తాజా వార్తలు

Paris Olympics 2024: రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్‌, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్‌ (shooter) మను బాకర్‌ (Manu Bhaker) భారత్‌ చేరుకున్నారు. ఇవాళ ఉదయం కోచ్‌ జస్పాల్‌ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.

Ghaziabad Road Accident: మనుషుల్లో మానవత్వం నిజంగానే చచ్చిపోయింది, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పట్టించుకోకుండా పాల కోసం ఎగబడ్డ యూపీ వాసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్‌ ట్యాంక‌ర్‌ను వెనుక నుంచి వ‌చ్చిన‌ మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ట్యాంక‌ర్‌ డ్రైవర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచిపోయారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహరించారు.

Prabhas: వయనాడ్ బాధితుల కోసం హీరో ప్రభాస్ ఆపన్నహస్తం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.2 కోట్ల విరాళం

Rudra

వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన బాధితులకు సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి ఆపన్న హస్తం అందించారు. బాధితుల అవసరార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Sheikh Hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్‌ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్

Rudra

యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చి భారత్‌ లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.

Viral Video: ఐదంతస్థుల మేడ మీద నుంచి రోడ్డుమీద జారిపడ్డ శునకం.. కుక్క సరాసరిగా మీదపడటంతో కన్నుమూసిన మూడేండ్ల చిన్నారి.. ముంబ్రాలో ఘటన (వీడియో)

Rudra

మహారాష్ట్రలో థానే జిల్లాలోని ముంబ్రా పట్టణంలో రద్దీగా ఉండే ఓ రోడ్డులో దారుణం జరిగింది. ఐదంతస్థుల మేడ మీద నుంచి ఉన్నట్టుండి ఓ శునకం రోడ్డుమీద జారిపడింది. అప్పుడే అటుగా తల్లితో వస్తున్న ఓ మూడేండ్ల చిన్నారిపై ఆ కుక్క పడింది.

Youth Commits Suicide: పెళ్లి కావడంలేదని గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. నిర్మల్ లో ఘటన (వీడియో)

Rudra

యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని కొందరు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మరికొందరు, పెళ్లికాలేదని మరికొందరు.. సూసైడ్ కు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

Accident in Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో ఎగిరి అదే కారు అద్దంపై పడ్డ వృద్ధుడు.. కారు అద్దం మెడకు కోసుకుపోయి వృద్ధుడి తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డ హృదయ విదారక దృశ్యం

Rudra

హైదరాబాద్ శివారుల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ఎగిరి అదే కారు అద్దంపై పడ్డాడు.

Advertisement

Electricity Generated Shoes: ఈ బూట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయ్‌.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ఇట్టే చెబుతాయ్‌.. జవాన్ల కోసం డిజైన్‌ చేసిన ఇండోర్‌ ఐఐటీ పరిశోధకులు

Rudra

దేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్‌ లోని ఐఐటీ పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి.

Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

Rudra

ఊళ్ళకు వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినా.. షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్‌ బాటిల్‌ లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందట.

Telangana Weather Forecast: రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

Hazarath Reddy

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

Anthony Ammirati: వీడియో ఇదిగో, పురుషాంగం కర్రకు తాకడంతో హైజంప్‌లో ఫెయిల్, ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ నుంచి నిష్క్రమించిన పోల్ వాల్ట్ ఆటగాడు ఆంథోనీ అమిరాతి

Hazarath Reddy

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయిన సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు

Advertisement

Viral Video: స్నేహమంటే ఇదే..ఏడుస్తున్న బాలుడిని ఓదార్చిన కుక్కపిల్ల, కన్నీళ్లు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇచ్చి మరీ..

Hazarath Reddy

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కుక్కపిల్ల-పిల్లల స్నేహం యొక్క అందమైన వీడియోను పంచుకున్నారు, దీనిలో ఏడుస్తున్న బాలుడిని తన స్నేహితుడు అయిన పెంపుడు కుక్కపిల్ల ఓదార్చింది.

Manish Tiwary Resigns: అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ రాజీనామా, కొత్త కంపెనీని వెతుకుతున్నట్లుగా వార్తలు

Vikas M

ఈ-కామర్స్ దిగ్గజంలో ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిపిన తర్వాత అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ పదవికి రాజీనామా చేసినట్లు పరిణామాలు తెలిసిన వ్యక్తులు మనీకంట్రోల్‌కి తెలిపారు.తివారీ మరో కంపెనీలో కొత్త పాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు.

School Bus Overturns in Hyd: వీడియో ఇదిగో, కాటేదాన్‌లో ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా, 30 మంది విద్యార్థులకు గాయాలు, పలువురి పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారి విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్కూల్‌ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించింది.

YouTube Academy in Andhra Pradesh: అమరావతిలో యూట్యూబ్‌ అకాడమీ, ఎక్స్ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

Advertisement

YS Jagan's Security Row: జగన్‌కు అంతమందితో సెక్యూరిటీ అవసరమా, ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, సరిపడా భద్రత కల్పిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ సీఎంకు 980మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారన్నారు.

YS Jagan Slams CM Chandrababu: ఈ దాడులు ఆపకపోతే రేపు మా కార్యకర్తలు ఆగమన్నా ఆగరు, సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్‌ జగన్‌.

Job Cuts 2024: డెల్ కంపెనీలో మరోసారి భారీ లేఆప్స్, రేపటి నుండి 12,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లుగా వార్తలు

Vikas M

ఇటీవల, టెక్ దిగ్గజం డెల్ తన కొత్త AI-కేంద్రీకృత యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేయడంతో డెల్ తొలగింపులు విక్రయ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను దెబ్బతీస్తాయని అనేక నివేదికలు ధృవీకరించాయి. అయితే ప్రభావితమయ్యే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే, Xలోని అనేక పోస్ట్‌లు సంఖ్యలు 12,500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని సూచించాయి.

Hiroshima, Nagasaki Atomic Bombings: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, మృతులకు నివాళి అర్పించిన లోక్‌సభ సభ్యులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో 1945 ఆగస్టులో అణుబాంబు పేలుళ్లలో వేలాది మంది మరణించి, గాయపడిన మృతులకు లోక్‌సభ మంగళవారం నివాళులర్పించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆగస్టు 6, 9 తేదీలలో హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై బాంబులు వేయబడ్డాయి

Advertisement
Advertisement