Information

Cyclone Yaas: ఈ సారి తూర్పు తీరంలో మరో తుఫాన్, యాస్ గా నామకరణం చేయనున్న ఐఎండీ, బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం, ఈ నెల 25, 26 తేదీల తర్వాత ఏపీలొ మోస్తరు వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

సైక్లోన్ ఏర్పడితే దీనికి యాస్ (Cyclone Yaas) అని నామకరణం చేయనున్నారు.ఈ పేరును ఒమెన్ సూచించనుంది. ఒమెన్ భాషల్ యాస్ అనగా (Yaas Cyclone Meaning) నిరాశ అని అర్ధం వస్తుంది. ఉత్తర హిందూ మహసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు WMO / ESCAP ప్యానెల్ సభ్య దేశాలు పేర్లను సూచిస్తూ ఉంటాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

Cyclone Tauktae: తీరం దాటిన తౌక్టే తుఫాను, అయినా పెను ముప్పే, మళ్లీ 23న అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలతో వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు

Hazarath Reddy

అరేబియా సముద్రంలో పుట్టిన అత్యంత తీవ్ర తుపాను తౌక్టే సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్‌ – మహువా మధ్య తీరం (Cyclone Tauktae Crosses Gujarat Coast) దాటింది.రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది.

Cyclone Tauktae Update: తీర రాష్ట్రాలను వణికిస్తోన్న తౌక్టే తుఫాను, గుజరాత్‌ తీర ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌, తీరం దాటే సమయంలో గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు

Hazarath Reddy

కరోనావైరస్ విజృంభనకు తోడయిన తుపాను ‘తౌక్టే’ (Cyclone Tauktae Update) తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్‌ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ను జారీ చేసింది.

Cyclone Tauktae Update: ఆరు రాష్ట్రాలకు తౌక్టే తుఫాను ముప్పు, కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు మృతి, ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నున్న తౌక్టే తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నుంద‌ని (Cyclone Tauktae Expected To Reach Gujarat Coast on Morning of May 18) భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. 18న మ.2:30 నుంచి రా.8:30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పోర్‌బందర్‌-నలియా మధ్య తీరం దాటనుందని తెలిపింది.

Advertisement

Cyclone Tauktae Update: మరో 2 రోజులు..వణికిస్తున్న తౌక్టే తుఫాన్, మహారాష్ట్ర, కేరళలో భారీ వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా (Cyclone Tauktae Intensifies Into 'Very Severe Cyclonic Storm) రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌పై తుపాను ప్రభావం (Maharashtra and Gujarat All Set To Face Fury) అదికంగా ఉండనుంది.

Cyclone Tauktae: విరుచుకుపడుతున్న తౌక్టే తుఫాన్, కేరళలో కుప్పకూలిన భవనం, అయిదు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, పోర్బందర్ - నలియాల మధ్య తీరం దాటే అవకాశం

Hazarath Reddy

తౌక్టే తుపాను (Cyclone Tauktae) ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది. కేరళలోని కసర్‌గడ్‌లో తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది.

Cyclone Tauktae Update: ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

Hazarath Reddy

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా (Cyclone Tauktae update) మారింది. ఈ తుపాన్ శనివారం ఉదయం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం లక్షద్వీప్ (Lakshadweep) ప్రాంతం నుంచి దక్షిణ గుజరాత్, డయ్యూ తీరాలకు చేరే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

Cyclone Tauktae: కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే భీకర తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఒకవేళ అదే నిజమైతే, ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని పేర్కొంది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌక్టే తుఫాను’ (Cyclone Tauktae) అని పేరు పెట్టనున్నారు.

Advertisement

COVID-19 Second Wave: యువతని టార్గెట్ చేసిన సెకండ్ వేవ్, కరోనా కల్లోలంతో లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయిన మెజారిటీ రాష్ట్రాలు, 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ (ICMR Chief Dr Balram Bhargava) మాట్లాడుతూ.. సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు.

Google Pay: గూగుల్ పే నుంచి అదిరిపోయే శుభవార్త, ఇకపై అమెరికా నుంచి ఇండియాకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న గూగుల్ పే

Hazarath Reddy

ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు గూగుల్ పే (Google Pay) శుభవార్త చెప్పింది. ఇకపై గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు (US send money to those in India, Singapore) డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది.

