ఆంధ్ర ప్రదేశ్

AP Won 15 Awards: ఏపీ ప్రభుత్వానికి 15 అవార్డులు, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 2020 అవార్డుల్లో భాగంగా రాష్ట్రానికి దక్కిన పురస్కారాలు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఏటా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో (Central Panchayati Raj Department annual awards) భాగంగా 2020 సంవత్సరానికిగానూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 15 అవార్డులను (AP Won 15 Awards) సొంతం చేసుకుంది. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ అవార్డులను పంచాయతీరాజ్‌ శాఖ ఏపీకి అందించింది. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆనందం వ్యక్తం చేశారు.

CM Ramesh COVID-19 Positive: సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బీజేపీ ఎంపీ, కరోనాతో మరో తిరుమల అర్చకుడు మృతి

Hazarath Reddy

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CM Ramesh tests positive for COVID-19) అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు (BJP MP CM Ramesh) కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

తూర్పు గోదావరి జిల్లా నుంచి నుంచి అత్యధికంగా 1,351 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లా నుంచి 1285, మరియు అనంతపూర్ జిల్లా నుంచి 1112 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి....

AP Colleges Reopen Date: ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్, 3 లేక 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం, సీఎం సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన విద్యా శాఖ మంత్రి సురేష్

Hazarath Reddy

అక్టోబ‌ర్ 15 నుంచి అన్ని కాలేజీల‌ను (AP Colleges Reopen Date) ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న సెట్‌ల‌ను సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కళాశాల‌ల్లో నాడు- నేడు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతామ‌ని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాల‌లు ఆన్‌లైన్‌లో అడ్మిష‌న్లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఏవైనా కాలేజీలు అక్ర‌మాల‌కు పాల్పడితే వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

Visakha CP RK Meena: విశాఖలో తొలి అడుగు పోలీస్ శాఖదేనా? ఆరుగురు అధికారుల ప్ర‌త్యేక బృందంతో ఇప్పటికే క‌మిటీ, 15 రోజుల్లో డీజీపీకి తుది నివేదికను అందిస్తామని తెలిపిన విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా

Hazarath Reddy

ఏపీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానిగా ఆమోదముద్ర పడిన నేపధ్యంలో పోలీస్ శాఖ ఆవశ్యకత, మౌలిక సదుపాయాల కల్పనపై తమ కమిటీ పరిశీలన చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా (Rajeev Kumar Meena) అన్నారు. ఆరుగురు అధికారుల ప్ర‌త్యేక బృందంతో క‌మిటీని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఒక‌సారి స‌మావేశ‌మైన ఈ బృందం మ‌రో మూడుసార్లు స‌మావేశమ‌య్యి తుది నివేదిక‌ను 15 రోజుల్లో డీజీపీకి అందిస్తామ‌ని సీపీ (Viaskha CP Rajeev Kumar Meena) అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ‌లో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లను అంద‌జేశామ‌న్నారు. దీంతో పాటు క్రైం, విఐపిల సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ పూర్తిగా పరిశీలన జరుపుతుంద‌ని వెల్ల‌డించారు.

SPY Agro Industry Explosion: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ పేలుడు, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా నంద్యాలోని ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం (SPY Agro Industry Explosion) చోటు చేసుకుంది. ఆగ్రో ఫ్యాక్టరీలోని (agri-chemical industry)బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి (Nandyal Govt Hospital) తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.

AP Three Capitals Row: రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై (AP Three Capitals Row) ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ (Home Ministry) గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో (AP High Court) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని (AP Capital) నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది.

AP Coronavirus Bulletin: ఏపీలో 95 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు, లక్ష మార్కును దాటిన కోవిడ్ డిశ్చార్స్ కేసులు, తాజాగా 10,128 కేసులు నమోదు, లక్షా 90 వేలకు చేరువలో కోవిడ్-9 కేసులు

Hazarath Reddy

ఆంధ‌ప్ర‌దేశ్‌లో కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు (AP Coronavirus Bulletin) దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు (new coronavirus cases) న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో ( health bulletin) పేర్కొంది. దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది.

Advertisement

AP Unlock 3.0 Guidelines: ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 3.0 అమలు (AP Unlock 3.0) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్‌లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్‌లు, జిమ్‌లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.

