Information
Kanpur Encounter: వికాస్ దూబేను పట్టిస్తే 2.5 లక్షల రివార్డు, ఆచూకి తెలిపిన వారి వివరాలు గోప్యం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్థీ
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న (Kanpur Encounter) గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే‌ (Vikas Dubey) తలపై పెట్టిన నగదు బహుమతిని మరోసారి పెంచారు. గ్యాంగ్‌స్ట‌ర్ వికాశ్ దూబేను ప‌ట్టిస్తే రూ.2.5 ల‌క్ష‌లు రివార్డు ఇస్తామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ప్ర‌క‌టించారు. వికాశ్ దూబేపై ఉన్న రివార్డును పెంచిన‌ట్లు యూపీ డీజీపీ (UP DGP) కార్యాల‌యంలో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో వికాశ్ దూబేనే ప్ర‌ధాన నిందితుడు. ఆ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ గ్యాంగ‌స్ట‌ర్ వికాశ్ దూబే ఇంటిని అధికారులు కూల్చివేశారు.
Elyments App: విదేశీ యాప్‌లకు స్వదేశీ యాప్ ఎలిమెంట్స్‌ భారీ షాక్, ఒక్కరోజులోనే 5 లక్షల డౌన్ లోడ్లు, ఎనిమిది భాషల్లో ఆడియో, వీడియో కాల్
Hazarath Reddyసోషల్‌ మీడియా రంగంలోకి తొలి దేశీయ సూపర్‌ యాప్‌ ఎలిమెంట్స్‌ (Elyments App) అడుగుపెట్టింది. ఈ యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు దీటుగా రూపొందించిన ఈ యాప్‌కు యువతను విశేషంగా ఆకట్టుకుంది. తొలిరోజే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అయిదు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వాలంటీర్లుగా ఉన్న వెయ్యిమందికి పైగా ఐటీ నిపుణులు సంయుక్తంగా ఎలి మెంట్స్‌ యాప్‌ను రూపొందించారు.
International Flights Suspended: జూలై 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం, కార్గో,అనుమతి పొందిన విమానాలకు మాత్రమే అనుమతి, ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ
Hazarath Reddyకరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో (COVID-19 Cases) అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇండియా నిషేధాన్ని(International Flights Suspended) మరోసారి పొడిగించింది. ఇది వరకు జూలై 15 వరకు పొడిగించిన కేంద్రం ఈ నెల 31 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) (Civil Aviation Ministry) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో, ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించింది.
PM Modi Speech in Ladakh: భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyభారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం (India-China border tensions) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ (PM Modi Speech in Ladakh) పరోక్షంగా చైనాపై విరుచుకుపడ్డారు. బ‌ల‌హీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించ‌ర‌ని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాని అన్నారు. ప్ర‌పంచ యుద్ధాల స‌మ‌యంలోనైనా, శాంతి స‌మ‌యంలోనైనా (Peace And Humanity), అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న సైనికుల ధైర్యాన్ని ప్ర‌పంచం చూసింద‌ని, శాంతి కోసం కూడా మ‌న సైనికులు ( Indian soldiers) ప‌నిచేశార‌ని మోదీ అన్నారు. ఉత్త‌మ‌మైన మా‌నవ విలువ‌ల కోసం మ‌నం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.
COVID-19 Vaccine Update: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్‌ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్‌
Hazarath Reddyప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనావైరస్ కు విరుగుడు మందు హైదరాబాద్ ( Hyderabad) నుంచే రానుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్‌ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. అయితే అవేమి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 కల్లా వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది.
PM Narendra Modi in Leh: భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే
Hazarath Reddyభారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు (PM Narendra Modi in Leh) చేరుకున్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్ (CDS General Bipin Rawat), ఆర్మీ చీఫ్ నరవణేతో (Naravane) కలిసి ఆయన లడక్ వెళ్లారు.
Budweiser ‘Piss’ Fact Check: బడ్వైజర్ బీర్లలో మానవ మాత్రం, సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్, ఆ వార్త పచ్చి అబద్దం, వినోదాన్ని పంచేందుకు రాశారట..
Hazarath Reddyఈ మధ్య సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వార్త బాగా వైరల్ అయింది. మందుబాబులు ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కూడా కలుస్తోందన్న వార్తలు (Budweiser Employee Peeing In Beer) విపరీతంగా వైరల్ అయ్యాయి. బడ్వైజర్ బీర్ కంపెనీలో (Budweiser Company) పనిచేసే ఓ ఉద్యోగి 12 ఏళ్లుగా బీర్ ట్యాంకులో తాను మూత్రం పోస్తున్నట్లు వెల్లడించారన్నది ఆ వార్తా కథనం సారాంశం. ఆ ఉద్యోగి తన పేరును వాల్టెర్ పావెల‌గా వెళ్లడించాడు. తమ ప్లాంట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని బడ్వైజర్ బీర్ ప్లాంట్స్‌లో పనిచేసే ఉద్యోగులు ( Budweiser employees) కూడా...తాము ఎప్పుడు యూరిన్ పోవాలనుకుంటే అప్పుడు బీర్ ట్యాంకులో పోసేందుకు అనుమతులు ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
Indian Railways: ఇండియన్ రైల్వేలో తొలిసారి ప్రైవేట్ పెట్టుబడులు, ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం, రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌ కోసం నోటిఫికేషన్ విడుదల
Hazarath Reddyకరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే (Indian Railways) ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి బుధవారం రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌’లను (Request for Qualification) ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ఆశిస్తున్నారు. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే మొదటిసారి.
AP Coronavirus: ఏపీ హైకోర్టు జడ్జి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించండి, రాష్ట్రపతి, సీజేఐలకు లేఖ రాసిన హన్స్‌రాజ్‌, కోవిడ్ పరిస్థితులు ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ
Hazarath Reddyఏపీ హైకోర్టులో కోవిడ్‌-19 పరిస్థితులను (AP Coronavirus) ఎదుర్కోవడంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (Jitendra Kumar Maheshwari) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ (hansraj) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram nath Kovind), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీం న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాశారు.
Section 144 in Mumbai: ముంబైలో మళ్లీ 144 సెక్షన్‌, మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, ప్రారంభమైన స్థానిక రైళ్లు, కోవిడ్-19 నేపథ్యంలో అక్కడ వినాయ‌క ఉత్స‌వాలు రద్దు
Hazarath Reddyమహారాష్ట్ర రాజధాని ముంబైలో మళ్లీ 144 సెక్షన్‌ (Section 144 in Mumbai) విధించారు. బుధవారం నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ ప్రణయ అశోక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.
Coronavirus in India: కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyకరోనావైరస్‌ విజృంభణ దేశంలో (Coronavirus in India) నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు (India Coronavirus) నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ బారినపడి 507 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి.
Unlock 2 Guidelines: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ, జూలై 31వరకు అన్‌లాక్‌-2 నిబంధనలు అమల్లోకి.., అన్‌లాక్‌-2 విధివిధానాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ
Hazarath Reddyకోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రభుత్వం (Central Govt) దశలవారీగా సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అన్‌లాక్‌-2 విధివిధానాలు (Unlock 2 Guidelines) ప్రకటించింది. కేంద్ర హోం శాఖ (Home ministry) ఈ మేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై 31వరకు అన్‌లాక్‌-2 (Unlock 2) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ (Lockdown) పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
PM Modi to Address Nation: నేడు ప్రధాని ప్రసంగం ఆ రెండింటి మీదనేనా ? సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, కోవిడ్-19, బార్డర్ ఘర్షణలే ఇప్పుడు హాట్ టాఫిక్..
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సాయంత్రం 4 గంట‌ల‌కు (PM Modi to Address Nation) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే అన్‌లాక్‌-2 కు (Unlock 2) సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ( Home ministry) మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ (Lockdown) కొన‌సాగుతుంద‌ని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వ‌ర‌కు మూసే ఉంటాయని హోంశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. రాత్రి 10 గంట‌ల‌ నుంచి ఉదయం 5 గంట‌ల వరకు య‌థావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
BJP MLA Subhash Sudha: బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ, కొన్ని రోజులుగా జ్వరంతో బాధ‌ప‌డుతున్న హర్యానా రాష్ట్రంలోని థానేస‌ర్ ఎమ్మెల్యే సుభాష్ సుధా
Hazarath Reddyహర్యానా రాష్ట్రంలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతోంది. అక్కడ తాజాగా హ‌ర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు (BJP MLA Subhash Sudha) కూడా క‌రోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేస‌ర్ నియోజ‌వ‌ర్గ శాస‌న స‌భ్యుడు (Thanesar in Kurukshetra) సుభాష్ సుధా గ‌త కొన్ని రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్ల‌డించారు.
Maharashtra Cops: మహారాష్ట్రలో 1,030మంది పోలీసులకు కరోనా, కోవిడ్-19 కల్లోలానికి అక్కడ 59మంది పోలీసులు మృతి, ముంబైలో అత్య‌ధిక కేసులు నమోదు
Hazarath Reddyమ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ వైర‌స్ ధాటికి మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 77 మంది పోలీసుల‌కు (police personnel) క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్ద‌రు పోలీసులు క‌రోనాతో (two others died) చ‌నిపోయారు. మ‌హారాష్ర్ట పోలీసు విభాగంలో (Maharashtra Cops) క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. క‌రోనా విజృంభ‌ణ‌తో పోలీసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
Maharashtra Lockdown Extension: జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు, ముంబైని వణికిస్తున్న కరోనావైరస్
Hazarath Reddy‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్న‌ాయి. అక్క‌డ క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌డం కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra Lockdown) జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు మ‌హా స‌ర్కారు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది.
Fuel Prices Today: దేశంలో ఆగని పెట్రోమంటలు, వరుసగా 20 వరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, నేడు పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంపు
Hazarath Reddyదేశంలో పెట్రో మంటలు (Petro Price Fire) కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది.
Remdesivir Update: కరోనాకు మందు వచ్చేసింది, మొదటి విడతగా 5 రాష్ట్రాలకు 20 వేల రెమ్డీస్వీర్‌‌ ఇంజక్షన్లను సరఫరా చేసిన హెటిరో సంస్థ, 3,4 వారాల్లో లక్ష ఇంజక్షన్లు అందుబాటులోకి
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇది రోజు రొజుకు విశ్వరూపం చూపిస్తోంది. దీని విరుగుడుకు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సంస్థ హెటిరో దీని నియంత్రణకు మందును (Hetero's Antiviral Drug) తయారుచేసినట్లు తెలిపింది. రెమ్డీస్వీర్‌ పేరుతో (Remdesivir Update) ఇంజక్షన్‌ రూపంలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.కాగా కరోనా ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది.
PAN-Aadhaar Card Linking: గుడ్ న్యూస్, ఆధార్-పాన్ లింక్ గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు, ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది.