జాతీయం
BMW C 400 GT: బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం స్కూటర్ వచ్చేసింది, ధర రూ. 11. 50 లక్షలకు పైమాటే, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్లలో అందుబాటులో..
Hazarath ReddyBMW C 400 GT ప్రీమియం స్కూటర్ భారత్లో విడుదలైంది, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్లలో అందుబాటులో ఉన్నాయి
Telangana: ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
Arun Charagondaప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
Mumbai: దారుణం, కుక్కలు కరవడానికి వస్తుంటే కర్రతో తరిమిన సెక్యూరిటీ గార్డు, కుక్కల్నే కొడతావా అంటూ వాచ్మెన్పై దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyముంబైలోని అంధేరిలోని ఒక భవనం నుండి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో, హింసాత్మక వీధి కుక్కల గుంపు నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న భవనం యొక్క సెక్యూరిటీ గార్డుపై కుక్క ప్రేమికుడు దాడి (Man Attacks Watch man ) చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Hazarath Reddyఇన్ఫోసిస్ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్ అమలు చేస్తున్నాయి.
IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఫ్యాన్స్కు పండగే
Arun Charagondaక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
Hazarath Reddyభారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థ అయిన జియోస్టార్, వయాకామ్18, డిస్నీ విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తుందని సమాచారం. ఒక నివేదిక ప్రకారం, విలీనం తర్వాత జియోస్టార్ తొలగింపుల గురించి చాలా మంది ఉద్యోగులకు తెలుసు.
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
Hazarath ReddyHPE (హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్) రాబోయే ఉద్యోగాల కోతలలో 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్ పనితీరు పేలవంగా ఉండటంతో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Hazarath Reddyజర్మనీకి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ అయిన DHL, ఈ సంవత్సరం దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించడం ద్వారా తన ఉద్యోగులను తగ్గించుకోనుంది. రాబోయే DHL తొలగింపుల రౌండ్ రెండు దశాబ్దాలలో అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. ఇది కంపెనీ పనితీరు తక్కువగా ఉందని ప్రకటించబడింది, లాభంలో 7.2% తగ్గుదల కనిపించింది
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Hazarath Reddyఏపీ హైకోర్టులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే
Karimnagar: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం.. ప్రైవేట్ పాటలకు చిందులు వేసిన ఉద్యోగ సంఘాల నాయకులు, వీడియో ఇదిగో
Arun Charagondaశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం చోటు చేసుకుంది. ప్రైవేటు పాటలకు చిందులు వేశారు ఉద్యోగ సంఘాల నేతలు.
Gujarat Viral Video: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా పోలీస్ అత్యుత్సాహం.. సైకిల్ తొక్కుతున్న బాలుడిపై దాడి, వీడియో ఇదిగో
Arun Charagondaప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా సైకిల్ తొక్కుతున్న బాలుడిని కొట్టాడు ఓ పోలీస్ . వీడియో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన గురువారం సూరత్లో చోటు చేసుకుంది.
Posani Krishna Murali Case: పోసాని కృష్ణమురళికి బెయిల్, ఓబులవారిపల్లి పీఎస్లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు
Hazarath Reddyప్రముఖ నటుడు,వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణమురళికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓబులవారిపల్లి పీఎస్లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. ఇక్కడ నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది.
Lady Aghori: షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి
Hazarath Reddyఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.
KCR: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం... పార్టీ రజతోత్సవాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR). బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభపై కీలక సూచనలు చేశారు.
Konidela Nagababu:ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు, హాజరైన కూటమి నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు.
Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఘజియాబాద్ పోలీసులు గురువారం ఇద్దరు ట్రాన్స్జెండర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో 45 ఏళ్ల వ్యక్తి జననాంగాలను కోసం అనంతరం చంపి, కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో ట్రాన్స్జెండర్లకు గురువుగా మారాలని కోరుకున్నాడని వేవ్ సిటీ పోలీసులు తెలిపారు.
Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
Arun Charagondaచైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు
Kailasagiri Fire Accident: వీడియో ఇదిగో, విశాఖ కైలాసగిరిలో భారీ అగ్నిప్రమాదం. చెత్త తగలబడటంతో భారీగా పొగ, ఒక్కసారిగా బెంబేలెత్తిన టూరిస్టులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది.
Viral Video: రైలు నుండి చెత్త పడేసిన ఉద్యోగి... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!, వైరల్ వీడియో
Arun Charagondaఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది . సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి.
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyవివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికి ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు.