సినిమా
Sravani Suicide Case: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అశోక్‌రెడ్డి, ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల రిమాండ్‌ రిపోర్టు, ఏ1గా దేవ్‌రాజ్‌, ఏ2గా సాయికృష్ణారెడ్డి, ఏ3గా అశోక్‌రెడ్డి
Hazarath Reddyటీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. పంజాగుట్ట ఏసీపీ (Panjagutta ACP) తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.
Naga Babu Covid 19: నాగబాబుకు కరోనా పాజిటివ్, క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని తెలిపిన మెగా బ్రదర్, తనను కలిసిన వాళ్లు టెస్ట్ చేయించుకోవాలని సూచన
Hazarath Reddyలెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీదకు వెళ్లింది. నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ (Naga Babu Tested possitive for coronavirus) అని నిర్థార‌ణ అయింది. అయితే దీనికి గురించి నాగ‌బాబు (Naga Babu Konidela) నోరు విప్ప‌క‌ముందే రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇప్పుడు ట్విట‌ర్ వేదిక‌గా నాగ‌బాబు విష‌యాన్ని వెల్ల‌డించారు. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Chiranjeevi Urban Monk Look: గుండు సీక్రెట్ బయటకు..మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు, అది మేకింగ్ వీడియో, అర్బన్‌ మాంక్‌ లుక్ పేరుతో వీడియో బయటకు
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య గుండుతో కనిపించిన విషయం విదితమే.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సరికొత్త లుక్‌లో (Chiranjeevi New Look) కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన చిరంజీవి ఆ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్‌ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
Big Boss 4: మొదలైన ట్రై యాంగిల్ లవ్ స్టోరీ! తొమ్మిది మందిని ఒకేసారి సెల్ఫ్ నామినేట్ చేసుకునేలా టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, ఈసారి హౌజ్ నుంచి వెళ్లిపోయేదెవరు?
Team Latestlyమోనాల్ - అఖిల్ మధ్య లవ్ స్టోరి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నట్లు చూసే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు, అభిజీత్ కూడా మోనాల్ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా అనిపించింది. అయితే అఖిల్- మోనాల్ మధ్య సాగుతున్న స్టోరీ చూసి అభిజిత్ కొద్దిగా అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది....
Kangana Ranaut's Office Demolished: ముంబైని మళ్లీ పాక్‌తో పోల్చిన బాలీవుడ్ నటి, కంగనా రనౌత్ బాంద్రా ఆఫీసును కూల్చేసిన బీఎంసీ, ట్విట్టర్లో‌ ట్రెండ్ అవుతున్న #DeathOfDemocracy
Hazarath Reddyబాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి బీఎంసీ షాకిచ్చింది. బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని (Kangana Ranaut's Office Demolished) చేపట్టినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి కంగనాకు నోటీసులు సైతం పంపించారు. అయితే ఆ సమయంలో కంగనా అక్కడ లేరు. ఆమె ముంబై చేరుకునే లోపే ఆమె కార్యాలయాన్ని కూల్చారు.
'Rhea Loved A Drug Addict': డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని ప్రేమించడమే రియా తప్పు, మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను వేధించాయి, రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని తెలిపిన రియా తరపు లాయర్ తీష్ మనషిండే
Hazarath Reddyసుశాంత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేయడంపై (Rhea Chakraborty arrested by NCB) ఆమె తరుఫు న్యాయవాది సతీష్ మనషిండే (Rhea Chakraborty's lawyer Satish Maneshinde) స్పందించారు. రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని (this is travesty of justice) ఆయన అన్నారు. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఒంటరి మహిళ అయిన రియా చక్రవర్తిని వేధింపులకు గురిచేశాయని ఆరోపించారు.
Rhea Chakraborty Arrested: రియా చక్రవర్తి అరెస్ట్, డ్రగ్స్‌ కేసులో 25 మంది బాలీవుడ్ ప్రముఖులు, జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన ఎన్‌సీబీ అధికారులు
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajout death case) విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ (Rhea Chakraborty Arrested) చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Sandalwood Drug Case: కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, నటి సంజన ఇంట్లో పోలీసులు సోదాలు, కేసులో విచారణను వేగవంతం చేసిన బెంగుళూరు సీసీబీ
Hazarath Reddyకన్నడ సినీ ఇండస్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం (Sandalwood Drug Case) సృష్టిస్తోంది. శాండ‌ల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిగాయి. తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు (Actress Sanjana galrani's residence) నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు.
Jaya Prakash Reddy: మరో అద్భుతమైన నటరత్నాన్ని కోల్పోయిన టాలీవుడ్, నటుడు జయ ప్రకాష్ రెడ్డి హఠాన్మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Team Latestlyజయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో కూడా విలన్ ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆయన నాలుక మడతబెడుతూ ' వీడిని పండబెట్టి, పీకకోసి.. హుమ్.. హుమ్..' అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్....
S P Balu Health Update: గుడ్ న్యూస్..ఎస్ పీ బాలుకు కరోనా నెగెటివ్, ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉన్నారని తెలిపిన కుమారుడు ఎస్పీ చరణ్, ఐప్యాడ్‌లో టెన్నిస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
Hazarath Reddyచెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) సోమవారం మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ (S P Balasubrahmanyam Tests Negative For COVID-19) వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్ పి చరణ్ (S P Charan) తెలిపారు. అయితే 74 ఏళ్ల గాయకుడు బాలు ఇప్పటికీ వెంటిలేటర్‌లో ఉన్నారని కుమారుడు చరణ్ తెలిపారు.
Jwala Gutta-Vishnu Vishal Engagement: గుత్తా జ్వాలతో తమిళ నటుడు విశాల్ ఎంగేజ్‌మెంట్, కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దామంటూ ట్వీట్ చేసిన విష్ణు విశాల్
Hazarath Reddyగత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ నిశ్చితార్థం (Jwala Gutta-Vishnu Vishal Engagement) జరిగింది. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు (Jwala Gutta Birthday) కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు (Vishnu Vishal). ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విష్ణు వెల్లడించారు..
Sushant Death Case: ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
Hazarath Reddyసినీనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు (Sushant Singh Rajput Death Case) ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని విచారణకు హాజరకావాలని(Rhea Chakraborty Summoned) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆదివారం ఆదేశించింది. నార్కోటిక్స్ (Narcotics) అధికారుల బృందంతో పాటు ముంబై పోలీసులు ఆదివారం ఉదయం రియా చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు.
Ram Charan: మీ లోటు పూడ్చలేం, మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల సాయం ప్రకటించిన రాంచరణ్, రూ. 2 ల‌క్ష‌ల సాయం ప్రకటించిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్
Hazarath Reddyఈ బాధాకర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం తప్ప మనం మరేమీ చేయలేమని... వారి లేని లోటును మనం పూడ్చలేమని రాంచరణ్ అన్నాడు. ముగ్గురి కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు.
Three Pawan Fans Electrocuted: పవన్ పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, ఘటనపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, చిరంజీవి, వకీల్ సాబ్ చిత్ర యూనిట్
Hazarath Reddyజనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, పెను విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ (Three Pawan Fans Electrocuted) తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.
SP Balu Health Condition: కోలుకుంటున్న బాలు, ఫిజియోథెరపీ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, అసత్య ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మాళవిక
Hazarath Reddyకొద్ది రోజులుగా క‌రోనాతో ఫైట్ చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) కోలుకుంటున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన (S P Balu Health Update) విడుదల చేశాయి. బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. (Fully Awake And Responsive) ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
#IntoTheWildWithBearGrylls: అడవిలో అక్షయ్ కుమార్ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, into the wild with bear grylls కోసం బేర్ గ్రిల్స్‌తో కలిసి రిస్క్ చేస్తున్న అక్షయ్, సెప్టెంబ‌ర్ 14న డిస్క‌వరీ ఛానెల్‌లో ఎపిసోడ్ ప్ర‌సారం
Hazarath Reddyఅక్షయ్ కుమార్ నటించిన బేర్ గ్రిల్స్ ఇంటు ది వైల్డ్ ( Bear Grylls’ Into The Wild) ఎపిసోడ్ యొక్క కొత్త టీజర్ వచ్చింది. ప్రత్యేక ఎపిసోడ్ అడవిలో ‘పిచ్చి సాహసం’ పై ‘డేర్‌డెవిల్ ద్వయం’ చూడండి అంటూ చిన్న వీడియో టీజర్ లో ప్రారంభం అవుతోంది. బేర్ తన యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ‘లెజెండ్’ గా అక్షయ్‌ను పరిచయం చేయడంతో. "నేను రీల్ హీరో, అతను నిజమైన హీరో" అని నటుడు అంటాడు. వీడియోలో బేర్ మరియు అక్షయ్ (Akshay Kumar) దీనిని అడవిలో రఫ్ చేయడం మరియు మొసలి ఉన్న నీటి పై నుంచి వెళ్లడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, నటుడు ‘ఏనుగు పూప్ టీ’ పై సిప్ చేస్తాడు.
SP Balu Health Update: పాడేందుకు నాన్న ప్రయత్నిస్తున్నారు, ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, బాలు ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపిన కుమారుడు ఎస్పీ చరణ్
Hazarath Reddyకోవిడ్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు (SP Balasubrahmanyam) బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని తెలిపారు.
Sushant Death case: విష ప్రయోగం వల్లే సుశాంత్‌ మరణించాడు, సంచలన ఆరోపణలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపణ
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు సుశాంత్‌‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajput Death case) నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్‌ నేత సంచలన ఆరోపణలు చేశారు.
Sonu Sood on AP Villagers: ఏపీకి రానున్న సోనూ సూద్, ఆ రెండు గ్రామాల ప్రజలను చూడాలని ఉందంటూ ట్వీట్, 20 వేల మంది వలస కార్మికులకు నోయిడాలో ఆశ్రయం కల్పించనున్న రియల్ హీరో
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో (Vizianagaram) తమ ఊరి రోడ్లను తామే నిర్మించుకున్న రెండు గ్రామాల ప్రజలపై సోనూ సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ సోనూ భాయ్ ని పొగిడితే ఆయన మాత్రం ఏపీలోని రెండు గ్రామాల ప్రజలను ఆకాశానికి ఎత్తేశాడు. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్‌ హీరోస్‌’ ’అంటూ ట్విటర్‌ వేదికగా కొనియాడారు. త్వరలోనే మీ ఊరికి వస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్, రాముడి పాత్రకు సరిగ్గా సెట్ అవుతాడని తెలిపిన రాజమౌళి, సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అంటూ పుకార్లు
Hazarath Reddy‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ (Adipurush) ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు (Lord Ram) ప్రభాస్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం.