ఆంధ్ర ప్రదేశ్

Amaravati Parirakshana Samithi: జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు, రాజధానిగా అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ధర్నా, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామన్న అమరావతి రైతులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతి(Amaravathi) తరలింపును నిరసిస్తూ విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,(TDP leader N Chandrababu Naidu) అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు( Amaravati Parirakshana Samithi) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, ( GN Rao Committee report)బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

Amaravati Stir: రాజధాని మార్చాలంటే వైకాపా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి, ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమేనా? వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు

Vikas Manda

ఒకప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేశాను, ఇప్పుడు నేనేమైనా హైదరాబాద్ ఫలాలను అనుభవిస్తున్నానా? అలాగే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తానంటున్నాను. దాని ఫలాలను నేనేమైనా అనుభవిస్తానా? తాను ఏం చేసినా భావితరాల కోసమేనని చంద్రబాబు అన్నారు.....

YSR Lifetime Achievement Awards: ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎంపిక కోసం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆగస్టు 15, జనవరి 26వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను (YSR Lifetime Achievements Awards)ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet)తీసుకున్న సంగతి విదితమే. ఈ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం(AP Government) హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

Pawan Kalyan In Delhi: ఢిల్లీలో జనసేనాధినేత, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, రాజధాని మార్పు, సీఎం జగన్ నిర్ణయాలపై సమాలోచనలు, నేరుగా కాకినాడకు రానున్న పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో (Delhi) బీజేపీ(BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను(Jagat Prakash Nadda) కలిసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

Advertisement

AP Capital: ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత, ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం, 17న మరోసారి సమావేశం కానున్న హైపవర్ కమిటీ

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్‌ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్‌ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

Jagan-KCR Meet: 4వసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదిక కానున్న ప్రగతి భవన్, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, పెండింగ్‌లో ఉన్న అంశాలు, చర్చకు వచ్చే అంశాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States Chief Ministers) నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..(Chief Minister K Chandrasekhar Rao)ఏపీ ముఖ్యమంత్రి జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) ను విందుకు ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.

Alla Ramakrishna Reddy Arrest: ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు, అయినా ర్యాలీకి సిద్ధమైన ఎమ్మెల్యే ఆర్కే, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని(YSRCP MLA Alla Ramakrishna Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే(MLA RK) మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి (Mangalagiri) నుంచి తాడేపల్లిలోని(Tadepalli) ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)నివాసం వరకూ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్దయెత్తున వైసీపీ శ్రేణలు మంగళగిరికి చేరుకున్నాయి. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయినా ర్యాలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్దమవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Prudhvi Raj Audio Leaked: వెనక నుంచి పట్టుకుందామనుకున్నా, నువ్వే గుర్తుకు వస్తున్నావు, కలకలం రేపుతున్న ఎస్వీబీసీ చైర్మన్ రాసలీలల ఆడియో టేపు, ఆ వాయిస్ తనది కాదంటున్న యాక్టర్ పృథ్వీరాజ్, కఠిన చర్యలు దిశగా ప్రభుత్వం

Hazarath Reddy

ఎస్వీబీసీ చైర్మన్,(SVBC chairman) సినీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) ఇప్పటికే పోసానితో(Posani Krishna Murali) వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement

AP Special Assembly Session: క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, రాజధానిపై కమిటీలు అందించిన నివేదికపై చర్చలు, కీలక ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై (AP Capital)ఏదో ఒకటి తేల్చేందుకు ప్రభుత్వం (AP GOVT) శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (AP Legislative assembly), 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ (High Power committee) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

AP High Court New Judges: ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు, ఇప్పుడు మొత్తం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19, న్యాయవాదుల కోటా నుంచి నలుగురు నియామకం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్ర హైకోర్టు ( high court) న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది.

AP Capital-Political Stir: అమరావతిలో భూమి విలువ కోటీ నుంచి రూ.10 లక్షలకు పడిందన్న చంద్రబాబు, బాబుకు సలహాలిచ్చేది చిట్టినాయుడే అంటున్న విజయసాయి రెడ్డి, తిరుపతిలో చంద్రబాబు ర్యాలికి అనుమతిని నిరాకరించిన పోలీసులు, రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

రాజధాని అంశం (Ap Capital Issue) మీద ఓ పక్క నిరసనలు, మరో పక్క స్వాగతిస్తూ ర్యాలీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం (AP GOVT)నుంచి ఏపీ రాజధాని అంశంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఎవరికి వారు తమ అబిప్రాయాలతో ఏపీలో (AP) వేడిని పుట్టిస్తున్నారు. టీడీపీ నేతలు (TDP) అమరావతే రాజధానిగా (Amraravathi) ఉండాలంటూ ధర్నాలు నిరసనలు చేస్తుంటే దీనికి భిన్నంగా వైసీపీ నేతలు(YSRCP) మూడు రాజధానులకు (3 Capitals) అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

AP Capital-Sujana Chowdary: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్న బీజేపీ నేత జీవీఎల్, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న బీజేపీ నేతలు

Hazarath Reddy

అమరావతిని (Amaravathi) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ఒక్క అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి (BJP MP Sujana Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో రైతుల పోరాటానికి కేంద్రంలోని మా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నానని, ఈ విషయంలో అవసరమైతే తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు.

Advertisement

CBI Summons Minister Sabitha: ఏపీ సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు, జనవరి 17న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

Vikas Manda

అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపు మరియు తాండూర్‌ తదితర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది....

AP Capital-Foot March: అమరావతిలో ఉద్రిక్తత, మహిళలపై లాఠీచార్జ్, పలువురికి గాయాలు, గుంపులుగా రావడంతోనే వారిని నిలువరించామన్న పోలీసులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ, వేడెక్కిన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్

Hazarath Reddy

అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిని (AP Capital) అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్దండరాయునిపాలెం(Uddandrayuni Palem) నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (Kanakadurga temple) వరకు మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

Fact-Finding Committee: అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ, మహిళలపై పోలీసుల దాడిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు, ట్విట్లర్లో వెల్లడించిన జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

Hazarath Reddy

ఏపీ రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని(Fact-Finding Committee ) అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma)ట్విట్టర్ లో తెలిపారు.

AP Capital Issue: రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గ్రేటర్ రాయలసీమను ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల, రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు, నేతలు ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానులు అంశం (AP 3 Capital issue) వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (Minister Sriranganatha Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని (Rajamandri) 4వ రాజధాని చేయాలని. సాంస్కృతిక రాజధానిగా దాన్ని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళుతామని ఆయన అన్నారు.

Advertisement

Jagananna Vidya & Vasathi Deevena: ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 30 వేలు, నేరుగా తల్లుల ఖాతాలో జమ, జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

ఏపీలో పరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ (CM Jagan) మరో రెండు కొత్త (Two New Schemes)శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’,(Jagananna Vidya Deevena) ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) అనే రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నారు.

AP CM YS Jagan: సీఎం హోదాలో తొలిసారిగా నాంపల్లి కోర్టుకు ఏపీ సీఎం జగన్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తెలంగాణా పోలీసులు, గత ఏడాది మార్చి 1న చివరి సారిగా సీబీఐ కోర్టుకు హాజరయిన ఏపీ సీఎం

Hazarath Reddy

అక్రమాస్తుల కేసుల విషయంలో ఏపీ (Andhra pradesh)సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP Cm YS Jagan)నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు (CBI court) వచ్చారు.

Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్య పెంపు, పండగ సీజన్‌కు ప్లాట్‌ఫాం ధరలనూ రెట్టింపు చేసిన రైల్వే శాఖ

Vikas Manda

పనిలోపనిగా సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.....

Amma Vodi Scheme: విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, పిల్లల చదువు కోసం ప్రతి పేద విద్యార్థి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక చేయూత, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధనే లక్ష్యం అని వెల్లడించిన సీఎం

Vikas Manda

వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంలో సమస్యలు ఎదుర్కొనే విద్యార్థుల కోసం....

Advertisement
Advertisement