ఆంధ్ర ప్రదేశ్

TTD Free Laddu: అదనపు లడ్డు కోసం రూ.50 చెల్లించాల్సిందే, నేటి నుంచి ప్రతీ భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు, భక్తులకు కావాల్సినన్ని లడ్డులు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు, నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమల్లోకి

Hazarath Reddy

తిరుమలను సందర్శించుకున్న ఎవరైనా... శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara) లడ్డును తీసుకోకుండా వెనుతిరగరు. భక్తులకు ఇప్పుడీ లడ్డు మరింత చేరువైంది. ఇప్పటివరకు లడ్డూలను రాయితీపై కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక అలా అవసరం లేదు. రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) స్వస్తి పలకనుంది.

Manoj Shashidhar: కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్‌ ఐపీఎస్ అధికారి, అయిదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న మనోజ్ శశిధర్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ

Hazarath Reddy

సీబీఐ జాయింట్ డైరెక్టర్ (CBI Joint Director) గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్(Senior IPS officer Manoj Shashidhar) నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్(Gujarat)కు చెందిన అధికారి. ఈ పదవిలో మనోజ్ శశిధర్ అయిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన మనోజ్ గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, (PM Modi) అమిత్ షాలకు(Amit Shah) ఆయన అత్యంత సన్నిహిత అధికారిగా కూడా పేరు ఉంది.

Andhra Pradesh Cabinet Meeting: మరో రెండు రోజుల్లో తేలిపోనున్న రాజధాని వ్యవహారం, 20కి వాయిదా పడిన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజు.., రాజధానిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం

Hazarath Reddy

ఏపీ కేబినెట్ సమావేశం (Andhra Pradesh Cabinet Meeting)వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ (AP CM YS Jagan) అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. దీనికి కారణం లేకపోలేదు. రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

AP Cabinet Meet Update: రాజధానిపై ప్రకటనకు ముందు ప్రధాని మోదీతో చర్చించనున్న సీఎం జగన్? శనివారమే ఏపీ కేబినేట్ భేటీ, హైపవర్ కమిటీ నివేదికపై చర్చ, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Vikas Manda

మరోవైపు ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలోనే రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రకటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.....

Advertisement

Anti CAA & NPR Row: కేరళ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్రం, తెలంగాణలో ఎన్‌పిఆర్ నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి

Vikas Manda

బీజేపీ ప్రభుత్వం చేపట్టనున్న NPR తెలంగాణలోని ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, రైతులు మరియు పేదవారి హక్కులను దెబ్బతీస్తుందని తెలిపారు. NPR వల్ల పేద ప్రజలు అన్యాయానికి గురవుతారు,అసదుద్దీన్ ఓవైసీ....

AP Capital Stir-High Court: రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, మరోసారి సీఎంతో భేటీ కానున్న హైపవర్ కమిటీ, అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు, విచారణ సోమవారానికి వాయిదా

Hazarath Reddy

రాజధానిపై గత కొంత కాలంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన విషయం అందరికీ విదితమే. ఇప్పటికే బోస్టన్ కమిటీ, (Bostan Committee) జీఎన్ రావు కమిటీలు(GN Rao Committee) సీఎం జగన్ కు నివేదికలు సమర్పించాయి. ఇక రాజధానిపై హైవర్ కమిటీ (AP High Power Committee)మాత్రమే నివేదిక ఇవ్వాలి. ఈ నేపథ్యంలొ ఈ రోజు సీఎం జగన్(CM YS Jagan)తో హైపవర్ కమిటీ భేటీ అయింది.

Sake Sailajanath: ఏపీ హస్తానికి కొత్త సారధి, పీసీసీ చీఫ్‌గా సాకే శైలజానాధ్, రఘువీరా రెడ్డి రాజీనామా తరువాత ఖాళీగా పీసీసీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లతో పరాజయం పాలైన సాకే శైలజానాధ్

Hazarath Reddy

ఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాధ్ (Former minister Sake Sailajanath)నియమితులయ్యారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections 2019 ) తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి (Raghu veera reddy)రాజీనామా చేశారు. నాటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా పీసీసీ అధ్యక్ష ఖాళీగా ఉంది.

FASTags Increase Wait Time: నిరీక్షణ సమయం పెంచుతున్న ఫాస్టాగ్స్, టోల్ ప్లాజా వద్ద సాంకేతిక అవాంతరాలు, మినిమం బ్యాలెన్స్ లేదంటూ 'డబుల్' దోపిడి, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

Vikas Manda

నిర్మల్ జిల్లా సమీపంలో గల గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఓ వాహనదారుడు ఫాస్టాగ్ కలిగి ఉండి టోల్ ఛార్జీకి సరిపోయే మొత్తం ఖాతాలో ఉన్నప్పటికీ మినిమం బ్యాలెన్స్ లేదంటూ అతడి నుంచి రెట్టింపు టోల్ వసూలు చేశారు. ఆపై అతడి పేటీఎం ఖాతా నుంచి కూడా టోల్ తీసివేయబడింది.....

Advertisement

Janasena - BJP: గ్లాసులో వికసించిన కమలం పువ్వు! జనసేన- బీజేపీ భావజాలం ఒక్కటే, 2024లో అధికారంలోకి వస్తాం, అధికారికంగా పొత్తు వివరాలను వెల్లడించిన పవన్ కళ్యాణ్

Vikas Manda

గతంలో ఏపీలో అవినీతి పాలన ఉండేది, ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం నడుస్తుంది. ప్రజలు విసిగెత్తిపోయారు. తృతీయ కూటమిని కోరుకుంటున్నారు. దానినే ప్రజలకు జనసేన- బీజేపీ కూటమి అందించబోతుంది. ప్రధాని మోదీ, అమిత్ షాల నమ్మకాన్ని నిలబెడతామని తెలిపారు....

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్ సంస్థాగత ఎన్నికల జీవోపై సుప్రీంకోర్ట్ స్టే, రిజర్వేషన్లపై జగన్ సర్కార్ నిబంధనలు అతిక్రమించిందని పిటిషన్, విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం

Vikas Manda

తాపరెడ్డి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసినప్పటికీ ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చునని సూచించింది. ఈనెల 17న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది....

Sankranthi Pandelu: ఆంధ్రాలో కత్తిదూసిన కోడిపుంజు, తమిళనాడులో కాలుదువ్విన ఎద్దు, ఊర్లలో మొదలైన సంక్రాంతి సంబరాలు, జోరుగా పందేలు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Vikas Manda

ఈరోజు కూడా పందెంకోళ్లు పౌరుషం చూపిస్తున్నాయి. పుంజుల కాళ్లకు కత్తులు కట్టి, కోడి పుంజుల పొట్లాటను ప్రజలు వేడుకగా చూశారు. ఎక్కడికక్కడ టెంట్లు వేసి జోరుగా పందేలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఐపీఎల్ రేంజ్ లో ఫ్లడ్ లైట్స్ పెట్టి మరి కోడిపందేలు నిర్వహిస్తున్నారు....

Pawan Kalyan: బీజేపీ ఎఫెక్ట్.. భారీ డైలాగ్స్ పేల్చిన పవన్ కళ్యాణ్, 'చూస్తూ ఊరుకోమని' జగన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్, రాష్ట్ర పరిణామాలపై కేంద్రంలోని బీజేపి నేతలతో చర్చించినట్లు వెల్లడించిన జనసేనాని

Vikas Manda

మాకు బలం ఉంది కాబట్టే భరిస్తున్నాం, శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు, తెగించి రోడ్లమీదకు వస్తాం. నా మాట, నా సంస్కారం నియంత్రణలో ఉన్నాయి. 151 ఎమ్మెల్యేలు ఏమైనా దిగొచ్చారా?.....

Advertisement

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

Hazarath Reddy

ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project)తాజా నివేదిను సమర్పించాలని ఏపి ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.

Republic Day Celebrations In AP: రాజధానిపై మరో ఝలక్, విశాఖలోనే గణతంత్ర వేడుకలు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్, ఆర్కే బీచ్ వేదికగా వేడుకలు, జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు

Hazarath Reddy

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు(Republic Day celebrations) విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌ను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద (RK beach At Visakhapatnam) నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హాజరు కానున్నారు.

Amaravati Parirakshana Samithi: జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు, రాజధానిగా అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ధర్నా, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామన్న అమరావతి రైతులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతి(Amaravathi) తరలింపును నిరసిస్తూ విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,(TDP leader N Chandrababu Naidu) అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు( Amaravati Parirakshana Samithi) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, ( GN Rao Committee report)బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

Amaravati Stir: రాజధాని మార్చాలంటే వైకాపా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి, ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమేనా? వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు

Vikas Manda

ఒకప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేశాను, ఇప్పుడు నేనేమైనా హైదరాబాద్ ఫలాలను అనుభవిస్తున్నానా? అలాగే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తానంటున్నాను. దాని ఫలాలను నేనేమైనా అనుభవిస్తానా? తాను ఏం చేసినా భావితరాల కోసమేనని చంద్రబాబు అన్నారు.....

Advertisement

YSR Lifetime Achievement Awards: ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎంపిక కోసం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆగస్టు 15, జనవరి 26వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను (YSR Lifetime Achievements Awards)ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet)తీసుకున్న సంగతి విదితమే. ఈ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం(AP Government) హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

Pawan Kalyan In Delhi: ఢిల్లీలో జనసేనాధినేత, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, రాజధాని మార్పు, సీఎం జగన్ నిర్ణయాలపై సమాలోచనలు, నేరుగా కాకినాడకు రానున్న పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో (Delhi) బీజేపీ(BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను(Jagat Prakash Nadda) కలిసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

AP Capital: ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత, ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం, 17న మరోసారి సమావేశం కానున్న హైపవర్ కమిటీ

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్‌ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్‌ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

Jagan-KCR Meet: 4వసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదిక కానున్న ప్రగతి భవన్, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, పెండింగ్‌లో ఉన్న అంశాలు, చర్చకు వచ్చే అంశాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States Chief Ministers) నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..(Chief Minister K Chandrasekhar Rao)ఏపీ ముఖ్యమంత్రి జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) ను విందుకు ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.

Advertisement
Advertisement