ఆంధ్ర ప్రదేశ్
Telangana: తెలంగాణలో 1100 దాటిన కోవిడ్-19 కేసులు, కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు, హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Team Latestlyహైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా....
AP CM YS Jagan Review: వలస కూలీల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వైఎస్సార్ మత్స్యకార భరోసా లాంచ్
Hazarath Reddyరాష్ట్రంలో కోవిడ్‌-19 (Covid'19 in AP) నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు (Migrant workers) అదే విధంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Coronavirus In Telugu States: ఏపీలో 60, తెలంగాణలో 11 కొత్త కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం షాపులు, తెలంగాణలో జోన్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా (Coronavirus In Telugu States) చాపకొంద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా ఏపీలో 60 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 29వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించగా. ఏపీలో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇక రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం కొనుగోలు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు.
AP CM Video Conference: కలెక్టర్లు,ఎస్పీలతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధానికి (liquor ban in AP) తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికే లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో (Collectors, SP's) మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
Cyclone Amphan: ఏపీకి తుఫాను ముప్పు, వాయుగుండంగా మారుతోన్న అల్పపీడనం, ఎంఫాన్‌‌ తుఫాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా (South Andaman Sea) ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. ఎంఫాన్‌ తుఫాన్ ఓడిస్సా పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
AP COVID-19 Bulletin: కర్నూలులో 516కు చేరిన కరోనా కేసులు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 67 కేసులు నమోదు, రాష్ట్రంలో 1717కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ (AP Coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో (AP COVID-19 Bulletin) పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 589 మంది డిశ్చార్జ్‌ కాగా 1094 మందికి చికిత్స కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 34 మంది మృతి చెందారు.
Alcohol Prices Hiked In AP: మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
Hazarath Reddyరాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం... తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ (Liquor Prices Hiked In AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం (AP Govt) తెలిపింది.
AP Covid-19 Report: రాష్ట్రంలో 1650కి చేరిన కరోనావైరస్ కేసులు, 524 మంది కోలుకుని డిశ్చార్జ్, 33 మంది మృతి, తాజాగా 67 కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు (Andhra pradesh covid 19 pandemic) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra pradesh) కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది (Coronavirus Deaths) మృతి చెందారు.
Lockdown Violation in AP: ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నేటి నుంచి మద్యం దుకాణాలను తెరవడంతో పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ (Tamil Nadu and Telangana) రాష్ట్రాల నుంచి మందుబాబులు పోటెత్తారు. మద్యం కొనుక్కొనేందుకు మద్యం ప్రియుల బారులు తీరారు. కాగా తమిళనాడులో మద్యం అమ్మకాలు జరగకపోవడంతో అక్కడినుంచి మందుబాబులు బార్డర్ దాటుకుని (TN Andhra border) చిత్తూరు జిల్లా పాలసముద్రానికి తరలిచ్చారు. మద్యం కొనుగోలు కోసం దుకాణాల మందు బుద్ధిగా బారులు తీరి మరీ నిలుచున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూకట్టారు.
Amphan Cyclone: ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ (Coronavirus) కోర‌ల్లో చిక్కుకుని పోయిన ఏపీకి (Andhra pradesh) మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండ‌మాన్‌కు దక్షిణదిశగా ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా వాయుగుండంగా మార‌బోతోందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌పడి తీవ్ర‌మైన తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు ఎంఫాన్‌గా (Amphan Cyclone) నామ‌క‌రణం చేశారు.
Telangana Lockdown 3.0: మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోంది, స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి అమల్లోకి ఈ పాస్ విధానం, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం విజ్ఞప్తి
Hazarath Reddyకరోనా- లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి.. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం. రెండు.. రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలు నిర్దిష్ట వేళల్లో తెరిచేందుకు అనుమతివ్వడం.
Andhra Pradesh Lockdown 3.0: ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyదేశ వ్యాప్తంగా మూడవ దశ లాక్‌డౌన్ (Lockdown 3.0) నేటి నుంచి అమల్లోకి రానుంది. మే 17 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ 3.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా మూడవ దశ లాక్‌డౌన్‌ను (Andhra Pradesh Lockdown 3.0) రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. కరోనా (Coronavirus) నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా నేటి నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1583 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య; సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తుండటంతో ఏపీ-టీఎస్ బార్డర్ వద్ద ట్రాఫిక్ జాం
Team Latestlyగత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లా నుంచి 11, కృష్ణా నుంచి 8, అనంతపూర్ జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి.....
IAF Tribute to COVID19 Warriors: కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం
Team Latestlyకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై సహా దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలోని కోవిడ్-19 ఆసుపత్రులపై భారత వాయుసేన పూలవర్షం కురిపించింది. కరోనా పోరాట యోధులందరినీ బయటకు ఆహ్వానించి, హెలికాప్టర్ల ద్వారా వారిపై పూలు చల్లుతూ వందనాలు పలికింది. ఈ అపురూపమైన గౌరవానికి వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది....
COVID-19 in India: భారత్‌లో 40 వేలకు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2644 పాజిటివ్ కేసులు నమోదు, 1300 దాటిన కరోనా మరణాలు
Team Latestlyమహరాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు వరకు 5,054 కు చేరగా 262 కరోనా మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో 4122, మధ్యప్రదేశ్ 2846, రాజస్థాన్ 2770, తమిళనాడు 2757, ఉత్తర ప్రదేశ్ 2487 మరియు పశ్చిమ బెంగాల్ లో 922 కేసులు.....
Coronavirus in AP: ఆంధ్రప్రదేశ్‌లో 1500 దాటిన కోవిడ్-19 బాధితులు, గత 24 గంటల్లో 5943 సాంపిల్స్‌ని పరీక్షిస్తే 62 మంది పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
Team Latestlyగత 24 గంటల్లో జిల్లాల నుంచి అందిన రిపోర్ట్స్ మేరకు అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచి 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లా నుంచి 12, నెల్లూరు నుంచి 6, అనంతపూర్ 4.......
Telugu States Coronavirus: ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో తాజాగా 6 కేసులు, మూడవ దశ లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన కేంద్రం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States COVID-19) రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో శుక్రవారం ఉదయానికి తాజాగా 60 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.
'Thanks to Gujarat CM': గుజరాత్ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం జగన్, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశాభావం
Hazarath Reddyలాక్‌డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో ( Gujarat) చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను (Telugu fishermens) ఏపీకి తరలించడంలో సహకరించినందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానికి(Gujarat CM Vijay Rupani), అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ( AP CM YS Jagan Mohan Reddy) ట్వీట్‌ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బయోమెట్రిక్‌ బదులుగా జియో ట్యాగింగ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్‌‌ను (social security pensions) అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ బదులుగా పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్‌ (geotagging) చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వాలంటీర్లు వైఎస్సార్ పెన్షన్‌ కానుకను పంపిణీ చేస్తున్నారు.
Thunderbolt Warning: ఏపీలో మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం, రాగల 24గంటల్లో అల్పపీడనం, హెచ్చరించిన వాతావరణ శాఖ కమిషనర్
Hazarath Reddyదక్షిణ అండమాన్‌ పరిసరాల్లో రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి, తదుపరి 48గంటల్లో అది మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. రానున్న 49గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో 41-43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.