ఆంధ్ర ప్రదేశ్

Rain Alert in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు (Rain Alert in AP) పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (Disaster Management Authority) తెలిపింది. ఈ నేపథ్యంలొ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Covid in AP: కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,597 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,54,146కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది. తాజా పరీక్షల్లో 32,837 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,311 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. గత 24 గంటల్లో 6,676 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 93 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2296 కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Lockdown in Ongole: మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఒంగోలులో మరోసారి కంటైన్‌మెంట్‌ ఆంక్షలు విధించిన కలెక్టర్ పోల భాస్కర్, రెండు వారాల పాటు అమల్లోకి..

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో ప్రధాన పట్టణం ఒంగోలు నగరంలో (Lockdown in Ongole) కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు (Lockdown Extension) చేపట్టారు. మరోసారి లాక్‌డౌన్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ చెక్‌ పెట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి వరకు కొన్ని రకాల సడలింపులతో పరిమిత ఆంక్షలు విధిస్తూ వచ్చిన అధికారులు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కంటైన్‌మెంట్‌ ఆంక్షలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Vizag Crane Crash Incident: విశాఖ షిప్‌ యార్డు ప్రమాదంపై నివేదికను కలెక్టర్‌కు అందజేసిన కమిటీ, నిర్ణీత సామర్థ్యానికి తగినట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని నివేదికలో వెల్లడి

Hazarath Reddy

ఆగస్టు 1వ తేదీన విశాఖ పట్నంలో హిందూస్థాన్ షిప్ ‌యార్డులో క్రేన్ ప్రమాదం (Vizag Crane Crash Incident) జరిగి పదిమంది కార్మికులు మృతి చెందిన సంగతి విదితమే. దీనిపై ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ( Six Members Committee) వేసి తక్షణమే నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రమాదంపై (Visakhapatnam shipyard crane accident) నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు (Collector Vinay Chand) కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం నివేదికలో పొందుపరిచింది.

Advertisement

YSR Cheyutha Scheme 2020: వారి బ్యాంకు అకౌంట్లోకి నేరుగా రూ.18,750, వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఒక్కో మహిళకు నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం

Hazarath Reddy

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం (YSR Cheyutha Scheme 2020) ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఏపీ బడ్జెట్‌లో వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం (YSR Cheyutha) ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.

YSR Cheyutha Scheme 2020: వైఎస్సార్‌ చేయూత నేడే లాంచ్, పథకం ద్వారా నాలుగేళ్లకు రూ. 75 వేలు మహిళల అకౌంట్లోకి, నేడు తొలి ధపా మొత్తం రూ.18,750 విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా దూసుకుపోతున్న ఏపీ సీఎం (Chief Minister Y.S. Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏపీ సీఎం తాజాగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని(YSR Cheyutha Scheme 2020) నేడు ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో( CM Camp Office) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఈ పథకాన్ని(YSR Cheyutha) ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

AP Coronavirus Report: 25 లక్షల కరోనా పరీక్షలతో ఏపీ రికార్డు, తాజాగా 9,024 మందికి కోవిడ్-19 పాజిటివ్, రాష్ట్రంలో 2,44,549కు చేరిన కరోనా కేసుల సంఖ్య, మొత్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కోవిడ్-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus Report) తేలింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్త కేసులతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య (coronavirus cases) 2,44,549 కు చేరింది. కొత్తగా 9,113 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులున్నాయి.

Ram Madhav: ఏపీలో ప్రతిపక్షం సీటు ఖాళీయే, బీజేపీనే భర్తీ చేయాలన్న రాం మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరణ, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడి

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు (Somu Veerraju sworn-in as AP BJP President) స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

Advertisement

Voter List Revision: నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా, ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Voter list revision) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (AP Chief Electoral Officer K.Vijayanand) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగించే కార్యక్రమం చేపడతారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను (Voter list revision in AP) పూర్తి చేస్తారు.

Vijayawada Fire Accident: స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఒప్పంద పత్రాలు స్వాధీనం, అగ్నిప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో (Vijayawada Fire Accident) పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.

AP Coronavirus Report: ఏపీలో తగ్గుముఖం పట్టిన కేసులు, గత 24 గంటల్లో 7,665 మందికి కరోనా, రాష్ట్రంలో 2,35,525కు చేరిన మొత్తం కేసుల సంఖ్య, 2116కు పెరిగిన మరణాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ (AP Cornavirus Report) నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా (New Covid-19 cases) తేలింది. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus) 2,35,525 కు చేరింది. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636 కి చేరింది.

Land Dispute in Chittoor: మహిళపై కత్తులతో దాడి, చిత్తూరులో భూవివాదం విషయంలో కత్తులతో విరుచుకుపడిన సమీప బంధువులు, మహిళ పరిస్థితి విషమం

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో (Land Dispute in Chittoor) ఓ మహిళపై సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో ( Papireddygaripalli) సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో (Man Attack Opponent With Knife) ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

AP New Industrial Policy: ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్‌రెడ్డి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీ

Hazarath Reddy

ఏపీలో నూతన పారిశ్రామిక విధానాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy), ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా (Roja) సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆలోచనల ప్రతిరూపంగా, ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం (AP New Industrial Policy) అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.

Vijayawada Swarna Palace Fire: ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు

Hazarath Reddy

ఏపీలో విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్‌ అనుబంధ కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై (Vijayawada Hotel Swarna Palace Fire incident) విచారణకు రెండు కమిటీలను (Two committees) నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు.

COVID-19 in Tirumala: టీటీడీలో కరోనా కల్లోలం, మొత్తం 743 మందికి కోవిడ్-19 పాజిటివ్, 402 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 338

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులు కరోనా (COVID-19 in Tirumala) బారినపడిన విషయం తెలిసిందే. కాగా జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జూన్ 11 నుంచి ఇప్పటి వరకు 743 మంది(అర్చకులు, టీటీడీ సిబ్బంది) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని డయల్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.

Andhra Pradesh: విజయవాడ కొవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది మృతి , పలువురికి గాయాలు, భయంతో పైఅంతస్తుల నుంచి దూకిన మరికొందరు, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

కొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారు ఝామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి....

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,17,040కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1900 దాటిన కరోనా మరణాలు

Team Latestly

కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 1353 కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు అంతేస్థాయిలో 1310 కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, చిత్తూరు, అనంతపూర్...

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 10,171 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇటీవల కాలంగా ఏపీ, మహారాష్ట్రతో పోటీపడుతుంది....

CM YS Jagan Temple: ఏపీ సీఎం జగన్‌కు గుడి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గోపాలపురం మండంలం రాజుపాలెం వైసీపీ నేతల అత్యుత్సాహం

Hazarath Reddy

సాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.

Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265 మందికి కరోనా, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స, అదే జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఈఎస్ఐ స్కాం నిందితులు

Hazarath Reddy

రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry central jail) కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్‌లో (Rajamahendravaram Central Prison) విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెంట్రల్‌ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చిన జైల్‌ సిబ్బంది 24 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement