వార్తలు

Intel Layoffs: ఆగని లేఆప్స్, 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఇంటెల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

ఇంటెల్ ఉద్యోగాల కోతలను ప్రారంభించనుందని నివేదించబడింది, ఇది ఐర్లాండ్‌లోని దాని ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది, ఇది తప్పనిసరి తొలగింపులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఐర్లాండ్‌లోని ఇంటెల్‌లోని కొంతమంది ఉద్యోగులు కంపెనీ విభజన కార్యక్రమం కారణంగా తమ ఉద్యోగాలను వదిలివేయవలసి ఉంటుంది.

Fact Check: LIC తన ఇన్సూరెన్స్ ప్లాన్‌లన్నింటినీ ఉపసంహరించుకుంటుదంటూ న్యూస్ వైరల్, క్లారిటీ ఇచ్చిన I&B మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

Delhi Horror: ఢిల్లీలో దారుణం, కూతురు పుట్టిందని పాలు ఇస్తూ పసికందు గొంతు నొక్కి చంపేసిన కసాయి తల్లి, అనంతరం పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి (Woman Strangles Newborn To Death While Feeding) చంపింది.అనంతరం తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

IMD Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో ఈ నెల 5న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన

Hazarath Reddy

విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.

Vijayawada Floods: విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ, బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్, అక్షయపాత్ర సంస్థలు

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు.

Telugu States Floods:  తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.

Andhra Pradesh Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ కిందకు బైక్ దూసుకువెళ్లడంతో మంటలు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

కావలి రూరల్ పరిధిలోని రుద్రకోట సమీపంలో హైవే పై లారీ, బైక్ ఢీ..ఇద్దరికీ గాయాలు. రోడ్డు ప్రమాదం లో కంటైనర్ కిందకు వెళ్లిన ద్విచక్ర వాహనం నుండి మంటలు, బైక్ పూర్తిగా దగ్ధం, కంటైనర్ కు కూడా అంటుకున్న మంటలు.మంటలార్పిన అగ్నిమాపక శాఖ...క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలింపు.

Advertisement

Vijayawada Rains: వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు

Hazarath Reddy

కృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Astrology: గణపతికి ఇష్టమైన మూడు రాశులు ఇవే..గణపతి అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయకుని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. దేవతలందరిలో మొదటిగా వినాయకుని పూజిస్తాము. విజ్ఞాలను తొలగించేది వినాయకుడిగా మనము మొదటి స్థానంలో ఉంచి పూజిస్తాము.

Astrology: శని దేవుడి అనుగ్రహం వల్ల రానున్న 30 రోజుల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు అనుగ్రహం వల్ల కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శని దేవుని అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 6 నుండి కుజ గ్రహంలో మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహం అత్యంత శక్తివంతమైనది. సెప్టెంబర్ 6న కుజ గ్రహం ఆర్ద్ర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా..అయితే మీకు త్వరలోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

sajaya

మెగ్నీషియన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెగ్నీషియం లోపం డయాబెటిస్ ని కూడా కలగజేస్తుంది.

Paralympic Games 2024:పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియా

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 27 ఏళ్ల అతను తన మొదటి ప్రయత్నంలో వచ్చిన 42.22 మీటర్ల త్రోను తీసి పోడియం ఫినిషింగ్ సాధించాడు. కథునియా కోసం ఇది సీజన్‌లో అత్యుత్తమ ప్రయత్నం

Health Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఆహారాలను తీసుకుంటే..మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

sajaya

ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ సమయం చాలా ముఖ్యమైనది. వీరు చేసే ప్రతి పని కూడా కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

Jammu and Kashmir Landslide: వీడియో ఇదిగో, మాతా వైష్ణో దేవి భవన్ మార్గంలో విరిగిపడిన కొండ చరియలు, పలువురు భక్తులు చిక్కుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్: శ్రీ మాతా వైష్ణో దేవి భవన్ మార్గంలో పంచి హెలిప్యాడ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో భక్తులు చిక్కుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు సహాయ మరియు సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా..దీనికి కారణాలు చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న సమస్య కడుపు ఉబ్బరం. మన జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు దీని ద్వారా శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం, భారీగా పెరుగుతున్న వరద ఉధృతి

Hazarath Reddy

తెలంగాణలో వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.

Telugu States Floods: మా ఆలోచనలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే, భారీ వరదల నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement