India

Prashant Kishor on Vijay: వీడియో ఇదిగో, ధోనీ CSKని గెలిపించినట్టుగా నేను దళపతి విజయ్‌ని గెలిపిస్తా, తమిళనాడు ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, మార్పు కోసం ఉద్యమంగా TVK పార్టీని అభివర్ణించిన రాజకీయ వ్యూహకర్త

Hazarath Reddy

ఆదివారం చెన్నైలో ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు

Amit Shah Slams MK Stalin: సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే, ఈ సారి తమిళనాడులో వచ్చేది ఎన్టీఏ ప్రభుత్వమే, డీఎంకే సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Hazarath Reddy

తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తీవ్ర విమర్శలు (Amit Shah Slams MK Stalin) చేశారు. ఆ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానం మూడు గంటల ఆలస్యం, తీవ్ర ఆగ్రహం

Arun Charagonda

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.

Rajouri Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులు, అదనపు బలగాలను తరలించిన భారత ఆర్మీ

Hazarath Reddy

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.ఆర్మీ వాహనంపై (Terrorist attack on army vehicle) విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.

Advertisement

Maha Shivaratri Celebrations: కాశీలో నాగ‌సాధువుల ఊరేగింపు వీడియో ఇదిగో, సాధువుల‌పై పూల వ‌ర్షం కురిపించిన యూపీ ప్ర‌భుత్వం, కాశీ విశ్వేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న సాధువులు

Hazarath Reddy

మ‌హాశివ‌రాత్రి పండుగల వేళ‌.. నాగ‌సాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వ‌రుడి ఆలయాన్ని ద‌ర్శించుకున్నారు. శైవ సంప్ర‌దాయానికి చెందిన ఏడు అకాడాలతో పాటుగా గంగా ఘాట్ల నుంచి నాగసాధువులు విశ్వ‌నాథుడి ఆల‌యానికి ఊరేగింపుగా వెళ్లారు.

Maha Kumbh Mela 2025: మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు (Devotees) వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో కుంభ్‌ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది.

JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ

Arun Charagonda

జెఎంఎం ఎంపీ మహువా మాజీ మహా కుంభ్ నుండి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు(JMM MP Mahua Maji Injured). బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మహువా కారు ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.

Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!

Arun Charagonda

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.

Advertisement

Sea Turtles in Rushikulya Beach: వీడియో ఇదిగో, గుడ్లు పెట్టేందుకు రుషికుల్య బీచ్‌కు చేరుకున్న 7 లక్షల ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన అధికారులు

Hazarath Reddy

ఒడిశాలోని కేంద్రపడ జిల్లా పరిధిలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వచ్చాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు Rushikulya Beach కు చేరుకున్నాయి.

Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సు కిందకు దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో 5 మంది మృతి

Hazarath Reddy

తమిళనాడులోని కరూర్ జిల్లాలోని కులితలై సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో (Five dead as car crashes) ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు.

Rajareddy Eye Center: పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్

Arun Charagonda

పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

‘పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూప్‌లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా నోటీసులు ఇచ్చింది.

Advertisement

Uttar Pradesh: పెళ్లి కూతురు బదులు ఆమె ఫ్రెండ్ మెడలో పూల దండ వేసిన వరుడు... చెంప చెల్లు మనిపించిన వధువు, యూపీలో ఫన్నీ సంఘటన

Arun Charagonda

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాయ్‌బ‌రేలీలో ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో పెళ్లి కూతురు ఫ్రెండ్ మెడలో పూలమాల వేశారు. దీంతో ఆగ్రహించిన వ‌ధువు... పెళ్లి కొడుకు చెంప చెల్లుమనిపించింది.

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Hazarath Reddy

ఎన్‌ఈపీని అమలు చేయాలని బలవంతం చేయడం సరికాదని రంజన పేర్కొన్నారు. తమిళ భాష గొప్పతనాన్ని తగ్గించే ఈ సూత్రానికి తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళుల గౌరవానికే తాను కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. కాబట్టి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్‌వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..

Hazarath Reddy

షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు

Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

Arun Charagonda

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Sudanese Military Plane Crash: వీడియో ఇదిగో, టేకాఫ్ అవుతుండగా కుప్పకూలి మంటల్లో చిక్కుకున్న విమానం, ఫైలట్‌తో సహా 10 మంది ప్రయాణికులు మృతి

Hazarath Reddy

సూడాన్ లో మంగళవారం నాడు రాజధాని ఖార్టూమ్ శివార్లలో సైనిక విమానం కూలిపోయి, అనేక మంది అధికారులు, పౌరులు మరణించారని సైన్యం తెలిపింది. సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి ఈ విమాన ప్రమాదం (Sudanese Military Plane Crash) చోటుచేసుకుంది.

Telangana Tunnel Collapse Update: కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్... రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ,బీఆర్ఐ నిపుణులు,8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు

Arun Charagonda

SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Kerala Shocker: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలోనే ఆరు హత్యలు, ప్రియురాలితో పాటు తన తల్లిని చంపేసిన కిరాతకుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు.. అదీ గంటల వ్యవధిలోనే.. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది . తిరువనంతపురంలో అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది

Advertisement
Advertisement