Information

Electricity Bills in AP: గత నెల కరెంట్ బిల్లే ఈ నెల కట్టండి, స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి, లాక్‌డౌన్‌ వేళ ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదన్న డిస్కమ్‌లు

Hazarath Reddy

మార్చి నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లులే (Electricity bills) ఏప్రిల్‌ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (APERC) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (COVID-19 Lockdown) కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాయి.

Indian Railways: రైళ్లు నడుస్తాయనే వార్తలను నమ్మకండి, అవన్నీ అసత్య ప్రచారాలు, వార్తను ప్రసారం చేసేముందు నిజాలు తెలుసుకుని పబ్లిష్ చేయండి, మీడియాను కోరిన రైల్వే శాఖ

Hazarath Reddy

మరికొద్ది రోజుల్లో లాక్ డౌన్ (Lockdown) ముగియనున్న నేపథ్యంలొ రైళ్లు తిరుగుతాయని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బుకింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయని ఏప్రిల్ 15 నుంచి రైళ్లును నడిపేందుకు ఇండియన్ రైల్వే (Indian Railways) కసరత్తు చేస్తోందని వార్తలు సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫేక్ వార్తలపై (Fake News) రైల్వే శాఖ స్పందించింది.

Rapid COVID-19 Test Kits in AP: కరోనా కట్టడికి ఏపీలో కీలక అడుగు, కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఈ కిట్ల ద్వారా 55 నిమిషాల్లోనే కరోనా ఫలితం

Hazarath Reddy

Dharavi COVID-19 Report: ముంబై మురికివాడలో కరోనా కల్లోలం, ధారావిలో 22కి చేరిన కరోనా కేసులు, 7 లక్షల మందికి కోవిడ్ 19 టెస్ట్‌లు

Hazarath Reddy

ఇక ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో (Mumbai Dharavi) ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 22 కరోనా కేసులు (Dharavi COVID-19 Repor) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. రాబోయే 10-12రోజుల్లో దాదాపు 7.5లక్షల మంది ధారావి వాసులకు కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) తెలిపింది.

Advertisement

Billionaires Violate Lockdown: లాక్‌డౌన్‌తో పనేంటి, పీఎంసీ బ్యాంకు నిందితుల భారీ విందు, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, పాసులు ఇచ్చిన మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిపై వేటు

Hazarath Reddy

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్‌డౌన్‌ (Lockdown) నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే ఈ బిలియనీర్లు మాత్రం భారీ విందు (Mumbai billionaires violate lockdown) చేసుకున్నారు. దీనికోసం ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు ఈ బిలియనీర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ బిలియనీర్లు యస్ బ్యాంక్ (Yes Bank) కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

IRCTC Suspends Bookings: ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు రైల్వే టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్ రద్దు, రైల్వే నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాలు వచ్చినట్లేనా..?

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) దాని కట్టడికి చర్యలను తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24 నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి తెలిసిందే. అది ఈ నెల 15తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రైళ్లు, విమానాలు తిరుగుతాయని భావిస్తున్నవారికి ఇండియన్ రైల్వే (Indian Railways) ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

COVID-19 in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న ముంబై, ధారావిలో 7కు చేరిన కరోనా కేసులు, మహారాష్ట్రలో 891కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి (COVID-19 in Maharashtra) కరాళ నృత్యం చేస్తోంది.ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. మహారాష్ట్రలోని అత్యధిక కేసులు ముంబై నుంచే ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో (Dharavi) మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.

'Boycott TikTok': చైనాపై నెటిజన్ల ఫైర్, ప్రపంచదేశాల వినాశనానికి చైనానే కారణమంటూ ఆగ్రహం, #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం

Hazarath Reddy

వినాశనానికి చైనానే కారణమని, ప్రారంభ దశలోనే వైరస్‌ను చైనా (China) కట్టడి చేయలేకపోయిందని ప్రపంచ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ఈ ప్రభావం ఇండియాలోనూ అధికంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు.

Advertisement

Maharashtra Coronavirus: క్వారంటైన్‌లోకి మహారాష్ట్ర సీఎం భద్రతా సిబ్బంది, మాతోశ్రీ సమీపంలో ఛాయ్ వాలాకు కరోనావైరస్, కరోనా నియంత్రణ జోన్‌గా సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం

Hazarath Reddy

కరోనా మహమ్మారి దెబ్బకి మహారాష్ట్ర (Maharashtra Coronavirus) చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ముంబై నగరంలో (Mumbai) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా కరోనా సెగ మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Maharashtra Chief Minister Uddhav Thackeray) భద్రతా సిబ్బందికి తాకింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి (Matoshree) సమీపంలోని ఒక టీ దుకాణదారునికి కరోనా పాజిటివ్ గా తేలింది. లాక్‌డౌన్‌ కంటే ముందు సీఎం భద్రతా సిబ్బంది అంతా అతని కొట్టు వద్దే టీ తాగారు.

COVID-19 Under YSR Aarogyasri: ఉచితంగా మెరుగైన వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.., ఏపీలో 304కి చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Hydroxychloroquine Drugs: భయపడకండి, ఆ డ్రగ్స్ ఎగుమతి చేస్తాం, కోవిడ్ 19 ప్రభావిత దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్,పారాసిటమోల్‌ ఎగుమతి చేస్తామని తెలిపిన భారత్

Hazarath Reddy

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ (Hydroxychloroquine). వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్, పారాసిటమోల్ (Paracetamol) మాత్రమే. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్సలో వాడుతున్నారు. దీని ఎగుమతిని ఇండియా ఆపేసింది. దీంతో కరోనా మహమ్మారిన పడి విలవిల లాడుతున్న ప్రపంచదేశాలు (Global) భారత్ వైపు చూస్తున్నాయి. ఆ డ్రగ్ ను ఎగుమతి చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ (India) కీలక నిర్ణయం తీసుకుంది.

Coronavirus: కరోనాపై యుద్ధానికి రూ.7900 కోట్లు రెడీ, ఏడాది పాటు ప్రధాని,రాష్ట్రపతి,ఎంపీల జీతాల్లో 30 శాతం కోత, ఎంపీల్యాడ్స్ స్కీం రెండేళ్ల పాటు రద్దు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Coronavirus Pandemic) వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ ప్రభుత్వం కోత విధించింది. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత (30 percent salary cut) విధించాలని నిర్ణయించారు.

Advertisement

Free Eeducation Learning Apps: మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ దెబ్బకు మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. విద్యార్ధులు, ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మనమందరం ఇప్పుడు ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలను నేర్చుకోలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు. అయితే ఆ బాధ లేకుండా కొన్ని యాప్ లు ప్రీమియం సభ్యత్వంతో ఉచితంగా వారికి సేవలను అందిస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ల గురించి ఓసారి తెలుసుకుందాం.

Diya Jalo India: దీపాల వెలుగుల్లో మెరిసిన ఇండియా, దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు, విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపిన కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌

Hazarath Reddy

దీప కాంతిలో భారతావని (India light lamp) వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్‌ పై (Coronavirus) జరుగుతున్న పోరాటంలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా అధ్బుతమైన రెస్సాన్స్ కన్పించింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారుసరిగ్గా 9గంటలకు ( 9 PM 9 Minutes) ఇళ్లలోని విద్యుత్తు దీపాలు ఆపివేసి దీపాలు వెలిగించారు.

AP Medi-Tech Zone: కరోనా కట్టడిపై అలుపెరగని పోరు, ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ, విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్‌లో తయారీ పనులు, త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరిన కేంద్రం

Hazarath Reddy

ఏపీలో పంజా విప్పుతున్న కోవిడ్ 19 (COVID-19) మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలకమైన వెంటిలేటర్లు మరియు కోవిడ్ -19 టెస్టింగ్ కిట్‌లను (COVID-19 Testing Kits) ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెడి-టెక్ జోన్ (AMTZ) ను ఉపయోగించుకోనుంది. కేంద్రం ఇప్పటికే 3,500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూనిట్ల సమీకరణ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతుందని ఆంధ్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు మరియు వాణిజ్య) రజత్ భార్గవ తెలిపారు.

Tablighi Jamaat Event: తబ్లిఘీతో సంబంధమున్న వారి కాల్ డేటాపై నిఘా, జీపీఎస్ లొకేషన్ ద్వారా గుర్తించనున్న ఢిల్లీ పోలీసులు, సహకరిస్తున్న రాష్ట్రాల పోలీసులు

Hazarath Reddy

ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ ఈవెంట్ కు (Tablighi Jamaat Event:) హాజరైన వారివేనని తెలుస్తోంది. ఈ మతపరమైన కార్యక్రమానికి (religious congregation) దాదాపు 9 వేల మంది హాజరయ్యారని కేంద్రం గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీరంతా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. అయితే వీరిని గుర్తించడం చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) కాల్ ట్రేస్ మీద ఫోకస్ చేశారు.

Advertisement

#9pm9minute: లైట్లు ఆర్పే సమయం గుర్తుంది కదా, ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తు చేసిన ప్రధాని మోదీ, రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus in India) దేశంలో పంజా విప్పిన నేపథ్యంలో ఇండియా (India) మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేసి దేశం మొత్తం కరోనావైరస్ ని ( Coronavirus) తరిమేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ (PM Modi Twitter) వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు.

Trump Urges PM Modi: అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్, హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా

Hazarath Reddy

కరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని (Trump urges PM Modi) కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌(hydroxy chloroquine) మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) అభ్యర్థించారు. కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు.

Salute Police Officers: పోలీసులపై పూల వర్షం, దారి పొడవునా పోలీస్ వాహనాలపై పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న మీరట్ ప్రజలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

Hazarath Reddy

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోలీసులు త‌మ కుంటుంబాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం రోడ్ల‌పై నిద్రాహారాలు మానేసి..విధులు నిర్వ‌ర్తిస్తూ దేశ‌సేవ‌కు అంకిత‌మ‌వుతున్నారు. వారిపై ఏదో విధంగా తమ ప్రేమను ప్రజలు చాటుకుంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వాసులు (UP's Meerut Shower Flowers) పోలీసులపై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.

Indian Railways: లాక్‌డౌన్ తర్వాత రైళ్లు నడవడంపై స్పందించిన రైల్వే శాఖ , ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ కీలక ప్రకటన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము తప్పకుండా వెల్లడిస్తామని ట్విటర్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఈ నెల 12తో ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి రైల్వే సేవల పునరుద్ధరణ, టికెట్ బుకింగ్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement