తెలంగాణ

India Covid Updates: నేటి నుంచి రెండో డోస్, దేశంలో 24 గంటల్లో 12,143 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 151 కరోనా కేసులు నమోదు, ఏపీలో 68 కొత్త కేసులు, ఇండియాలో 1,08,92,746కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 103 మంది కరోనా కారణంగా (Covid Deaths) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది.

TS Common Entrance Tests: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు 2021కి షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్ష; ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడగింపు

Team Latestly

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీని పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 100 రూపాయల ఆలస్య రుసుముతో చెల్లింపుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గడువు.....

Vaccination in TS: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేటితో ముగియనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, కేవలం 34 శాతం మందికి మాత్రమే లబ్దిదారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 143 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

ఫిబ్రవరి 11 వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 76,749 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది కేవలం 34 శాతం మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటివరకు 2,70,234 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు....

'Hyderabad a Mini India': హైదరాబాద్ ఒక విశ్వనగరం, భిన్న సంస్కృతులు కలిగిన మినీ ఇండియా, కలిసికట్టుగా నగరాభివృద్ధికి పాటుపడండి! కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ పాలకవర్గానికి సీఎం కేసీఆర్ హితబోధ

Team Latestly

హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నాయి. ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు....

Advertisement

GHMC Mayor: గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయ లక్ష్మీ ఎన్నిక, ఫలించిన టీఆర్ఎస్ వ్యూహం, అవలీలగా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం

Team Latestly

డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లుండే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్లో టీఆర్ఎస్ 56 డివిజన్లను కైవసం చేసుకోగా, బిజెపి 48 డివిజన్లను, ఎంఐఎం 44 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లతో చతికిలపడింది. గురువారం మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో.....

TS's COVID Report: తెలంగాణలో నేడు, రేపు కొనసాగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో 146 కోవిడ్ కేసులు నమోదు, 1825గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేడు కొనసాగి శుక్రవారంతో ముగియనుంది. రేపటితో రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ ముగుస్తుంది. బుధవారం నాటికి కేవలం 37 శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు....

GHMC Mayor Poll: నేడే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక, ఎవరికీ దక్కని మ్యాజిక్ ఫిగర్- రేసులో మూడు పార్టీలు, టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కొనసాగుతున్న ఉత్కంఠ

Team Latestly

మేయర్ పదవికి టిఆర్ఎస్ బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ వ్యూహంలో భాగంగా MIM పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ చర్య టిఆర్ఎస్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులను పొందటానికి సహాయపడుతుంది....

CM KCR Speech Highlights: నేను అబద్దాలు చెబితే టీఆర్‌ఎస్‌ను ఓడించండి, లేదంటే ప్రతిపక్షాలను తరిమికొట్టండి, కృష్ణా-గోదావరి నీటితో నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను, హాలియా సభలో ప్రతిపక్షాలపై మండిపడిన కేసీఆర్

Hazarath Reddy

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ (Haliya nagarjuna sagar) నిర్వహించింది. నల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ త‌ర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో (Telangana CM KCR Speech Highlights) ప్ర‌సంగించారు.ఈ సభలో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ (Telangana Chief Minister KCR) మండిపడ్డారు.

Advertisement

CM KCR Nellikal Inauguration: నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన, నాగార్జునసాగర్ హాలియాలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ, ప్రసంగించనున్న సీఎం

Hazarath Reddy

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటించారు. నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM KCR Nellikal Inauguration) చేశారు. ఈ పర్యటనలో భాగంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన 12 శిలాఫలకాల ఆవిష్కరించారు.

CM KCR Nalgonda Tour: దుబ్బాక దెబ్బతో అలర్ట్, నాగార్జునసాగర్‌ని కైవసం చేసుకోవాలనే వ్యూహంలో టీఆర్ఎస్, నేడు సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటన, పలు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు శంఖుస్థాపన

Hazarath Reddy

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ న‌ల్ల‌గొండ జిల్లాలో (CM KCR Nalgonda Tour) ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో న‌ల్ల‌గొండ‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 నందికొండ‌కు చేరుకోనున్నారు. అక్క‌డ్నుంచి 12:40 గంట‌ల‌కు రోడ్డుమార్గాన నెల్లిక‌ల్లుకు వెళ్ల‌నున్నారు. 12:45 గంట‌ల‌కు నెల్లిక‌ల్లులో 13 లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఒకే చోట శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

COVID Status in TS: కోవిడ్ టీకా తీసుకున్న కొన్ని రోజులకే కరోనా పాజిటివ్, తెలంగాణలో మందకోడిగా సాగుతున్న రెండో విడత వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల కిందట మొదటి డోసు టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇద్దరు వైద్యులు, మిగతా ఆరుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. వీరిని ఐసోలేషన్లో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలిపారు....

Telangana SSC Exam Timetable 2021: తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు, ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు, వెల్లడించిన టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.

Advertisement

YS sharmila New Party: వైయస్ పేరు లేకుండా షర్మిల లేదు, తెలంగాణ కన్నా తమిళనాడు లేదా కర్నాటకలో పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, షర్మిలా రెడ్డి కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ముద్దుల తనయ వైయస్ షర్మిల కొత్త పార్టీపై (ys sharmila party) నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ (YS sharmila New Party) పెట్టడం తన అన్న ఏపీ సీఎం వైయస్ జగన్ డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందన్నారు.

YS Sharmila New Party Row: తెలంగాణలో వైసీపీ ఏర్పాటు సీఎం జగన్‌కు ఇష్టం లేదు, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది షర్మిల వ్యక్తిగతం, అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీడియాతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు.

'Ravali Sharmila Kavali Sharmila': రావాలి షర్మిల కావాలి షర్మిల, లోటస్ పాండ్‌లో ఫ్లెక్సీల జోరు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం, అన్ని విషయాలు చెబుతానంటున్న వైయస్ షర్మిలా రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ లోటప్ పాండ్ లో రావాలి షర్మిల కావాలి షర్మిల నినాదాలతో మోగుతోంది. తెలంగాణలో వైయస్ అభిమానుల రాకతో లోటస్ పాండ్ లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు రావాలి షర్మిల కావాలి షర్మిల (Ravali Sharmila Kavali Sharmila) ప్లెక్సీలతో దర్శనమిచ్చారు. కాగా కొత్త పార్టీని (YS Sharmila Political Entry Suspence) ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు.

Y. S. Sharmila Meeting: అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) తెలంగాణలో కొత్త పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Advertisement

Telangana COVID Status: తెలంగాణలో కొత్తగా మరో 149 కోవిడ్ కేసులు నమోదు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొనసాగుతున్న టీకాల పంపిణీ, ఇప్పటివరకు వ్యాక్సిన్ చేయించుకున్నది కేవలం 38 శాతం మాత్రమే

Team Latestly

టీకా కోసం తమ పేరు నమోదు చేసుకున్న వారిలో చాలా తక్కువ మంది టీకాలు వేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లలలో ఇప్పటివరకు కేవలం 38 శాతం మంది మాత్రమే టీకా కోసం ముందుకొచ్చారు. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 8 వరకు అధికారిక గణాంకాల ప్రకారం....

Power to Local Bodies: జిల్లా మరియు మండల పరిషత్తులకు అదనపు నిధులు, అదనపు విధులు కల్పించాలని పంచాయతీ రాజ్ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం, గ్రామీణాభివృద్ధే లక్ష్యం అని వెల్లడి

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు.....

Khammam Suicide Case: ఆర్థిక సమస్యలతో మాజీ సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ భార్య,భర్తలు మృతి, విషమంగా పిల్లల పరిస్థితి, మరో చోట ఇంటికి వస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఖమ్మంలో రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి (Khammam Suicide Case) పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.

COVID in TS: తెలంగాణలో 2 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, రాష్ట్రంలో కొత్తగా 101 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1842గా ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో ప్రజలు ఇప్పుడు కరోనాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా టీకాల వినియోగం జరిగింది.....

Advertisement
Advertisement