తెలంగాణ

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 3,043 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదు, తాజాగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 59,709 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,043 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు.

CM KCR Review Meeting: లాక్‌డౌన్‌, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, సమావేశానికి హాజరైన డీజీపీ,హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష (CM KCR Review Meeting) జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.

Hyderabad: వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం, మహిళ సజీవ దహనం, ఆమె భర్త, పిల్లలకు తీవ్ర గాయాలు, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని వనస్థలిపురం (Vanasthalipuramఏఎఫ్‌సీఐ కాలనీలోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ మహిళ (Woman Charred to Death in Fire) సజీవ దహనమైంది. మొదటి అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.

Lockdown in Telangana: అలర్డ్ న్యూస్..ఈ-పాస్ ఉంటేనే తెలంగాణ‌లోకి అనుమ‌తి, పోలీసుల కఠిన ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ ఆగిన వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే అనుమతి

Hazarath Reddy

పెరుగుతున్న కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్‌ (అనుమతి) తీసుకోవాల్సిందేనని ( without e-pass restricted entry by TS Police) తేల్చిచెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

TS Coronavirus Update: తెలంగాణలో 5 రూపాయలకే కరోనా మృతుల దహన సంస్కారాలు, తాజాగా 2,242 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 343 కొత్త కేసులు, తెలంగాణలో 12వ రోజుకు చేరుకున్న లాక్‌డౌన్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,242 పాజిటివ్ కేసులు (TS Coronavirus) వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు గుర్తించారు.

Cyberabad Road Accident: సైబరాబాద్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సైబరాబాద్ పోలీసులు, ట్విట్టర్‌లో ప్రమాదాన్ని తెలిపే వీడియో ట్వీట్

Hazarath Reddy

రోడ్డుపై వాహనం నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా అధిక వేగంతో నడిపేవారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు పైకే పోతాయి.

Telangana Shocker: పెళ్లి వద్దంటావా..బీరు బాటిల్‌తో ప్రేయసిని పొడిచి చంపేసిన ప్రియుడు, నల్గొండ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని నల్గొండ జిల్లాలోప్రేమోన్మాది మద్యం మత్తులో చెలరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని అతి దారుణంగా హతమర్చాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ శివం హోటల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రియురాలు చందనను శంకర్ బీరు సీసాతో పొడిచి (boyfriend killed his girlfriend with a beer bottle) చంపేశాడు.

Telangana: తెలంగాణలోని 10 యూనివర్శిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించిన రాష్ట్ర సర్కార్, ఆమోదించిన రాష్ట్ర గవర్నర్, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను...

Advertisement

Universities Vice Chancellors: పది విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, రెండున్నరేళ్ల తర్వాత యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి జాబితా ఇదే..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది.

COVID19 in TS: తెలంగాణలో క్రమేపీ తగ్గుతున్న కోవిడ్ కేసులు, కొత్తగా 3308 మందికి పాజిటివ్, 4723 మంది రికవరీ, రాష్ట్రంలో 42,959కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు వారాల కిందట 4 వేలకు పైబడి నమోదయ్యే కేసులు, ఇప్పుడు 3 వేలల్లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మే 30వ తేదీ వరకు 20 గంటల లాక్ డౌన్ అమలులో ఉండనుంది...

Telangana Lockdown: బయటకు వస్తే కేసులు, వాహనాల సీజ్, తెలంగాణలో కఠినంగా లాక్‌డౌన్ అమలు, పలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను నిర్వహించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ 11వ రోజుకు చేరుకుంది. మినహాయింపు సమయాల్లో జనం భారీగా రోడ్లపైకి రావడంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేటి నుంచి నుంచి 8 రోజుల పాటు లాక్‌డౌన్‌‌కి (Telangana Lockdown) సహకరించాలని పోలీస్ శాఖ వినతి చేసింది.

Jai Srinivas & Cartoonist Gopi Dies: వారిద్దరి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం, కరోనాతో కన్నుమూసిన జైశ్రీనివాస్‌, కోవిడ్‌ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రముఖ చిత్రకారుడు గోపి

Hazarath Reddy

నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

TS Coronavirus: తెలంగాణలో కొత్తగా 3,464 కరోనా కేసులు, 25 మంది మృతి, గత 24 గంటల్లో 4801 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం 44,395 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 25 మంది మ‌ర‌ణించారు.

CM KCR Warangal Tour: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్, కోవిడ్ బాధితులకు పరామర్శ, ఆసుపత్రిలో వైద్యసేవలు, ఆక్సిజన్ సరఫరాపై ఆరా

Team Latestly

కేసీఆర్ శుక్రవారం మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిని సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి బాధితులను పరామర్శించారు...

TS SSC Results 2021: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ల ప్రదానం, ఏ గ్రేడ్ వచ్చిందో, ఫలితాలు ఎలా చూడవచ్చో తెలుసుకోండి

Vikas Manda

అందరూ ఉత్తీర్ణులైనట్లుగానే పేర్కొంది. అయితే విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ లేదా ఎఫ్‌ఏ 1 ఆధారంగా గ్రేడ్‌లను ప్రదానం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులకు...

Telangana: నేడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్; తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్ కేసులు

Team Latestly

ఈరోజు ఉదయం హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ్నించి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంటికి వెళ్తారు. అక్కడ్నించి 11:45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీకి సమీపంలో...

Advertisement

Black Fungus: బ్లాక్ ఫంగస్‌ను అంటు వ్యాధుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, ఇప్పటికే నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ; బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇలా ఉండొచ్చు

Team Latestly

బ్లాక్ ఫంగస్ కు చెందిన శిలీంద్ర కణాలు వాతావరణంలో ఉంటాయి. ఇవి చర్మంపై ఏవైనా తెగిన లేదా కాలిన లేదా మరేదైనా గాయం నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం శరీరం లోపల మరియు చర్మంపైన కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. కరోనా తీవ్రంగా ఉన్న వారిలో, కరోనా నుంచి కోలుకున్న...

TS Lockdown: మళ్ళీ లాక్‌డౌన్‌ ఉండకూడదు, కఠినంగా అమలు చేయాలని పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు, ఉదయం 10 గంటల తర్వాత వాహనం కనిపిస్తే సీజ్, ఈ ధపా అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు

Hazarath Reddy

తెలంగాణలో కోవిడ్‌ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి విదితమే. లాక్‌డౌన్ ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని (Telangana Enforce lockdown rules strictly) పోలీసు అధికారులకు డీ.జీ.పీ ఎం. మహేందర్ రెడ్డి (DGP M Mahender Reddy) ఆదేశించారు.

TS Coronavirus: తెలంగాణలో కొత్తగా 3,837 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు, కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన కేసీఆర్ సర్కారు, హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫీవర్ సర్వే

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,837 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు (GHMC Covid) నమోదయ్యాయి.

CM KCR Visits Gandhi Hospital: నేనున్నా..ధైర్యంగా ఉండండి, సీఎం హోదాలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి కేసీఆర్, వైద్య సేవల గురించి ఆరా, ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ సీఎం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని (CM KCR visits Gandhi Hospital) సందర్శించారు. స్వయంగా కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) దగ్గర ఉంది.

Advertisement
Advertisement