తాజా వార్తలు
Nagarjuna Sagar Dam: నిండుకుండలా నాగార్జున సాగర్, మళ్లీ రెండు గేట్లు ఎత్తిన అధికారులు, లాంగ్ వీకెండ్ తో క్యూకట్టిన పర్యాటకులు
VNSనల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam) నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు కర్కశంగా ప్రవర్తించిన వ్యక్తి, బీహార్ లో వైరల్ గా మారిన వీడియో
VNSఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అయ్యింది. బీహార్లోని సమస్తిపూర్లో ఈ సంఘటన జరిగింది
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
Telangana: మా వద్ద హైదరాబాద్ ఉంది, ఏపీతో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మా పోటీ ప్రపంచంతోనేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddy15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ను మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.
Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Hazarath Reddyతెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.
Mumbai Shocker: ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది
Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్ మాటల్లో..
Vikas Mగంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్కి దర్శకుడు సుకుమార్తో కలిసి వెళ్లాను.
Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్ సింగర్తో హార్దిక్ పాండ్యా డేటింగ్ ? ఇన్స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Vikas Mభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్, రెండవ స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్మన్ గిల్
Vikas Mటీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జే షా, గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌలర్
Vikas Mటీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఉన్నాడు.
Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..
Vikas Mచాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్లో రెడ్-బాల్ క్రికెట్కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.
Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు
Hazarath Reddyబిజ్నోర్లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
Independence Day 2024: ఎర్రకోట నుండి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, నాయకత్వం వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేక అతిథులుగా 6 వేల మంది
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దేశానికి నాయకత్వం వహిస్తారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ 'విక్షిత్ భారత్ @ 2047'
Telangana Governor Quota MLC: బీఆర్ఎస్కు బిగ్ షాక్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య
Arun Charagondaసుప్రీం కోర్టులో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత
Arun Charagondaహైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో లేని ఐపీఎస్లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ
Arun Charagondaఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Independence Day 2024: తెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్, ఎందుకు ప్రదానం చేశారంటే..
Hazarath Reddyతెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం
Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..
Vikas Mబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.
Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Vikas Mబ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.