తాజా వార్తలు
Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
Team Latestlyకర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన
Team Latestlyదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్లోని ఇంటర్ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం
Team Latestlyకర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు, నవంబర్ 14న ఫలితాలు
Team Latestlyబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్ గెహ్లాట్ ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
Murder Caught on Camera: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య, డ్రైవర్ ని ఇటుకలతో కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Team Latestlyయూపీలోని ప్రయాగ్రాజ్లోని ధూమంగంజ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన దాడి చోటు చేసుకుంది. కాంట్రాక్టు రోడ్వేస్ డ్రైవర్ రవెంద్ర కుమార్ అలియాస్ మున్ను అనే వ్యక్తి తలపై ఇద్దరు వ్యక్తులు ఇటుకలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన అక్టోబర్ 21న CCTVలో రికార్డైంది. బాధితుడు వారు విసిరేసిన ఇటుకలు, రాళ్లను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన
Team Latestlyఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.
Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..
Team Latestlyకాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.
Droupadi Murmu Helipad Mishap in Kerala: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం, ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్, వీడియో ఇదిగో..
Team Latestlyకేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్లో అనుకోని సమస్యల కారణంగా కొంచెం కుంగి, ఒక పక్కకు ఒరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tirumala Rain Alert: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, వీడియో ఇదిగో..
Team Latestlyతిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడుగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది.
Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచి, పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ- జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో భారీ మద్ధతు
Team Latestlyజపాన్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సనై టకైచి దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఉన్న తకైచి, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పదవీ విరమణ చేసిన షిగెరు ఇషిబాకు తరువాత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
Bengaluru: వీడియో ఇదిగో, నాకే ఎదురు చెబుతావా అంటూ.. ప్రయాణికుడిని పదేపదే చెంప దెబ్బలు కొట్టిన ట్రాఫిక్ పోలీసు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Team Latestlyభారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ దగ్గర తప్పుడు మార్గంలో వాహనం నడిపినందుకు బైకర్ను ఆపేసిన ఒక ట్రాఫిక్ పోలీసు అతడిని పదేపదే చెంపదెబ్బ కొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ ఫుటేజ్లో ఆ రైడర్ ట్రాఫిక్ పోలీసుతో వాదులాడుతుండగా.. ఇతర అధికారులు పరిస్థితిని శాంతింపజేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది
PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
Team Latestlyఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.
Diwali 2025: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, బాణాసంచా అమ్మకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి
Team Latestlyదీపావళి రాకముందే దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్సీఆర్లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారులను ఆదేశించింది.
Hyderabad: వీడియో ఇదిగో, తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని చెప్పినందుకు దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు
Team Latestlyకూకట్పల్లిలోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లోని ఒక నివాస ప్రాంతంలో తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని కోరిన దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. దాడికి ముందు దంపతులు హాస్టల్ విద్యార్థులను మా ఇంటి ముందు బైక్ పార్క్ చేయొద్దని అడిగారు. అయితే వారిలో కొంతమంది స్పందించకపోవడంతో తలెత్తిన విరోధం దాడి రూపానికి చేరింది
Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..
Team Latestlyఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan Bus Fire: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం, నేషనల్ హైవేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, 15 మంది సజీవ దహనం అయినట్లుగా వార్తలు
Team Latestlyరాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, బైకుపై వెళుతూ రైలు పట్టాలు క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి, రైలు దూసుకురావడంతో దాని కింద పడి నుజ్జు నుజ్జు, నోయిడాలో ఘటన
Team Latestlyఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించి అది బెడిసికొట్టడంతో రైలు కింద పడి మృతి చెందాడు.
Girl Slaps Boy: వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..
Team Latestlyభారతదేశంలో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఎల్లప్పుడూ ఆసక్తికర సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంటాయి., చాలా సార్లు, ప్రసారకుల కెమెరా గ్యాలరీలో చిరస్మరణీయ క్షణాలను రికార్డు అవుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా vs వెస్టిండీస్ రెండవ టెస్ట్ డే 4లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరదాగా చెంపదెబ్బ కొట్టడం కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Cow Capture Gone Wrong in Vadodara: వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు
Team Latestlyగుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది.