Technology

WhatsApp: యూజర్ల దెబ్బకి వెనక్కి తగ్గిన వాట్సప్, నూతన ప్రైవసీ విధానం అప్‌డేట్‌ మరో మూడు నెలల పాటు వాయిదా, మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోమని వెల్లడి

Hazarath Reddy

వాట్సాప్‌ తాజాగా తీసుకువచ్చిన నూతన ప్రైవసీ విధానంపై వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. కాగా పది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ( new privacy policy) నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్‌ మొబైల్‌ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది.

Signal App: సిగ్నల్ యాప్ ఉపయోగించడం ఎలా? కొత్త స్నేహితులను యాడ్ చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ గైడ్ మీకోసం..

Hazarath Reddy

మెసెంజేర్‌ యాప్‌ వాట్సాప్‌కు సిగ్నల్ యాప్ గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అయింది. ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌తో ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు అంతా ‘సిగ్నల్‌’వైపు (WhatsApp users begin moving to Signal) వెళుతున్నారు.

Signal App: వాట్సాప్ ఢమాల్, సిగ్నల్ యాప్ వైపై వెళుతున్న యూజర్లు, మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ, వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని తెలిపిన వాట్సాప్

Hazarath Reddy

సిగ్నల్ యాప్ లో మామూలు మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ ఉండడం కూడా దీనికి అదనపు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మీ ఐపీ అడ్రస్‌ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

Upcoming Smartphones: మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది మీకోసం కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి, ఓసారి వాటిపై లుక్కేసుకోండి

Hazarath Reddy

ఐఫోన్ 13 వంటి హై-ప్రొఫైల్ హ్యాండ్‌సెట్‌ల నుంచి ఎల్‌జి రోలబుల్ వంటి మొబైల్స్ కూడా రానున్నాయి. ఈ ఏడాదిలో మొబైల్ సంస్థలు తీసుకురాబోయే కొన్ని ఆసక్తికరమైన 10 స్మార్ట్‌ఫోన్స్ గురించి అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Advertisement

Jio Free Voice Calls: జియో కొత్త సంవత్సరం గిఫ్ట్, ఇకపై జియో కాల్స్ ఉచితం, ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీలు ఉండవు, దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ నంబర్లకు ఫ్రీ కాల్స్

Hazarath Reddy

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు కొత్త సంవత్సం కానుకను ప్రకటించింది. ఇకపై 2021 జనవరి 1 నుంచి జియో కస్టమర్లు దేశీయంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ నంబర్లకు అపరిమిత ఉచిత కాలింగ్‌ (Jio Free Voice Calls) చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారంతో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల (ఐయూసీ) హయాం ముగిసిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Android 11 Update: ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందుకునే ఫోన్ల జాబితా ఇదే, మోటోరోలా నుంచి 22 ఫోన్లు, లెనోవో నుంచి ఇక ఫోన్. 2021లో ఆండ్రాయిడ్ 11 మార్కెట్లోకి వచ్చే అవకాశం

Hazarath Reddy

ఆండ్రాయిడ్ 11 కొన్ని ఫోన్లకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే మోటరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకోబోయే ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను (Android 11 Update) అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది.

Oppo India: దేశంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లోనే.. చైనా తర్వాత ఇండియాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో, మరో మూడు ఫంక్షనల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు

Hazarath Reddy

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (5G innovation lab) ఏర్పాటు చేస్తోంది. దాయాది దేశం చైనా తరువాత , భారతదేశంలోని​ హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ (5G innovation lab in in Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది.

WhatsApp Web Video/Voice Call: వాట్సప్‌లోకి త్వరలో అదిరిపోయే కొత్త ఫీచర్, వెబ్ ద్వారా వీడియో/వాయిస్ కాల్స్, తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించిన వాట్సాప్

Hazarath Reddy

Advertisement

PSLV-C50 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..పీఎస్ఎల్‌వీ సీ-50 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపిన ఇస్రో, సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు దోహదం, ఏడేళ్లపాటు సేవలు

Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీశ్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రంలోని ( Sriharikota) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 (PSLV-C50 Mission) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది.

Karnakata Apple iPhone Plant Violence: రూ. 440 కోట్ల విలువ గల ఐఫోన్లు మాయం, కర్ణాటకలో ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల నిరసన, జీతాల విషయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

Hazarath Reddy

కర్ణాటకలోని యాపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు విధ్వంసానికి (Karnakata Apple iPhone Plant Violence) పాల్పడ్డారు. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహం‍తో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్‌పై దాడి చేశారు. కోలార్ జిల్లాలోని నర్సాపురలో తైవాన్‌కు చెందిన టెక్‌ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.

RTGS: గుడ్ న్యూస్..నేటి నుంచి ఎంతైనా నగదు బదిలీ చేసుకోవచ్చు, 24 గంట‌లు ఆర్‌టీజీఎస్ సేవ‌లు అందుబాటులోకి, రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమితి రూ.5,000కు పెంపు

Hazarath Reddy

డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహాంలో భాగంగా నేటి నుంచి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (RTGS) సేవల్ని ఇక 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.

Wipro Elite 2021: విప్రోలో ఉద్యోగ అవకాశాలు, ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించిన విప్రో, రూ.30 వేల జీతం.. ఉద్యగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా సమయంలో భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగ అవకాశాలను (Wipro Elite 2021) కల్పించేందుకు రెడీ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు, అలాగే 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

Advertisement

PM-WANI: దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై, పీఎండబ్ల్యూఏఎన్‌ఐకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్, మీడియాకు కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్

Hazarath Reddy

దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై (Public Wi-Fi System) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఎటువంటి లైసెన్స్‌, ఫీజు, రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా దేశంలో త్వరలోనే పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ (Ravi Shankar Prasad) అన్నారు.

Jio 5G Service to Launch in India: తక్కువ ధరకే జియో 5జీ, 2021లో ఇండియాకు 5జీ సేవలను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ, అతి త‌క్కువ ధ‌ర‌కే ఆండ్రాయిడ్ ఫోన్‌

Hazarath Reddy

రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ 5జీపై కీలక ప్రకటన చేశారు. ఇండియాలో జియో 5జీ సేవ‌లను 2021 ద్వితీయార్ధంలో తీసుకువ‌స్తున్న‌ట్లు (Jio 5G Service to Launch in India) వెల్ల‌డించారు.

Gionee Phones: భారీ మోసం వెలుగులోకి, ప్రమాదంలో రెండు కోట్ల స్మార్ట్‌ఫోన్లు, జియోనీ ఫోన్లలో ట్రోజన్ హార్స్ వైరస్, జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చిన చైనా కోర్టు

Hazarath Reddy

చైనాలోని ఒక కోర్టు జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్‌వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్‌లలో (Gionee Phones) అమలు చేయబడినట్లు గుర్తించిన కంప్యూటర్ సమాచార వ్యవస్థలపై అక్రమ నియంత్రణపై తీర్పు ఇవ్వబడింది. ఈ తీర్పు ప్రకారం జియోనీ ఫోన్‌లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

Netflix India: ఉచితం..ఉచితం, రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలు, ‘స్ట్రీమ్‌ఫెస్ట్’ ఆఫర్ కింద నేడు, రేపు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని తెలిపిన నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా

Hazarath Reddy

కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్‌ఫ్లిక్స్‌ ఊరిస్తూ బంపర్‌ (Netflix India is Free for Two Days)అంటూ ప్రచారం చేస్తున్న సంగతి విదితమే. నేటి నుంచి ఆఫర్ వచ్చేసింది. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో ( StreamFest Begins) భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

Fact Check: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి వ్యక్తికి రూ.1,30,000, ఇలా వచ్చే లింక్‌ను ఎవరూ క్లిక్ చేయకండి, అది ఫేక్ అని నిర్ధారించిన పీఐబీ ఫాక్ట్-చెక్ బృందం

Hazarath Reddy

18 ఏళ్ల వయసు దాటిన ప్రతి పౌరుడికి కరోనా నిధుల కింద రూ.1,30,000 ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటన చేసిందనే వార్త తాజాగా వాట్సప్ లో వైరల్ అవుతోంది. ఈ డబ్బును అందుకోవాలంటే పూర్తి వివరాలు నమోదు చేయాలని పేర్కొంటూ, ఓ లింక్‌ను పంపుతున్నారు. అయితే, దాన్ని క్లిక్ చేయొద్దని, ఆ ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.

Google Pay: వినియోగదారులకు గూగుల్ పే షాక్, త్వరలో నగదు బదిలీ ఛార్జీలు వసూలు చేయనున్న గూగుల్ పే, గూగుల్ పే వెబ్​యాప్ సేవలు 2021 నుంచి క్లోజ్

Hazarath Reddy

డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ వార్తను అందించింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ ( Google Pay web app) సేవలను నిలివేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు గూగుల్ పే (Google Pay) నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది.

43 Chinese Apps Banned: మళ్లీ 47 చైనా యాప్స్‌పై నిషేధం, కీలక నిర్ణయం తీసుకున్న MeitY, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం సెక్ష‌న్ 69ఎ కింద వీటిపై నిషేధం

Hazarath Reddy

భారతదేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి 43 మొబైల్ యాప్‌ల‌ను (43 Chinese Apps Banned) నిషేధించింది.

PUBG Mobile India: ఇండియాకు పబ్‌జీ రీ ఎంట్రి, పబ్‌జీ మొబైల్ ఇండియా పేరుతో టీజర్ విడుదల, భారత గేమింగ్ పరిశ్రమలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చిన పబ్‌జీ కార్పొరేషన్

Hazarath Reddy

పబ్‌జీ ప్రేమికులకు కంపెనీ శుభవార్తను అందించింది. పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" (PUBG Mobile India) పేరుతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ (Battle Royale Online Game) ను భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పబ్‌జీ కార్పొరేషన్ డిజైన్ చేస్తోంది.

Advertisement
Advertisement