సమాచారం

India Rejects China's Allegations: చైనావి అన్నీ తప్పుడు ప్రకటనలు, మేము ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ు, స్పష్టం చేసిన భారత ఆర్మీ, పాన్‌గాంగ్ స‌ర‌స్సు రెచిన్ లా వ‌ద్ద కాల్పుల కలకలం

Hazarath Reddy

సరిహద్దుల్లో ముందుగా భారత ఆర్మీనే కాల్పులు జరిపిందంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనాకు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఇండియ‌న్ పొజిష‌న్స్‌కు స‌మీపంగా పీఎల్ఏ ద‌ళాలు ముందుకు వ‌చ్చి గాలిలోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు ఇవాళ భార‌త ర‌క్ష‌ణ‌శాఖ పేర్కొన్న‌ది. పాన్‌గాంగ్ స‌రస్సు వ‌ద్ద తమ ద‌ళాలు ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ని ఆర్మీ పేర్కొన్న‌ది. చైనా సైన్యమే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేసింది.

Milaap: ప్రాణాలపై ఆశలను చిగురింపజేస్తున్న మిలాప్, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎంతోమందికి చేయూత, సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ మిలాప్

Hazarath Reddy

మిలాప్..ఈ పేరు అందరికీ సుపరిచితమే.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకువెళుతోంది. పేదవారికి, ఆపదలో ఉన్నవారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు (Milaap Free Crowdfunding for India) సేకరించి వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. వరల్డ్ ఛారీటి డే సంధర్భంగా పలు విషయాలను మాతో షేర్ చేసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9000+ ఎన్జీఓలతో కలిసి పనిచేసిన ఈ సంస్థ ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

Airtel Xstream Fiber Plans: ఎయిర్‌టెల్ నుంచి భారీ ఆఫర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ప్యాకేజీలను ప్రకటించిన మెబైల్ సేవల దిగ్గజం, సెప్టెంబరు 7 నుంచి అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రముఖ టెలికం కంపెనీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను (Airtel Xstream Fiber Plans) ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్‌లు (Airtel customers broadband plans) అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్‌లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్‌లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

Vodafone Idea Brands Now ’VI‘: జియోకు సవాల్, రూ. వొడాఫోన్ ఐడియాలోకి త్వరలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, వీఐ పేరిట సరికొత్త లోగోను విడుదల చేసిన మొబైల్‌ సేవల దిగ్గజం

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా వీఐ పేరుతో కొత్త వైర్‌లెస్‌ సర్వీసుల బ్రాండును (Vodafone Idea Rebrands) ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను (Vodafone Idea Now VI) సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్‌ సేవలలో (digital experience) భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్‌ ప్రకటించడం గమనార్హం!

Advertisement

Literacy Rate Ranking: అక్షరాస్యతలో అట్టడుగున ఏపీ, కేరళ నంబర్ వన్, రెండవ స్థానంలో ఢిల్లీ, అస్సాం కన్నా వెనుకంజలో తెలంగాణ రాష్ట్రం, గణాంకాలను విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌

Hazarath Reddy

విద్యా రంగానికి సంబంధించి నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) (National Statistical Office (NSO) తాజాగా 2017-18 సంవత్సరానికి విద్యారంగానికి సంబంధించి డేటాను విడుదల చేసింది. ఏడు సంవత్సరాల దాటిన వారి విద్యార్హతల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 66.4 శాతం అక్షరాస్యతతో (Andhra Pradesh) ఏపీ అట్టడుగున ఉంది. 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ (Kerala) నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

Metro Trains Resumed Operations: 169 రోజుల త‌ర్వాత..దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ సర్వీసులు తిరిగి ప్రారంభం, కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ మెట్రో ప్ర‌యాణికుల‌కు ఎంట్రీ

Hazarath Reddy

దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో మెట్రో రైలు స‌ర్వీసు సేవ‌లు తిరిగి ప్రారంభం (Metro Resumes Operations) అయ్యాయి. 169 రోజుల త‌ర్వాత ఢిల్లీ మెట్రో సర్వీసులు పునరుద్ధిరించబడ్డాయి. మార్చిలో విధించిన లాక్‌డౌన్ (COVID-19 Lockdown) నుంచి మెట్రో స‌ర్వీసులు బంద్ అయిన విషయం విదితమే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప‌లు న‌గ‌రాల్లోని మెట్రో స‌ర్వీసుల‌న్నీ ర‌ద్దు అయ్యాయి. అయితే అన్‌లాక్‌4 ద‌శ‌లో భాగంగా నేటి నుంచి ఢిల్లీ, నోయిడా, ల‌క్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో మెట్రో స‌ర్వీసులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.

Teachers Day 2020: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్లే హీరోలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ, అమిత్ షా, ఇతర రాజకీయ నాయకులు

Hazarath Reddy

ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.