Bank Timings in AP: ఏపీలో బ్యాంకింగ్ పనివేళల్లో మార్పులు, ఇకపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే, అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించిన ఎస్‌ఎల్‌బీసీ

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్, కొనసాగుతున్న కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు (Banking Hours 9 to 12) పరిమితం చేసింది.

Black Fungal Infection: మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే

Hazarath Reddy

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే దానికి తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ తయారయింది. కోవిడ్ ను జయించిన పేషెంట్లను (Mucormycosis Infection in COVID-19 Patients) అది చావు దెబ్బ తీస్తోంది. సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది బ్లాక్‌ ఫంగస్‌ (Mucormycosis Infection) సోకి కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Fuel Price in India: వాహనదారులకు మళ్లీ షాక్, మరోసారి పెరిగిన చమురు ధరలు, పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచిన చమురు కంపెనీలు

Hazarath Reddy

వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. రెండు రోజుల తర్వాత సోమవారం మరోసారి చమురు ధరలను (Petrol and Diesel Prices in India) పెంచాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.53కు చేరుకుంది. డీజిల్‌ లీటర్‌కు రూ.82.06కు చేరింది.

Bank Alert: మూడు ప్రధాన బ్యాంకుల అలర్ట్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దని తెలిపిన ఎస్బిఐ, ఫోన్‌ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లకు దూరంగా ఉండాలని కోరిన PNB, ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయవద్దని తెలిపిన ఐసిఐసిఐ

Hazarath Reddy

కొన్నిసార్లు సహాయం పేరిట, కొన్నిసార్లు చికిత్స పేరిట మరియు కొన్నిసార్లు సహాయం అందించే పేరిట వివిధ రకాలుగా కస్టమర్లను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లను ఉచ్చులో పడకుండా కాపాడటానికి దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు హెచ్చరికలు (SBI, PNB and ICICI have special warning for customers) జారీ చేశాయి.

Oxygen Crisis in India: దేశంలో ఆక్సిజన్ కొరత, జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి

Hazarath Reddy

కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు (Supreme Court Sets Up National Task Force) చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

2-DG: కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం లేని మెడిసిన్, 2-డీజీ ఔషధాన్ని తీసుకువచ్చిన డీఆర్డీవో, డీఆక్సీ డి గ్లూకోజ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా 2-డీజీ (2-DG) అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు (DCGI Approves Anti-COVID-19 Oral Drug) చేసింది.

Advertisement

Covid Lockdown: పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు, నిన్న కొత్తగా నాలుగు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 4,187 మంది కరోనా కారణంగా మృతి

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ (COVID-19 lockdown) విధించాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని చాలా రాష్ట్రాలు అనుకోవడం..మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బ తింటామనే ఉద్దేశంతో పాక్షిక లాక్ డౌన్ (imposed strict Coronavirus curbs, curfews) అమల్లోకి తీసుకువచ్చాయి.

Mucormycosis: కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనావైరస్ నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌‌ (Black Fungus) భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌ (Mucormycosis)‌ భయపెడుతోంది.

Curfew in Andhra Pradesh: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్, వస్తే మధ్యాహ్నం 12 గంటల్లోపే గమ్యం చేరాలి, నేటి నుంచి ఏపీలో 18 గంట‌ల కర్ఫ్యూ అమల్లోకి, కర్ప్యూ నుంచి మినహాయింపు పొందేవి ఏవో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

నేటి నుంచి ప‌గ‌టిపూట క‌ర్ఫ్యూ (Curfew in Andhra Pradesh) కూడా అమ‌ల‌ు చేస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 18 గంట‌ల చొప్పున క‌ర్ఫ్యూ (18-hour curfew from today in Anadhra Pradesh) అమ‌లు కానుంది. ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ (Day Time Curfew) అమ‌ల్లో ఉంటుంది.

JEE (Main) May 2021 Session Postponed: జేఈఈ మెయిన్స్‌ వాయిదా, అప్‌డేట్స్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌

Hazarath Reddy

పెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్టా కేం‍ద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ప్రకటన చేశారు.

Advertisement
Advertisement