India
Health Tips: ఎప్పుడూ ఎనర్జీగా ఉండాలా? అయితే ఈ 5 జ్యూస్లు మీ డైలీ దినచర్యలో తప్పక చేర్చుకోండి
Team Latestlyఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ జీవితాంతం వ్యాధుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది. అది ఆరోగ్యకరమైన జీవనశైలి. మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
Tragedy at Bus Stop: వీడియో ఇదిగో, బస్టాండులో ప్రయాణికుల మీదకి దూసుకెళ్లిన బస్సు, నాలుగేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు, నాసిక్ ప్రాంతంలోని సిన్నార్ బస్టాండులో ఘటన
Team Latestlyమహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం సిన్నార్ బస్టాండులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్టాండ్లోని ప్లాట్ఫామ్పై నిల్చొని బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులపైకి ఒక బస్సు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Telangana: దారుణం.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ను ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి, సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు
Team Latestlyరాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తోన్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
U19 World Cup Schedule Out: అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది, తొలి మ్యాచ్లో అమెరికాతో టీమిండియా ఫైట్, ఫిబ్రవరి 6న హరారే వేదికగా ఫైనల్, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Team Latestlyఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2026 అండర్–19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక యువజట్ల టోర్నమెంట్కు ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్త ఆతిథ్యాన్ని వహించనున్నాయి.
Tirumala Update: డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, సామాన్యులకే పెద్దపీట వేయనున్న టీటీడీ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు
Team Latestlyతిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను ప్రకటించింది. ప్రతి ఏడాదిలా ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
NBK111: బాలకృష్ణ 111వ సినిమాలో హీరోయిన్గా నయనతార, అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, నవంబర్లో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించే అవకాశం
Team Latestlyనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం NBK111 నుంచి సినీ అభిమానులను ఉర్రూతలూగించే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Bihar Election EVM Controversy: ఈవీఎంలలో ముందే 25 వేల ఓట్లు పడ్డాయని ఆర్జేడీ నేత ఆరోపణ,స్పందించిన ఎన్నికల సంఘం, ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తేల్చిన ఈసీ
Team Latestlyబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్కు ముందే ఈవీఎంలలో 25 వేల ఓట్ల చొప్పున ఓట్లు పడ్డాయంటూ ఆర్జేడీ సీనియర్ నేత జగదానంద సింగ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం (ECI) ఖండిస్తున్నట్లు తెలిపింది. బీహార్ తీర్పు ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించలేదని, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ఆర్జేడీ సోమవారం పేర్కొంది
Meerut Tragedy Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ఎద్దుల బండి పక్కన నడుస్తున్న మహిళకు చేదు అనుభవం, గోడ మధ్యలో ఇరుక్కుని తిరిగిరాని లోకాలకు..
Team Latestlyఆదివారం మీరట్లోని రోటా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఎద్దుల బండి ప్రమాదంలో కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ మరణించింది, ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలేష్ తన పొలంలో చెరకు కోసి ఇంటికి తిరిగి వస్తుండగా కినౌని గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
Weather Update: తెలంగాణలో చలిపులి పంజా, గజగజ వణుకుతున్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ జారీ
Team Latestlyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
Health Tips: రాత్రి పడుకునే ముందు...ఈ 7 ఆహారాలు, పానీయాలు అసలు ముట్టుకోవద్దు, మీ రాత్రి భోజనం మెనూను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన సమయం ఇదే..
Team Latestlyకొన్ని ఆహారాలు, పానీయాలు ఎంత రుచికరంగా లేదా ఆరోగ్యకరంగా అనిపించినా, వాటిని రాత్రిపూట, ముఖ్యంగా పడుకోవడానికి ముందు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాట్లు మీ జీర్ణవ్యవస్థపై భారం వేయడమే కాక, మీ గాఢ నిద్ర (Deep Sleep)కు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తాయి
Lemon Tea Benefits: రోజూ లెమన్ టీ తాగేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ పదార్థాలతో కలిసి తాగితే ప్రమాదమే, ఈ ఆహార పదార్థాలను తాగే సమయంలో దూరంగా ఉంచండి
Team Latestlyలెమన్ టీని ప్రతిరోజూ తాగే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం లేచిన వెంటనే ఒక వేడి నిమ్మ టీ తాగితే శరీరానికి తేలికపాటిగా అనిపించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడం, బరువు తగ్గడంలో సహకరించడం వంటి అనేక ప్రయోజనాలుంటాయి.
Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం
Team Latestlyసౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.
Saudi Arabia Bus Accident: ఎంత విషాద ఘటన ఇది.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి, సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Team Latestlyతెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.
Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు
Team Latestlyహైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.
Sheikh Hasina Gets Death Penalty: బంగ్లాదేశ్ మాజీ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష, ఆమెను వెంటనే మాకు అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
Team Latestlyసోమవారం, నవంబర్ 17న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక డిమాండ్ను భారతదేశానికి అధికారికంగా పంపింది. గత సంవత్సరంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడంలో పాత్ర పోషించినందుకు ఉరిశిక్ష విధించబడిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ గృహ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లను భారత్ అప్పగించాలని ఢాకా కోరింది.
Mokama Assembly Election Result 2025: బీహార్ దూసుకుపోతున్న ఎన్డీయే, 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం, మోకామాలో జైలుకెళ్లిన జెడియు నాయకుడు అనంత్ సింగ్ భారీ విజయం
Team Latestlyజైలు శిక్ష అనుభవిస్తున్న జెడియు బలమైన నాయకుడు అనంత్ సింగ్ మోకామాలో భారీ విజయం సాధించారు, ఆర్జెడి అభ్యర్థి వీణా దేవి 63,210 ఓట్లపై 91,416 ఓట్లు సాధించి దాదాపు 30,000 ఓట్ల తేడాతో గెలిచారు . ప్రస్తుతం జాన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో జైలులో ఉన్న సింగ్, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.
Data Privacy Rules: మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్, అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలు గురించి తెలుసుకోండి, డేటా డిలీట్ చేసే ముందు యూజర్కు 48 గంటల నోటీసు
Team Latestlyడిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలి సమగ్ర డిజిటల్ గోప్యతా చట్టంగా పేరుగాంచిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్’ కింద కేంద్ర ప్రభుత్వము కొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది
Sex Assault Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ కోసం వెళ్ళిన మహిళకు లైంగిక వేధింపులు, అక్కడ టచ్ చేస్తూ దారుణం..
Team Latestlyబెంగళూరు శివార్లలోని అనేకల్ నుండి లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ప్లాస్మా మెడినోస్టిక్స్లో స్కాన్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్ట్ తన ప్రైవేట్ భాగాలను తాకాడని 34 ఏళ్ల మహిళ ఆరోపించిన తర్వాత ఈ షాకింగ్ లైంగిక వేధింపుల కేసు బయటపడింది.
Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు
Team Latestlyతెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి
Team Latestlyరాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.