రాజకీయాలు

Delhi Assembly Election 2025 Date: ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగుస్తుండటంతో.. మంగళవారం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

BJP VS Congress: వీడియోలు ఇవిగో, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు

Hazarath Reddy

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ (BJP) కార్యాలయం వద్ద హైటెన్సన్ నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు

Formula-E Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది

Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Ambati Rambabu: వీడియో ఇదిగో, అడ్వకేట్‌గా మారిన అంబటి రాంబాబు, ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మాజీ మంత్రి

Hazarath Reddy

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎ‍ల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

BPSC Exam Row: బీపీఎస్‌సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్, ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన జన్ సురాజ్ చీఫ్

Hazarath Reddy

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

Telangana New Voter List: తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Hazarath Reddy

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది పురుష ఓటర్లు... 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Game Changer Event Tragedy: గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

World Telugu Federation Programme: వీడియో ఇదిగో, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రస్తావన

Hazarath Reddy

తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది

Advertisement

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

KTR Slams Congress: రేవంత్ రెడ్డి రాబందు...రాహుల్‌ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ముందా?, రైతు భరోసా ఎందుకు ఇవ్వరో కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చిన కేటీఆర్

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, దగా, నయవంచన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..

Advertisement

Vangalapudi Anitha: ఖైదీల రక్షణే ముఖ్యం...జైలులో సెల్‌ఫోన్స్‌, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి వంగలపూడి అనిత, గంజాయి సరఫరాపై ఆగ్రహం

Arun Charagonda

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

Arun Charagonda

ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Hazarath Reddy

ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

Arun Charagonda

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Advertisement
Advertisement