Apex Council Meeting Postponed: తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా, తదుపరి సమావేశాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర జల శక్తి శాఖ

Hazarath Reddy

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) కేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరుకాలేనని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జల శక్తిశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. త్వరలోనే మరో సమావేశం తేదీని తెలియచేస్తామని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

Kasibugga CI Suspended: దళితుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌, స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన విశాఖ‌ప‌ట్నం డీఐజీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐ వేణుగోపాల్‌ను (Srikakulam kasibugga ci) పోలీస్ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని సీరియస్ గా తీసుకున్న ఏపీ డీజీపీ కార్యాల‌యం (AP DGP Office) దీనిపై విచారణ చేపట్టింది. ప్రాథమిక విచార‌ణ జ‌రిపిన అనంత‌రం విశాఖ‌ప‌ట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల‌న్‌ను (kasibugga CI Suspended) స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

AP Covid-19 Update: కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ, కోవిడ్ బారీన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీలో తాజాగా 9,747 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 9,747 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు (AP Coronavirus Report) 1,76,333కి చేరాయి. తాజాగా 67 మంది మృతితో (AP Coronavirus Deaths) మొత్తం మరణాలు 1,604కి చేరాయి. ఆస్పత్రుల నుంచి 6,953 మంది డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95,625కి చేరింది. యాక్టివ్‌ కేసులు (Active Cases) 79,104 ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు 40,732 పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకు 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 21,75,070కి చేరింది.

Advertisement

Three Capitals Row: మూడు రాజధానులపై హైకోర్టు స్టే, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 14కు విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై (three separate capitals) రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.

Three Capitals Issue: చంద్రబాబు 48 గంటల సవాల్, అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామంటూ పిలుపు, మీరు రాజీనామా చేసి వస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని తెలిపిన పేర్ని నాని

Hazarath Reddy

మూడు రాజధానుల అంశంపై (Three Capitals Issue) ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలని, అందరం కలసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మీడియాతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని (AP Capital) ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

Gollapudi Rape and Murder Case: చిన్నారిపై అత్యాచారం,హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష, సంచలన తీర్పు వెలువరించిన విజయవాడ స్పెషల్‌ పోక్సో కోర్టు, 2019లో అమానుష ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో విజయవాడ స్పెషల్‌ పోక్సో కోర్టు (Vijayawada POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. గొల్లపూడిలోని (Gollapudi village) నల్లకుంటలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది.

Vizag Vijayasri Pharma Explosion: వైజాగ్‌లో మరో పేలుడు, విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తప్పిన పెనుప్రమాదం

Hazarath Reddy

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా రాబోతున్న విశాఖపట్నంలోని పరిశ్రమల్లో పదే పదే అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.

Advertisement

AP Govt Key Decision: వరుస ప్రమాదాలు..ఏపీ సీఎం కీలక నిర్ణయం, పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు, జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు (Industrial Accidents) జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం (AP Govt Key Decision) తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ (Special Drive) చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

PM Kisan Yojana: బ్యాంకు అకౌంట్లో నేరుగా రూ. 2 వేలు, పీఎం కిసాన్ ఆరవ విడత డబ్బులు ఆగస్టు 1 నుంచి విడుదల, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోండి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ (Prime Minister Kisan Samman Nidhi Yojana) ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో (Farmers Accounts) జమ చేయనుంది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన సమ్మాన్ నిధి స్కీమ్ (PM Kisan Yojana) ద్వారా వారికి ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే.

Vangapandu Dies: వంగపండు ప్రసాదరావు కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) (Vangapandu Prasad Rao) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో (Cardiac arrest) కన్నుమూశారు. వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం (AP CM Jagan expresses condolence) వ్యక్తం చేశారు.

Heavy RainFall Warning: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం, రాగ‌ల 24 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశ‌ం

Hazarath Reddy

ఉత్త‌ర బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీట‌ర్ల ఎత్తులో నైరుతి వైపు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డిన‌ట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగ‌ల 24 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశ‌మున్న‌ట్లు వెల్ల‌డించింది. అల్ప‌పీడనం ప్ర‌భావంతో ద‌క్షిణ కోస్తా, ఉత్త‌ర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం (Heavy RainFall Warning) ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబ‌డి గంట‌కు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయ‌ని , మ‌త్స‌కారులెవ‌రూ వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement