7,228 మందికి కరోనా, 5,70,667 మంది కోలుకుని డిశ్చార్జ్, 45 మంది మృతితో 5,506కు చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavrius Report) అయినట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఏపీలో 6,46,530కి కరోనా కేసులు ( cumulative caseload to 6,46,530) చేరాయి. ప్రస్తుతం ఏపీలో 70,357 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మొత్తం సీట్లు అందుబాటులోకి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయం
Hazarath Reddyఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ఇకపై భౌతిక దూరం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొవిడ్ నిబంధనల దృష్ట్యా బస్సుల్లో సగం సీట్లకే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
YSR Jala Kala: వైఎస్సార్‌ జలకళ.. ఉచిత బోరుకు రైతులు అప్లయి చేసుకోవడం ఎలా? సెప్టెంబర్ 28న వైఎస్ఆర్ జలకళను ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరణ
Hazarath Reddyపరిపాలన కొత్త శకానికి నాంది పలుకుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్యేందుకు మరిన్ని పథకాల అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా ( Free borewells) బోర్లు తవ్వించే ‘వైఎస్సార్‌ జలకళ’ (YSR Jala Kala) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Cm Jagan) సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభిస్తారు.
CM YS Jagan Delhi Tour: పోలవరం పర్యటనకు రావాలి, కేంద్ర జలశక్తి మంత్రిని కోరిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని వినతి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో (AP CM YS Jagan Delhi Tour) భాగంగా రెండో రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్‌కు (Gajendra Singh Shekhawat) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు త్వరితగతిన అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని (Union Water Resources Minister) సీఎం జగన్‌ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Covid-19 Funds to AP: కరోనాపై పోరుకు ఏపీకి రూ. 200 కోట్ల నిధులు, మరో రూ. 58.4 కోట్ల నిధులు ఇవ్వాలి, వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే
Hazarath Reddyకోవిడ్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం (Narendra Modi Govt) ఇప్పటివరకు రూ. 200 కోట్ల నిధులను (COVID Funds to AP) అందించిందని.. మరో 58.4 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని కేంద్రం తెలిపింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే (Ashwini Kumar Choubey) ఈ మేరకు సమాధానం అందించారు.
CM YS Jagan Delhi Tour: హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ, రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు, ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో (CM YS Jagan Delhi Tour) మంగళవారం సాయంత్రం కలిశారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీ సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు రాత్రి సీఎం జగన్‌ (Chief Minister YS Jagan Mohan Reddy) ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు.
AP's COVID Update: కొవిడ్19 నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్, కొత్తగా నమోదయ్యే కేసుల కంటే రికవరీలే ఎక్కువ; గడిచిన ఒక్కరోజులో 7,553 కేసులు నమోదు
Team Latestlyన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,555 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,62,376 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో....