News

ISRO Chandrayaan 2: చంద్రయాన్-2 నుంచి కొత్త డేటా ఉత్పత్తి, చంద్రుడి ధ్రువ ప్రాంతాలపై మరింత లోతైన అధ్యయనం

Team Latestly

చంద్రుని ధ్రువ ప్రాంతాలపై మరింత లోతుగా అవగాహన పెంచే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ముందడుగు వేసింది. చంద్రయాన్-2 ఉపగ్రహం ద్వారా చంద్ర కక్ష్య నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడి అధునాతన డేటా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో.. బైక్ మీద వెళుతూ కుప్పకూలి పడిపోయిన వాహనదారుడు, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మృతి..

Team Latestly

గురువారం మధ్యాహ్నం ఇండోర్‌లోని దావా బజార్ సమీపంలో ప్రకాష్ కుమాయు కుమారుడు ధర్మేంద్రగా గుర్తించబడిన 32 ఏళ్ల మెడికల్ స్టోర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. లోహా మండి నివాసి అయిన ధర్మేంద్ర తన పనికి వెళుతుండగా అకస్మాత్తుగా బైక్ మీద నుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు, సహచరులు సహాయం కోసం పరుగెత్తారు.

Surat Horror: వీడియో ఇదిగో, వీధి కుక్కల నుండి తప్పించుకోబోయి రోడ్డుపై జారి పడిన 38 ఏళ్ల వ్యక్తి, తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి

Team Latestly

పెరుగుతున్న వీధికుక్కల బెడదను బహిర్గతం చేసే దిగ్భ్రాంతికరమైన సంఘటనలో.. సూరత్‌లోని భండారివాడ్, సయ్యద్‌పురా ప్రాంతంలో ఇబ్రహీం అలియాస్ ఎజాజ్ అహ్మద్ అన్సారీగా గుర్తించబడిన 38 ఏళ్ల వ్యక్తి వీధికుక్కల గుంపు వెంబడించిన కొన్ని రోజుల తర్వాత మరణించాడు. అక్టోబర్ 24న ఇబ్రహీం ఉదయం ప్రార్థనల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.

India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లో భారత్ ఘనమైన రికార్డు కంటిన్యూ..

Team Latestly

బ్రిస్బేన్ గబ్బా మైదానంలో వర్షం మరోసారి ఆటను అడ్డుకున్నా.. భారత జట్టు టీ20 సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం, పిడుగులు అడ్డుగా నిలిచాయి.

Advertisement

Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి, దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

Team Latestly

తెలంగాణలో వర్షాలకు తెరపడగా.. ఇప్పుడు చలి దాడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండగా.. రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Indonesia Blast: జకార్తా పాఠశాల మసీదులో పేలుడు, 54 మంది విద్యార్థులకు గాయాలు, ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్

Team Latestly

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక పాఠశాల సముదాయంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారని స్థానిక మీడియా నివేదించింది.

SC on Stray Dogs: వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద వీధి కుక్కలను తొలగించాలని ఆదేశం

Team Latestly

దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, ప్రయాణికులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు వంటి అన్ని పబ్లిక్ ప్రదేశాల పరిసరాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, వేగంగా వచ్చి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన వాహనదారుడు, దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు

Team Latestly

మధ్యప్రదేశ్‌లో ఒక కలకలం రేపే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఖాండ్వాలో వేగంగా వస్తున్న కారు ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నవంబర్ 6, గురువారం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.

Advertisement

Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి? హర్‌లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ

Team Latestly

మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధ‌వారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.

Harish Rai Dies: ధైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందిన కేజీఎఫ్‌ మూవీ నటుడు, చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు ఖర్చు..చూస్తుండగానే క్యాన్సర్‌ ముదిరి నాలుగో స్టేజీకి..

Team Latestly

కన్నడ నటుడు, కేజీఎఫ్‌ ఫేమ్‌ హరీశ్‌ రాయ్‌ (Harish Rai) క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. కొంతకాలంగా ధైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్‌.. కేజీఎఫ్‌ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

Male Fertility Risks: కాలుష్యం, వేడితో మగాళ్లు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు, మానవాళిని మరొక నిశ్శబ్ద ముప్పు వెంటాడుతోందని హెచ్చరిస్తున్న వైద్యులు

Team Latestly

ప్రపంచం వాతావరణ మార్పులు, కాలుష్యం, వేడిగాలులతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మరొక నిశ్శబ్ద ముప్పు మానవాళిని వెంటాడుతోంది. అదే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది.

RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Team Latestly

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.

Advertisement

Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు

Deoria Boat Capsize: వీడియో ఇదిగో, కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా విషాదం, సరయూ నదిలో పడవ బోల్తా, పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ గంగా ఘాట్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో నిండిన ఓ పడవ సరయూ నదిలో బోల్తా పడింది. సమాచారం ప్రకారం, ఆ పడవలో 12 మంది భక్తులు ఉన్నారు.

Diabetic Kidney Disease: మధుమేహ రోగుల్లో కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గం, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తల నూతన పరిశోధన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అధ్యయనం

Team Latestly

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కలిగే తీవ్రమైన సమస్యల్లో ఒకటి మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure). ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించే మార్గం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. తాజాగా ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధక బృందం చేసిన పరిశోధనలో డయాబెటిస్ ఉన్న వ్యక్తుల రక్తంలో ఉన్న బయోమార్కర్లు ద్వారా భవిష్యత్తులో వారికి మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని తేలింది.

Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి

Team Latestly

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిని తోసేసిన సీఐ, బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వస్తే ఇలా చేస్తారా అని మండిపాటు

Team Latestly

చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

PAN Aadhaar Linking: పాన్ కార్డుదారులకు చివరి హెచ్చరిక.. ఈ తేదీలోగా ఆధార్‌తో లింక్ చేయండి, లేదంటే బ్యాంకింగ్ సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం, ఇతర ఆదాయాలపై వడ్డీ కట్

Team Latestly

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరికను జారి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే నష్టపోతారని హెచ్చరించింది. వెంటనే అప్రమత్తం అవ్వాలని తెలిపింది.

Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్‌ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.

Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్‌ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్‌, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

ఛత్తీస్‌గఢ్‌ (Chattishgarh)లోని బిలాస్‌పూర్‌ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్‌ రైలు.. జయరామ్‌ నగర్‌ స్టేషన్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు

Advertisement
Advertisement