Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం
తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.
Hyderabad, Mar 15: తెలంగాణలో (Telangana) ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ (Government), ప్రైవేట్ స్కూల్ (Private School) యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.
స్కూల్ అవ్వగానే మధ్యాహ్న భోజనం
ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)