Rajeev Kumar is New EC: ఈసీకి కొత్త బాస్, కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం, రాజీనామా చేసిన అశోక్‌ లావాసా స్థానంలోకి ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

Hazarath Reddy

కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ (Rajeev Kumar is New EC) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన అశోక్‌ లావాసా (Ashok Lavasa) స్థానంలో రాజీవ్‌ కుమార్‌ నియామకం జరిగింది. సెప్టెంబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు (Rajiv Kumar takes over as new EC) స్వీకరించారు. రాజీవ్‌ కుమార్‌ జార్ఖండ్‌ కేడర్‌ 1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి (IPS officer Rajeev Kumar). పబ్లిక్‌ పాలసీ, వివిధ రంగాల్లో పాలనకు సంబంధించి కుమార్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

Advertisement

Jio Fiber Plans Revamped: జియో కొత్త వ్యూహం, రూ. 399కే జియో ఫైబర్ ప్లాన్, ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ పేరిట కొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించిన జియో

Hazarath Reddy

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌కు (JioFiber) సంబంధించి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం (new broadband plans) అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో తెలిపింది. ఇందులో భాగంగా ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌' పేరిట సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేకుండా నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం అవుతాయని జియో తెలిపింది.

Pranab Mukherjee Biography: స్కూలు చదువు కోసం రోజూ 10 కిలోమీటర్ల నడక, జర్నలిస్టు నుంచి రాష్ట్రపతి దాకా.., ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాకుండా అడ్డుపడిందెవరు? ప్రణబ్ దాదా జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం (Pranab Mukherjee No more) చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మృతితో రాజకీయపార్టీలకు అతీతంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కొనసాగిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ (Pranab Mukherjee) పని చేశారు. ఆయ‌న్ను అందరూ ప్ర‌ణ‌బ్ దాదాగా పిలుస్తుంటారు. బెంగాల్‌లో ప్ర‌ణ‌బ్ దా అనే పిలుపు చాలా పాపుల‌ర్ అయ్యింది.

LPG Gas Cylinder New Rules: ఇకపై ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ, నిబంధనల్లో పలు మార్పులను తీసుకువచ్చిన ఆయిల్ కంపెనీలు, త్వరలో వాట్సాప్‌ ద్వారా కూడా నగదు చెల్లించే సదుపాయం

Hazarath Reddy

బుక్‌ చేసిన సిలిండర్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు, పాత నిబంధనల్లో మార్పు (New Rules For LPG Gas Cylinder) చేశారు. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఆయిల్‌ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్‌ డెలివరీ (LPG Gas Cylinder delivery) ఇవ్వనున్నారు. డెలివరీ బాయ్‌కి కస్టమర్ ఓటీపీ (OTP) చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుని ఇకపై సిలిండర్‌ (LPG Cylinder) అందజేస్తాడు. దీంతో బుక్‌ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్‌ అందుతుంది. OTP లేకపోతే, వినియోగదారులు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా కూడా డెలివరీ తీసుకోవచ్చు.

Delhi Metro New Guidelines: అయిదు నెలల తరువాత.. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్లు ప్రారంభం, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

Hazarath Reddy

కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు (Delhi Metro New Guidelines) అన్‌లాక్‌-4 లో (Unlock 4) భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల (Delhi Metro) ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ కేసుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Advertisement

India Coronavirus: రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం విడుద‌ల చేసిన‌ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కరోనాతో తాజాగా 948 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్‌ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Unlock 4 Guidelines: బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్‌లో భాగంగా సడలింపులు ఇచ్చుకుంటూ వస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను (Unlock 4 Guidelines) ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ (MHA) అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను ప్రకటించింది. పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం (Metro Rail open) కానున్నాయి. సెప్టెంబరు 7వ తేదీ నుంచి రాష్ట్రాలు మెట్రోరైళ్లను నడపవచ్చని పేర్కొంది. అయితే.. కేంద్ర హోంశాఖను సంప్రదించాకే.. పరిమితంగా సేవలను అందించాలని స్పష్టం చేసింది.

AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.

Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి

Hazarath Reddy

ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.

Advertisement

Sonu Sood: ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

Hazarath Reddy

సోనూ ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ (Chhattisgarh chief minister Bhupesh Baghel) సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Coronavirus in India: భారతీయుల్లో కరోనాని తరిమేసే యాంటీబాడీలు ఎక్కువే, దేశంలో తాజాగా 64,531 మందికి కోవిడ్-19, తమిళనాడు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్‌‌కు కరోనా

Hazarath Reddy

దేశంలో 24 గంటల్లో 64,531 మందికి కరోనా (Coronavirus in India) సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి (Coivd Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic India) ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టిర‌వ‌కు 3,17,42,782 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఆగ‌స్టు 18న 8,01,518 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది. ‌

Swine Flu: కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక

Hazarath Reddy

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సరికొత్త వ్యాధులు దానికి తోడయ్యాయి. వైరల్ వ్యాధి కరోనా (Covid-19) దేశంలో ప్రజలకు నిదర లేకుండా చేస్తుంటే దానికి స్వైన్ ఫ్లూ ( Swine flu (H1N1) తోడయింది. ఇవి రెండు దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు (swine flu cases) నమోదు కాగా ఈ వ్యాధివల్ల 44 మంది మరణించారు.

Mann Ki Baat on August 30: ఆగస్టు 30 న ప్రధాని మోదీ మన్ కీ బాత్, దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్న ప్రధాని, 1800-11-7800కి డయల్ చేసి మీ సందేశాన్ని ఇవ్వండి

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 30 ఉదయం 11 గంటలకు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Mann Ki Baat on August 30) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియోలో జరిగే ‘మన్ కి బాత్’ (PM Modi to address Mann Ki Baat) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement