India

Telangana: కల్తి కల్లు ఎఫెక్ట్, 8 మందికి అస్వస్థత, వికారాబాద్‌లో ఘటన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

Arun Charagonda

కల్తీ కల్లు తాగి ఎనిమిది మందికి అస్వస్థత చోటు చేసుకుంది. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితమైన నీరు కలపడం వల్లే తాగిన వారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.

Telangana High Court On Janwada Farmhouse: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాకు ఊరట, నిబంధనల ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశం

Arun Charagonda

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు ఊరట లభించింది. జన్వాడ ఫాంహౌస్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై జీఓ 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశం ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Astrology: ఆగస్టు 30 నుండి గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు.

sajaya

గురుగ్రహం చాలా బలమైన గ్రహం. ప్రతి వ్యక్తిలో విజయం సాధించడానికి ఈ గ్రహం ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు 30 సాయంత్రం 5 గంటలకు గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Astrology: ఆగస్టు 24 శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశం.ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు వైభవానికి ఐశ్వర్యానికి కారణమైన గ్రహం. శుక్ర గ్రహం అనుగ్రహ కారణంగా జీవితంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

Advertisement

KTR: నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్‌ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?

Arun Charagonda

తను ఎలాంటి ఫామ్ హౌస్ లేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వాటిపై చర్యలు ఎవని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వివేక్ వెంకటస్వామి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు

Health Tips: ఉదయం పూట ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీకు హైబీపీ ఉన్నట్లే.

sajaya

చాలామందిలో బీపీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరిలో హై బీపీ ఉంటుంది కొందరిలో బిపి ఉంటుంది. అయితే అది కరెక్ట్ ఫోటో గురించి చాలామందికి వాటి సంకేతాలు వచ్చినప్పటికీ కూడా తెలియదు.

Health Tips: కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారా.ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

sajaya

కామెర్లు అనేది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ముఖ్యంగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.

Manta Ray Fish Caught in AP: వీడియో ఇదిగో, జాలరులకు చిక్కిన 1,500 కిలోల బరువున్న మంటా రే చేప,ప్రపంచంలోనే అతి పెద్ద చేపలలో ఇది ఒకటి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని మినీ హార్బర్‌లో ఓ మత్స్యకారుడు సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన జెయింట్ ఓషియానిక్ మాంటా రే చేపను జేసీబీ యంత్రం సాయంతో ఒడ్డుకు చేర్చారు

Advertisement

Chittoor Food Poisoning: చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, వాంతులు,విరేచనాలతో ఆస్పత్రిపాలైన 70 మంది విద్యార్థులు

Hazarath Reddy

చిత్తూర్ అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు,విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Hyderabad Rain Videos: హైదరాబాద్ వర్ష భీభత్సం వీడియోలు ఇవిగో, వరదలో వాహనాలతో పాటు కొట్టుకుపోయిన మనిషి మృతి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది.పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది.

KTR On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం, 'చీప్ మినిస్టర్' అని మండిపడ్డ కేటీఆర్, రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరిక

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.

Tamil Nadu: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు దాటుతూ 3 అడుగుల గొయ్యలో పడిన చిన్న పిల్లలతో పాటు ముగ్గురు మహిళలు, తమిళనాడులో ఘటన

Hazarath Reddy

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సత్తూరులోని మదురై రోడ్డులో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీని నిర్మించేందుకు రాష్ట్ర హైవేస్ ద్వారా తవ్విన వాననీటితో నిండిన ట్రెంచ్‌లో ముగ్గురు మహిళలు జారిపడ్డారు. వారు తమ బిడ్డలను ఎత్తుకుని రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా ఆ నీటి గుంటలో పడిపోయారు.

Advertisement

Ambernath Road Accident: వీడియో ఇదిగో, మనిషిని ఢీకొట్టి సగం దూరం అలాగే ఈడ్చుకెళ్లిన SUV కారు, ఆగిన వెంటనే మరొక కారును ఢీకొట్టిన డ్రైవర్

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఒక ఆందోళనకరమైన సంఘటనలో, అంబర్‌నాథ్‌లో ఒక మహిళ, ఆమె పిల్లలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడానికి ముందు SUV డ్రైవర్ ఒక వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్లాడు. అంబర్‌నాథ్‌లో సంభవించిన ఆరోపించిన రోడ్ రేజ్ యొక్క వీడియో ఈరోజు, ఆగస్టు 20న ఆన్‌లైన్‌లో కనిపించింది.

Health Tips:పేగుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

sajaya

మన మొత్తం ఆరోగ్యానికి పేగులు చాలా ముఖ్యమైనవి. మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ప్రేగులు ఉపయోగపడతాయి. ఒకవేళ వీటిలో ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

Is This Place Haunted? డేంజర్ స్పాట్ అంటే ఎలా ఉంటుందో వీడియోలో చూడండి, గత రెండేళ్లలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్‌లన్నీ జంతువులు అడ్డు రావడం వల్లే..

Hazarath Reddy

అనేక ప్రాంతాల్లో కొన్ని రోడ్లు డేంజర్ స్పాట్ లుగా ఉంటాయని ఆ ప్రాంతాల స్థానికులు చెబుతుంటారు. ఈ రోడ్డు గుండా వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు. దీనికి సరైన ఆధారాలు అంటే గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి డేంజర్ స్పాట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Health Tips: పొట్లకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు తినకండి .. తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

sajaya

పొట్లకాయ ఈ సీజన్లో వచ్చే పోషకాహారమైన కూరగాయ. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పొట్లకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. అంతే కాకుండా పొట్లకాయతో కొన్ని ఆహార పదార్థాలు కలపడం కూడా మంచిది కాదు.

Advertisement

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పెట్రోల్ ముందు పెట్టుకుని బీడి వెలిగించి అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు

Hazarath Reddy

రోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు.అప్రమత్తమైన దుకాణాల యజమానులు. నీళ్లు చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన స్థానికులు.

Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు.

Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.

Badlapur Sexual Assault Case: స్కూలు పిల్లలపై లైంగికదాడి, మహారాష్ట్రలో వెలువెత్తిన నిరసనలు, బద్లాపూర్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్, 300 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hazarath Reddy

మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో దుమారం రేపుతోంది. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను సైతం అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ట్రాక్‌ ఆందోళనకారులను చెదరగొట్టారు.

Advertisement
Advertisement