Information
DG Level Officer Beats Wife: భార్యపై అడిషనల్ డీజీ దాడి, ఇది కుటుంబ వ్యవహారమని తెలిపిన అడిషనల్ డీజీ పురుషోత్తం శర్మ, విధులనుంచి పోలీసు ఉన్నతాధికారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎంపీ సర్కారు
Hazarath Reddyఒక పోలీసు ఉన్నతాధికారి భార్యపై దాడిచేసి దారుణంగా కొట్టిన ఘటన (DG level Officer Beats Wife) మధ్యప్రదేశ్‌లో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నందుకు భార్యపై ఎదురు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన అడిషనల్ డైరక్టర్ జనరల్ పురుషోత్తం శర్మ మరో మహిళతో ఇంట్లో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా వారిద్దరిని ఆయన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Notices to Chandrababu Residence: కృష్ణమ్మ ఉగ్రరూపం, చంద్రబాబు ఇంటితో సహా కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచన
Hazarath Reddyఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.
TSRTC: ఏపీకి నో..మహారాష్ట్ర,కర్ణాటకకు తెలంగాణ బస్సు సర్వీసులు, సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని తెలిపిన టీఎస్ఆర్టీసీ, ఏపీతో ఒప్పందంపై ఇంకా తెగని పేచీ
Hazarath Reddyతెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు సోమవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రారంభం (TSRTC to resume bus services) కానున్నాయి. ఈ మేరకు బస్సులను నడపడానికి తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి అనుమతి లభించింది. ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అదే రోజున బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ (TSRTC) ఓ ప్రకటనలో తెలిపింది.
Heavy Rains Hits Telugu States: భయపెడుతున్న భారీ వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, నాగార్జునసాగ‌ర్ 10 గేట్లు ఎత్తివేత‌, పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో నదులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాన‌లు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains Hits Telugu States) నదులు, డ్యాములు నిండిపోయాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister K Kannababu) తెలిపారు.
APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మొత్తం సీట్లు అందుబాటులోకి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయం
Hazarath Reddyఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ఇకపై భౌతిక దూరం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొవిడ్ నిబంధనల దృష్ట్యా బస్సుల్లో సగం సీట్లకే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
Visa-Free Entry in 16 Countries: గుడ్ న్యూస్, 16 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు, రాజ్యసభలో వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్
Hazarath Reddyవిదేశాలకు టూర్ కి వెళ్లాలనుకునేవారికి కేంద్రం శుభవార్తను చెప్పింది. 16 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం (Visa-Free Entry in 16 Countries) చేయవచ్చని తెలిపింది. నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.
Women Airborne Combatants: నేవీలో చారిత్రక ఘట్టం, యుద్ధనౌకల్లోకి మహిళామణులు, ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో విధులు నిర్వహించనున్న ఇద్దరు మహిళా అధికారులు
Hazarath Reddyభారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యుద్ధ నౌకల్లో ఇప్పటిదాకా పురుషులే నౌకాదళంలో సేవలు అందిస్తుండగా ఇప్పుడు మహిళలు (Women Airborne Combatants) కూడా వారి సరసన చేరారు. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో (Warships) తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి (Sub Lieutenant Kumudini Tyagi), రితిసింగ్‌లు (Sub Lieutenant Riti Singh) అడుగుపెట్టనున్నారు.
CM KCR Review on Heavy Rains: తెలంగాణలో 5 జిల్లాలకు భారీ వర్షం ముప్పు, అప్రమత్తమైన కేసీఆర్ సర్కారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో (CM KCR Review on Rains) సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులను (floods situation) ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సూచించారు.
'Jio Cricket Play Along': జియో నుంచి బహుమతులు గెలుచుకోండి, జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్ ద్వారా బంఫర్ ఫ్రైజ్ గెలుచుకునే అవకాశం, వివరాలు జియో యాప్‌లో చెక్ చేసుకోండి
Hazarath Reddyఐపీఎల్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రేక్షకులకు జియో నెట్‌వర్క్‌ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో (Jio Users) పాటు నాన్‌ జియో యూజర్లు 'జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్' యాప్‌ (Jio Cricket Play Along)‌ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ను కూడా అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్‌ టీమ్‌కు స్టికర్‌ చాట్‌ ఏర్పాటు, స్కోర్‌లు, మ్యాచ్ షెడ్యూల్‌లు, ఫలితాలను యాక్సస్‌ చేసుకునే అవకాశాన్ని కూడా జియో కల్పిస్తోంది.
Rains in Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు, కుండపోత వర్షాలతో అల్లాడుతున్న హైదరాబాద్ నగరం, పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం
Hazarath Reddyగత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక తెలంగాణ‌లో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర కోస్తాంధ్ర‌, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది.
AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు
Hazarath Reddyగ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.
IRCTC Special Trains: రైల్వే మరో గుడ్ న్యూస్, కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే, దీంతో 310 కి చేరుకున్న మొత్తం నడుస్తున్న రైళ్ల సంఖ్య
Hazarath Reddyదేశంలో అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను ప్రకటించి నడుపుతున్న భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను (IRCTC Special Trains) ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి. వీటిలో చాలా వరకు రైళ్లు బీహార్ నుంచి రాకపోకలు సాగించనుండగా, రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య తిరగనున్నాయి. ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో-ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు.
SBI ATM Cash Withdrawal Rules: రూ.10 వేలు దాటితే ఓటీపీ తప్పనిసరి, సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు, రూల్స్ ఏంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State bank of india) సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై కస్టమర్లు తమ డెబిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ (OTP) నమోదు చేయడం తప్పనిసరి. వచ్చే శుక్రవారం నుంచి ఈ మేరకు నిబంధనలు మారనున్నాయి. ఏటీఎం ద్వారా రూ.10 వేలు, అంతకు పైబడిన నగదు ఉపసంహరించుకునేందుకు ఏటీఎంలో లాగిన్‌ అయిన వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ, పిన్‌ నంబరు (debit card PIN) నమోదు చేసినప్పుడే కస్టమర్‌ చేతికి నగదు అందుతుంది. ఇవి రెండు కరెక్ట్ గా లేకుంటే డబ్బులు విత్ డ్రా కావు. కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.
Andhra Pradesh Floods: ఏపీలో భారీ వర్షాలు, మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, నిండుకుండలా జలాశయాలు, ప్రకాశం బ్యారేజీ ఏడు గేట్లు ఎత్తివేత
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు (Andhra Pradesh Rains), అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Heavy Rains in Telugu States: ఏపీ, తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే కారణం
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
Special Trains: ఏపీ నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల లిస్టు వచ్చేసింది, సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ, ఏపీ నుంచి 24 ప్రత్యేక రైళ్ల రాకపోకల సమాచారం మీకోసం
Hazarath Reddyప్టెంబర్ 12 నుంచి ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను (IRCTC special trains) నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అన్‌లాక్‌ 4.0లో (Unlock 4) భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.
APSET 2020: విద్యార్థులు రెడీ అయ్యారా..రేపట్నుంచే ఏపీ సెట్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సురేష్
Hazarath Reddyఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ (APSET 2020) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు (Andhra Pradesh State Eligibility Test) సన్నాహాలు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
India Rejects China's Allegations: చైనావి అన్నీ తప్పుడు ప్రకటనలు, మేము ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ు, స్పష్టం చేసిన భారత ఆర్మీ, పాన్‌గాంగ్ స‌ర‌స్సు రెచిన్ లా వ‌ద్ద కాల్పుల కలకలం
Hazarath Reddyసరిహద్దుల్లో ముందుగా భారత ఆర్మీనే కాల్పులు జరిపిందంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనాకు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఇండియ‌న్ పొజిష‌న్స్‌కు స‌మీపంగా పీఎల్ఏ ద‌ళాలు ముందుకు వ‌చ్చి గాలిలోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు ఇవాళ భార‌త ర‌క్ష‌ణ‌శాఖ పేర్కొన్న‌ది. పాన్‌గాంగ్ స‌రస్సు వ‌ద్ద తమ ద‌ళాలు ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ని ఆర్మీ పేర్కొన్న‌ది. చైనా సైన్యమే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేసింది.
Milaap: ప్రాణాలపై ఆశలను చిగురింపజేస్తున్న మిలాప్, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎంతోమందికి చేయూత, సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ మిలాప్
Hazarath Reddyమిలాప్..ఈ పేరు అందరికీ సుపరిచితమే.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకువెళుతోంది. పేదవారికి, ఆపదలో ఉన్నవారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు (Milaap Free Crowdfunding for India) సేకరించి వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. వరల్డ్ ఛారీటి డే సంధర్భంగా పలు విషయాలను మాతో షేర్ చేసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9000+ ఎన్జీఓలతో కలిసి పనిచేసిన ఈ సంస్థ ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
Airtel Xstream Fiber Plans: ఎయిర్‌టెల్ నుంచి భారీ ఆఫర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ప్యాకేజీలను ప్రకటించిన మెబైల్ సేవల దిగ్గజం, సెప్టెంబరు 7 నుంచి అందుబాటులోకి..
Hazarath Reddyప్రముఖ టెలికం కంపెనీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను (Airtel Xstream Fiber Plans) ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్‌లు (Airtel customers broadband plans) అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్‌లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్‌లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.