ప్రపంచం
India Walks Out of SCO Meet: కాశ్మీర్‌ను మ్యాప్‌లో కలిపేసుకున్న పాక్, నిరసన తెలుపుతూ ఎస్‌సీవో సమావేశాలను వాకౌట్ చేసిన భారత్, మేము పాకిస్తాన్‌కు మద్ధతు ఇవ్వడం లేదని తెలిపిన రష్యా
Hazarath Reddyఅంతర్జాతీయ వేదికపై దాయాదిదేశం పాకిస్తాన్ (Pakistan) మరోసారి కపట బుద్దిని ప్రదర్శించింది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో షాంఘై కోఆపరేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌(ఎస్‌సీవో) స‌మావేశాల్లో (SCO Meet) భాగంగా జ‌రిగిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల భేటీలో పాకిస్థాన్ త‌ప్పుడు మ్యాప్‌ను ప్ర‌ద‌ర్శించింది. భార‌త్‌కు చెందిన క‌శ్మీర్ ప్రాంతాల‌తో కూడిన మ్యాప్‌ను పాకిస్థాన్ ఆ భేటీలో చూపించింది. దీన్ని ఖండించిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ (NSA Ajit Doval) ఆ స‌మావేశం నుంచి వాకౌట్ (India Walks Out of SCO Meet) చేశారు.
Yoshihide Suga: జపాన్‌కు కొత్త సారథి, ప్రధానిగా ఎన్నికైన యోషిహిడె సుగా, ఎనిమిదేళ్ల తరువాత జపాన్‌కు కొత్త ప్రధానమంత్రిగా సుగా ఎంపిక, షింజో అబే రాజీనామాను ఆమోదించిన పార్లమెంట్
Hazarath Reddyజపాన్ నూతన ప్రధానమంత్రిగా యోషిహిడె సుగా (Japan New PM Yoshihide Suga) అధికారికంగా నియమితులు అయ్యారు. దీంతో పాటు జపాన్‌ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను (Yoshihide Suga) కాబోయే జపాన్‌ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు.
COVID-19 Vaccine Update: చైనా నుంచే నవంబర్‌లో వ్యాక్సిన్, నాలుగు టీకాలను అభివృద్ధి చేస్తోన్న డ్రాగన్ కంట్రీ, కొనసాగుతున్న ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్
Hazarath Reddyకరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. వుహాన్ నగరంలో కనిపించిన ఈ వైరస్ (Coronavirus Pandemic) యావత్ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకురావడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు (COVID-19 Vaccine Latest News Update) నవంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థలోని బయోసేఫ్టీ అధికారి గ్వియ్‌జెన్ వూ తెలిపారు.
Pakistan 'Highway Rape' Case: రేప్ చేస్తే అవి తీసి పడేయండి, గ్యాంగ్ రేప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, దేశంలో పెను ప్రకంపనలు రేపుతున్న హైవేపై సామూహిక అత్యాచారం ఘటన
Hazarath Reddyపాకిస్తాన్ దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించిన హైవేపై సామూహిక అత్యాచారం కేసులో (Pakistan 'Highway Rape' Case) నిందితుడు అరెస్టు అయిన తరువాత ఈ ఘటనపై పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణ లైంగిక నేరాలకు రసాయన కాస్ట్రేషన్ ద్వారా (Chemically Castrated) శిక్షించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. పాకిస్థాన్‌లోని లాహోర్ హైవేపై ఇటీవ‌ల ఓ మ‌హిళ‌ను అత్యంత క్రూరంగా రేప్ చేశారు.
Covid Made in Wuhan Lab: వుహాన్ ల్యాబ్ నుంచి కరోనావైరస్ బయటకు, హాంకాంగ్‌కు శాస్త్రవేత్త లీ మెంగ్‌ సంచలన వ్యాఖ్యలు, బయటకు చెబితే కనిపించకుండా పోతావని బెదిరించారని వెల్లడి
Hazarath Reddyవిశ్వమానవాళిని ముప్పతిప్పలు పెడుతున్న కరోనావైరస్ (Coroanvirus) పుట్టుకపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అది చైనా నుంచే ఉద్భవించిందని వాదనలు వినిపిస్తూ ఉన్నా వాటిని చైనా కొట్టి పారేస్తూ వస్తోంది. అయితే దీనిపై తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కరోనా వైరస్‌ మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వుహాన్‌ ల్యాబ్‌లో (COVID-19 was made in Wuhan lab) తయారైందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్‌ యాన్‌ (Chinese virologist Dr Li-Meng Yan) ఆరోపించారు. తన వాదనలను బలపర్చేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
China Snooping: చైనా భారీ కుట్ర, దేశంలో అగ్రనేతలపై రహస్య నిఘా, సంచలనం రేపుతున్న జాతీయ పత్రిక కథనం, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కేంద్రం తెలిపినట్లుగా మరో పత్రిక కథనం
Hazarath Reddyగత రెండు నెలలుగా భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా మరో దుస్సాహసానికి తెరలేపింది. సరిహద్దుల్లో భారత ఆర్మీతో తలపడలేని డ్రాగన్ కంట్రీ దొంగ దెబ్బ తీయడానికి అవసరమైన అన్ని మార్గాలను వాడుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు (India-China Standoff) ఉన్న తరుణంలో చైనా దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా (China's Snooping on VIPs) పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టిందని జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది.
COVID-19 in India: గుడ్ న్యూస్..జంతువులపై సత్ఫలితాలను ఇస్తున్న కోవాగ్జిన్‌ టీకా, దేశంలో తాజాగా 92,071 మందికి కరోనా, 48,46,428కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసులు
Hazarath Reddyదేశంలో గడిచిన 24 గంటల్లో 92,071 పాజిటివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 48లక్షల మార్క్‌ను దాటింది. దేశంలో కేసుల సంఖ్య 48,46,428కు చేరాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్‌ కేసులు (COVID-19 in India) ఉన్నాయని, 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
TikTok Picks Oracle over Microsoft: అమెరికాలో టిక్‌టాక్‌ కథకి ముగింపు? మైక్రోసాఫ్ట్‌కు బదులు ఒరాకిల్‌ పరం కానున్న టిక్‌టాక్‌, బైట్‌డ్యాన్స్‌తో చర్చలు సఫలం కాలేదని తెలిపిన మైక్రోసాఫ్ట్
Hazarath Reddyచైనీస్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ రేసులోకి (TikTok Picks Oracle) వచ్చింది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తాజాగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్‌ (Oracle) పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది.
Coronavirus in India: కరోనా విశ్వరూపం..11 రోజుల్లో 12 వేల మంది మృతి, 10 లక్షల కేసులు నమోదు, తాజాగా 94,373 మందికి కోవిడ్-19, దేశంలో 47,54,357కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో గ‌త ఐదు రోజులుగా ప్ర‌తిరోజు 90 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు (Coronavirus in India) న‌మోద‌వుతున్నాయి. నిన్న అత్య‌ధికంగా 97 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 94 వేల‌కుపైగా రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 47 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 94,372 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా కేసులు 47,54,357కు (Coronavirus Cases in India) చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజి‌టివ్ కేసుల్లో 9,73,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 37,02,595 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 78,399 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
Oxford COVID-19 Vaccine: ఆశలు ఆవిరి, ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ నిలిపివేయండి, సీరం ఇన్స్‌టిట్యూట్‌కు ఆదేశాలు జారీ చేసిన డీసీజీఐ, అస్వ‌స్థ‌త‌కు లోనైన టీకా తీసుకున్న వాలంటీర్
Hazarath Reddyకరోనా వ్యాక్సిన్ మీద ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటిదాకా ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) వస్తుందని అందరికీ ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఈ ఆశలపై డీసీజీఐ నీళ్లు చల్లింది. భార‌త్‌లో నిర్వ‌హించాల్సిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను (Phase 2, 3 COVID-19 Vaccine Clinical Trials) నిలిపివేయాల‌ని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) (Drugs Controller General of India (DCGI) ఆదేశాలు జారీ చేసింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా కోవిడ్ వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న సంగతి విదితమే.
Cats Infected with Covid: వుహాన్‌లో మళ్లీ కరోనా కల్లోలం, ఈ సారి భారీ స్థాయిలో పిల్లులకు వైరస్, ప్రజలు పెంచుకుంటున్న పిల్లులకు కోవిడ్‌ పరీక్షలు జరపాలని నిర్ణయం
Hazarath Reddyకరోనా వైరస్‌ ఇప్పుడు పెంపుడు జంతువులను వెంటాడుతోంది. మనుషుల నుంచి వాటికి వైరస్‌ సోకిందా లేదా వాటి నుంచే మనుషులకు వైరస్‌ సోకిందా ? అన్న వాదనలూ వినిపిస్తున్న వేళ చైనా వుహాన్ లో కరోనా కలకలం (cats infected with coronavirus in China's Wuhan) రేపింది. చైనాలోని వుహాన్‌ పట్టణంలో ప్రజలు పెంచుకుంటున్న పిల్లులకు కరోనా వచ్చిందని (More cats infected with coronavirus) నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పిల్లులపై కోవిడ్‌ పరీక్షలు జరపాలని హువాఝంగ్‌ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధకులు నిర్ణయించారు.
China hands over 5 Indians: కిడ్నాప్ చేసిన 5 మందిని భారత్‌కు అప్పగించిన చైనా, వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Hazarath Reddyఅపహరించిన ఐదుగురు భారతీయుల్ని (China Hands Over 5 Missing Men) చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijjiju) ప్రకటించారు. నిర్దేశించిన ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు చైనా ఆర్మీ ఆ యువకులను భారత దళాలకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కిబితూ సరిహద్దుల్లో ఉన్న వాఛా ప్రదేశం దగ్గర భారత దళాలకు యువకులను అప్పగిస్తారని నిన్న మంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.
The Horror: కుట్టరాని చోట కుట్టిన పాము, నొప్పితో విలవిలలాడిన యువకుడు, అసలేం జరిగింది.. ఆ తర్వాత ఏమయింది? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే!
Team Latestlyఇదొక విచిత్ర సంఘటన, పడగ విప్పిన పాము ఒకటి తన శత్రువుపై దండెత్తినట్లు అనిపించే వింత ఘటన. పాము కుడితే ప్రథమ చికిత్సగా విషం ఎక్కకుండా గట్టిగా కట్టుకట్టవచ్చు, కానీ ఆ పాపం పసివాడికి....
Donald Trump on Covid Vaccine: అక్టోబర్‌లో అమెరికా నుంచి వ్యాక్సిన్, మరోసారి స్పష్టం చేసిన ట్రంప్, రానున్న ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు అంటూ కమలా హ్యారిస్‌ విమర్శలు
Hazarath Reddyప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ కు టీకాను అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌పంచ దేశాలు కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ (Donald Trump on Covid Vaccine) వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై మ‌రోసారి ట్రంప్ స్పందిస్తూ... కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని అన్నారు. తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు ఖ‌ర్చుచేసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే య‌త్నాల‌ను వేగవంతం చేసిందని చెప్పారు.
Sputnik V Vaccine Update: సామాన్యులకు అందుబాటులో రష్యా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్, సెప్టెంబర్ 10 న తొలి బ్యాచ్ విడుదల, ముందుగా హైరిస్క్‌ గ్రూపులకు ప్రాధాన్యత
Hazarath Reddyకరోనా వ్యాక్సిన్ పై ఆశలు చిగురించాయి. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ (Sputnik V Vaccine Update) నమోదైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఇది ప్రకటించిన కొద్దివారాల అనంతరం వ్యాక్సిన్‌ (Gam-COVID-Vac' [Sputnik V] విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే రష్యాలో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
India-China Tensions: సరిహద్దుల్లో అర్థరాత్రి కాల్పులు, భారత సైన్యమే కాల్పులు జరిపిందంటూ చైనా ఆరోపణలు, 5 మంది సంగతి మాకు తెలియదంటూ దాటవేత, చైనాతో యుద్ధంలో ఇండియా ఓడిపోతుందంటూ డ్రాగన్ మీడియా రాతలు
Hazarath Reddyచైనా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సరిహద్దు వద్ద పదే పదే నియమాలను ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. శాంతి స్థాపన చర్చలు చేయాలని ఢిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కో సమావేశంలో పిలుపునిచ్చినప్పటికీ దాని బుద్ధి మారడం లేదు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత (India-China Tensions) కొనసాగుతుంది. తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో (Line of Actual Control (LAC) భారత్‌, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
Coronavirus in India: ఓవైపు కలవరం, మరోవైపు ఊరట, కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసిన భారత్, భారీగా పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో తాజాగా 90,802 కోవిడ్ కేసులు నమోదు
Hazarath Reddyదేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా (America) అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో ( India's Coronavirus Tally) భారత్‌ రెండో స్థానంలో, 4,137,606 కేసులతో బ్రెజిల్‌ (Brezil) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు (Coronavirus Deaths) చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్‌ కేసులున్నాయి.
Coronavirus in India: తాజాగా 90,633 మందికి కరోనా వైరస్, దేశంలో 41,13,812కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 1065 మంది మృత్యువాతతో 70,626 కు చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని (COVID19 Recoveries) డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Coronavirus Spread: కరోనాపై దిమ్మతిరిగే న్యూస్, ఇతరులతో సంబంధం లేకుండా టాయ్‌లెట్ పైపుల ద్వారా కోవిడ్19, చైనాలో వెలుగుచూసిన వాస్తవం
Hazarath Reddyఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. అయితే వారి కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న దంపతులకు (Three Chinese families on different floors) కూడా కరోనా వైరస్‌ సోకింది. వారు ఏనాడు ఒకరికి ఒకరు కలుసుకోలేదు. అలాగే కరోనా వైరస్‌ సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్‌లు కూడా వాడలేదు. అయినప్పటికీ వారికి కోవిడ్ 19 వచ్చింది.
India-China Tensions: చైనా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలి, శాంతి స్థాప‌న కోసం రెండు దేశాల మధ్య నిరంతరం చ‌ర్చ‌లు జరగాలి, మాస్కోలో ఎస్‌ఓసీ సమావేశంలో సరిహద్దు అంశాన్ని లేవనెత్తిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
Hazarath Reddyభారత్‌-చైనా మధ్య మరోసారి సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో (India-China Tension) ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) (Shanghai Cooperation Organisation (SCO) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని (India-China Border Stand-Off) రాజ్‌నాథ్‌సింగ్‌ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.