India

TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది .

Indiramma Illu Mobile App: ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

Hazarath Reddy

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Kerala Shocker: దారుణం, రెండున్నరేళ్ల బాలిక ప్రైవేట్ భాగాల్లో వేలి గోర్లతో రక్కిన గాయాలు, షాకయిన ఆస్పత్రి వైద్యులు, ముగ్గురు అరెస్ట్

Hazarath Reddy

మంచాన్ని తడిపినందుకు శిక్షగా రెండున్నరేళ్ల బాలిక ప్రైవేట్ భాగాలను గాయపరిచినందుకు తిరువనంతపురంలోని ప్రభుత్వ బాలల గృహంలో ముగ్గురు కేర్‌టేకర్లను అరెస్టు చేశారు. కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (KSCCW) నిర్వహించే సదుపాయంలో ఈ సంఘటన జరిగింది

Advertisement

Pushpa 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప 2 ఓటీటీ రైట్స్, దాదాపు రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Hazarath Reddy

డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా వ‌చ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్

Hazarath Reddy

శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.

Telangana Shocker: లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం

Arun Charagonda

లైంగిక వేధింపులు భరించలేక ఫార్మాసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుంది శిరీష (28). బిచ్కుందలో కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది శిరీష. పని చేస్తున్న చోట శిరీషను కొందరు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో ఉంటున్నారు శిరీష భర్త.

Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు

Hazarath Reddy

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్‌చంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్‌రెడ్డిలపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది.

Advertisement

Mythri Movie Makers: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించిన మేకర్స్

Arun Charagonda

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది

Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్ వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Pushpa 2: The Rule: పుష్ప 2 లో ఎవడ్రా బాస్ అనే డైలాగ్‌ నిజంగా అలానే ఉందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంట్రవర్సీ డైలాగ్ అసలు వాస్తవం ఇదే..

Hazarath Reddy

పుష్ప 2 నుండి "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి నేనే బాస్" అనే డైలాగ్ ఇలా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపిస్తుంది . మెగా ఫ్యామిలీకి బన్నే బాస్ అని చెప్పేందుకు ఈ ఫేక్ డైలాగ్ ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు-

Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయిన ఆకతాయిలు, ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చించివేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆళ్లగడ్డలో బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చింపేశారు. సినిమా ప్రదర్శింస్థుడగానే రెండవ పాట ఫీలింగ్స్ పాటకు స్క్రీన్ ముందు స్టెప్పులు వేసిన ఫ్యాన్స్. అదే సమయంలో స్క్రీన్ ను చింపేశారు.

Advertisement

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో విషాదం, రైలు నుండి దూకి మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య, సీటు రాకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని రైలు నుండి దూకి డాక్టర్ కావలసిన తనుజ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం పట్టడానికి చెందిన తనుజ అనే వ్యక్తి ఇటీవల డాక్టర్ కోర్స్ కోసం పరీక్షలు రాసింది.

CM Revanth Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు వెసులుబాటు కల్పించేలా విధివిధానాలు రూపొందించాం, ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల కేటాయింపు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు

PDSU On Pushpa 2: అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి..పీడీఎస్‌యూ డిమాండ్, పుష్ప 2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ ప్రాణం పోయింది..సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక

Arun Charagonda

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది PDSU. పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణం పోయిందని...అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుంటే 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్-RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్య‌ధిక సిక్స‌ర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ

Hazarath Reddy

బరోడా వారి ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు కొట్టి, మరో T20 రికార్డును బద్దలు కొట్టింది . జింబాబ్వే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (27) సాధించిన రికార్డును కలిగి ఉంది గాంబియాతో జరిగిన అదే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది.

Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్

Hazarath Reddy

భారత టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును సమం చేశాడు. 24 ఏళ్ల పంజాబ్ క్రికెటర్ ఈ మైలురాయిని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సాధించాడు.

Konda Surekha: తండ్రి ఫాంహౌస్‌లో కొడుకు రోడ్లపై, కేసీఆర్ - కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ ఫైర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని సురేఖ సవాల్

Arun Charagonda

ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అన్నారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో మాట్లాడిన సురేఖ...బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది...కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు.

Telangana: షాకింగ్... రైలు పట్టాలపై బైకుతో ప్రయాణం..ట్రైన్‌ను ఆపేసిన అధికారులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Arun Charagonda

రైల్వే పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట వద్ద షిరిడీ నుంచి తిరుపతి వెళుతున్న రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో ద్విచక్రవాహనంపై రైలుకి ఎదురెళ్లాడు జగదీష్ అనే వ్యక్తి. జగదీష్‌ను పట్టాలపై నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

Advertisement
Advertisement