సినిమా

Drugs Case: డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ టీవీ నటి, ప్రీతికా చౌహాన్,‌ ఫైజల్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు

Hazarath Reddy

ప్రముఖ హిందీ సీరియల్స్‌ నటి ప్రీతికా చౌహాన్‌(30) డ్రగ్స్‌ వినియోగం కేసులో (Preetika Chauhan drugs abuse) అరెస్టయ్యారు.నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

RGV Missing Official Trailer: వర్మని కిడ్నాప్ చేసిందెవరు? ఆర్జీవీ మిస్సింగ్ సినిమా చూడమంటున్న రామ్ గోపాల్ వర్మ, ట్విట్టర్ వేదికగా RGV Missing ట్రైలర్ విడుదల

Hazarath Reddy

చిత్రసీమలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్‌ (RGV Missing Official Trailer) ఆదివారం విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్‌ను (Varmas RGV Missing Official Trailer) విడుదల చేశారు.

#HappyBirthdayPrabhas: 42వ వడిలోకి అడుగుపెట్టిన డార్లింగ్‌ ప్రభాస్‌, ట్విట్టర్లో హోరెత్తుతున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాధే శ్యామ్ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్, సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Hazarath Reddy

తెలుగు సినిమా రెబల్ స్టార్ డార్లింగ్‌ ప్రభాస్‌ నేడు 42వ పుట్టిన రోజు (Happy birthday Prabhas) జరుపుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన పుట్టిన రోజు కానుకగా ఈ రోజు ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌ నుంచి బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌’ విడుదల కానుంది. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి కొడుకు ప్రభాస్‌.

#RamarajuForBheem : 'భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి కొమరం భీమ్' వచ్చేశాడు! రామ్ చరణ్ గంభీరమైన గళంతో 'RRR భీమ్' టీజర్ వీడియో రిలీజ్

Team Latestly

ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన జ్వాల కొమరంభీం నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.

Advertisement

Narthanasala: అందాల నటి సౌందర్య యాక్టింగ్ తెరపైకి, నర్తనశాల సినిమా ఓటీటీని విడుదల చేస్తామని తెలిపిన బాలకృష్ణ, 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల ముందుకు..

Hazarath Reddy

నందమూరి నటసింహం బాలకృష్ణ (Narthanasala, Balakrishna) దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది.

Jeevitha Rajasekhar Family Covid 19: జీవిత రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులకు కరోనా, మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది, త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ రాజశేఖర్ ట్వీట్

Hazarath Reddy

తెలుగు సినిమా న‌టుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా (Jeevitha Rajasekhar Family Covid 19) మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. త‌న‌తో పాటు భార్య జీవిత‌, పిల్ల‌లు శివానీ, శివాత్మిక‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం నిజ‌మేన‌ని, ప్ర‌స్తుతం ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ‘పిల్లలిద్ద‌రూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత,‌ తాను మాత్రం ఇంకా వైద్యుల సంర‌క్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.ప్ర‌స్తుతం మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు.

Shobha Naidu Passed Away: కూచిపూడి దిగ్గజ నృత్యకారిణి శోభా నాయుడు అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం ప్రకటించిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు

Team Latestly

హైదరాబాద్‌లోని 40 ఏళ్ల ప్రస్థానం గల కూచిపుడి ఆర్ట్ అకాడమీకి శోభా నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 1,500 మందికి పైగా విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడిలో శోభా నాయుడు చేసిన సేవలకు గానూ 2001లో భారత ప్రభుత్వం ఆమెను...

Kapil Dev Biopic '83': క్రిస్టమస్‌కు కపిల్‌ దేవ్‌ బయోపిక్ మూవీ, అక్టోబర్ 15న ప్రధాని మోదీ బయోపిక్ విడుదల, రేసులో మరిన్ని సినిమాలు

Hazarath Reddy

ప్ర‌ధాని మోదీ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన పీఎం న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌ని (PM Narendra Modi biopic) అక్టోబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా, తాజాగా మ‌రి కొన్ని సినిమాలు థియేట‌ర్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌బీర్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం 83 (Kapil Dev Biopic '83) చిత్రాన్ని క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

Disha Movie: వర్మ దిశ మూవీని దయచేసి ఆపండి, హైకోర్టు గడప తొక్కిన దిశ తండ్రి, కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ లైంగిక దాడి ఘ‌ట‌న

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మరో చిత్రం దిశ ఎన్‌కౌంటర్‌. గతేడాది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేశాడు. కాగా ఈ మూవీని (Ram Gopal Varma Disha Movie) ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి (Disha Father) హైకోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు.

Rhea Chakraborty Granted Bail: జైలు నుంచి విముక్తి, రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం, సెలబ్రిటీలు ఏమన్నారంటే..

Hazarath Reddy

బాలీవుడ​ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో (Sushant Singh Rajput Death Investigation) వెలుగులో వచ్చిన డ్రగ్స్‌‌ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు (Rhea Chakraborty Granted Bail) మంజూరు చేసింది.

Kajal Aggarwal-Gautam Kitchlu Wedding: ముంబై వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ పెళ్లి, అక్టోబర్‌ 30న గౌతమ్‌ కిచ్లుతో పెళ్లి అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపిన ముద్దుగుమ్మ, అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు

Hazarath Reddy

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని అక్టోబర్‌ 30న పెళ్లాడనున్నట్టు (Kajal Aggarwal-Gautam Kitchlu Wedding) కాజల్‌ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు ట్వీట్ లో తెలిపింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ (Kajal Aggarwal) సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.

Tamannaah Covid-19: తమన్నాకు కరోనావైరస్, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ, కొద్ది రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న తమన్నా తల్లిదండ్రులు

Hazarath Reddy

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. తీవ్ర జర్వంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా (Tamannaah test positive for coronavirus) నిర్ధారణ అయింది. ఆమె చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తమన్నా తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. అయితే వారు ఆ వ్యాధిని జయించి సురక్షితంగా ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా వైరస్ సోకింది. త‌మ‌న్నాకు (Tamannaah Bhatia) క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవ్వ‌డంతో పాటు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Advertisement

Sonu Sood: చేసిన సేవకు గుర్తింపు, సోనూసూద్‌‌ను ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించిన యూఎన్‌డీపీ, ఐరాస గుర్తించిన వారిలో సోనూసూద్‌ తొలి భారతీయ నటుడు

Hazarath Reddy

కరోనా సంక్షోభం సమయంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సామాజిక సేవా కార్యక్రమాలతో ఎందరినో ఆదుకున్న విషయం విదితమే. అతను చేస్తున్న సేవను గుర్తించిన ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ).. ప్రతిష్టాత్మక ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో (Sonu Sood Receives SDG Special Humanitarian Action Award) సత్కరించింది. సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా సోనూసూద్‌కి ఈ అవార్డును ప్రదానం చేశారు.

‘Bharat Ratna for SPB’: ప్రధాని గారు..బాలుకి భారత రత్న ఇవ్వండి, మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

Hazarath Reddy

గాన గంధర్వుడు తెలుగు బిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ (Bharat Ratna for SPB)ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి (PM Modi) విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) ప్రధానికి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు (SP Balasubrahmanyam) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో సెప్టెంబర్ 25న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

S P Balasubrahmanyam's Funeral: ఇక సెలవు..అశ్రు నివాళుల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి, కడచూపు కోసం తరలివచ్చిన తారాగణం, అభిమానులు

Hazarath Reddy

మధురమైన దివ్యగానం దివికేగింది. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు (S P Balasubrahmanyam's Funeral) ముగిశాయి. ఐదు దశాబ్ధాల పాటు తన గానామృతంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించిన పాటల మాంత్రికుడికి అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు మధ్య అంత్యక్రియలు (SP Balasubrahmanyam's Funeral In Chennai) జరిగాయి. చెన్నైలోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు చెప్పారు.

Disha Encounter Official Trailer: దిశ ఎన్‌కౌంటర్‌ ట్రైలర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ, నవంబర్ 26న సినిమా విడుదల, ప్రారంభమైన వర్మ బయోపిక్ షూటింగ్

Hazarath Reddy

గతేడాది తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా ఓ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రిలీజ్‌ అయిన ‘దిశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ (Disha Encounter Official Trailer) నాటి ఘటనను కళ్లకు కడుతుంది. దర్శకుడు రాం గోపాల్‌ వర్మ తన ట్విటర్‌ ద్వారా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి ట్రైలర్ విడుదలైంది.

Advertisement

SP Balu Last Rites: కడ చూపు కోసం బారులు తీరిన అభిమానులు, తామరైపాకంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్న తమిళనాడు ప్రభుత్వం

Hazarath Reddy

ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు చేరుకున్న (SP Balasubrahmanyam Death) విషయం విదితమే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు.. విదేశాల నుంచి కూడా నివాళులు అర్పించారు. నేడు తామరైపాకంలో బాలు అంత్యక్రియలు (SP Balu Last Rites) జరగనున్నాయి. కరోనా నేపథ్యంలొ పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో చెన్నైలోని ఆయన పార్థివ దేహానికి.. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

SP Balasubrahmanyam Passed Away: గాన గంధర్వుడు ఇక లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తీవ్ర దిగ్భ్రాంతిలో అభిమాన లోకం

Team Latestly

ఆగష్టు 5న ఆసుపత్రిలో చేరారు. దాదాపు 41 రోజుల పాటు ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది, బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. చివరకు....

Sexual Assault Allegations on Anurag Kashyap: నన్ను అనురాగ్‌ కశ్యప్‌ రేప్ చేశాడు, తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు, న్యాయం చేయాలంటూ ప్రధానికి ట్వీట్ ద్వారా వినతి, వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్ కశ్యప్

Hazarath Reddy

అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతకుముందు పలుమార్లు లైంగికంగా నన్ను వేధించాడని ఓ తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ప్రధాని మోదీకి నటి ట్వీట్ ద్వారా మొరపెట్టుకుంది.‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. అతని వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు.

SP Balu's Health Update: బాలు ఆరోగ్యం మరింత మెరుగు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్న ఎస్‌ పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని తెలిపిన కుమారుడు చరణ్

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై (SP Balu's Health Update) ఆయన తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan) తాజా సమాచారం అందించారు. తాజా వీడియోలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, తన తండ్రి నిన్నటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని, ఇకపై ఆయన త్వరగా శక్తిని పుంజుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారని వెల్లడించారు.

Advertisement
Advertisement