Politics

Modi Goa Visit: గోవాపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ, రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అన్ని రంగాల్లో గోవా ముందంజలోనే ఉంది. 100శాతం తొలిడోసు వ్యాక్సినేషన్ పూర్తయినందుకు అభినందనలు

Naresh. VNS

ప్రధాని మోదీ(Narendra Modi) తాజాగా గోవా(Goa)లో పర్యటించారు. అక్కడ రూ. 600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే(Goa liberation Day) ఉత్స‌వాల్లో పాల్గొన్నారు ప్ర‌ధాని మోదీ(PM Modi). కొన్ని శ‌తాబ్దాల క్రితం దేశంలోని ప్ర‌ధాన ప్రాంతాల‌న్నీ మొగ‌లుల పాల‌న‌లో ఉండ‌గా, గోవా మాత్రం పోర్చుగ‌ల్ పాల‌న‌లో ఉండేద‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు

Women Marriage Age: మహిళల వివాహ వయస్సు పెంపుపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల వివాదాస్పద వ్యాఖ్యలు, వివాహం ఆలస్యమైతే పిల్లలు పుట్టరు, అమ్మాయి రజస్వల అయితే చాలు, పెళ్లి చేసేయాలి..

Krishna

అమ్మాయికి రజస్వల అయ్యి, సంతానోత్పత్తి వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనేది తన నమ్మకం అని అన్నారు. అమ్మాయికి 16 ఏళ్లు నిండితే 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. 18 ఏళ్లకే ఓటు వేయగా లేనిది, పెళ్లి ఎందుకు చేసుకోకూడదు?” అని తుఫైల్ హసన్ ప్రశ్నించారు.

Metro Man Sreedharan: రాజకీయాలకు మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ గుడ్‌బై, తత్వం బోధపడింది, గుణపాఠం నేర్చుకున్నానన్న శ్రీధరన్‌, కేరళలో బీజేపీకి భారీ షాక్‌

Naresh. VNS

బీజేపీ(BJP)లో ఉన్న ఆయన....రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు త‌న‌కు త‌త్వం బోధ‌పడింద‌ని, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి… గుణ‌పాఠం నేర్చుకున్నాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌ల‌ప్పురం ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించారు శ్రీధరన్(Sreedharan). తాను నేతాగిరీ ఎన్న‌డూ చేయ‌లేద‌ని, రాజ‌కీయ నేత‌గా ఎన్న‌డూ లేన‌న్నారు

CM KCR Meets MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ, యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్లుగా వార్తలు

Hazarath Reddy

Advertisement

Punjab Congress Poll Panel: పంతం నెగ్గించుకున్న సిద్ధూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల టీమ్‌ ప్రకటించిన కాంగ్రెస్, సిద్ధూ నేతృత్వంలోనే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, సీఎం చన్నీకి నామమాత్రపు పదవి

Naresh. VNS

సిద్ధూ సారథ్యంలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్(Sidhu to Lead elections) నిర్ణయించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ క‌మిటీకి సిద్దూయే చైర్మ‌న్‌. కాంగ్రెస్ సంస్థాగ‌త వ్య‌వ‌హార‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్(KC Venugoopal) పేరుతో ఈ లేఖ విడుద‌లైంది.

CDS Bipin Rawat Chopper Crash: సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన వీడియో రికార్డు చేసిన మొబైల్ ఫోన్ స్వాధీనం, దుర్ఘటన దర్యాప్తు వేగవంతం

Krishna

తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిన ఘటనను వీడియో తీసిన వ్యక్తి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో 12 మంది చనిపోయారు.

PM Modi is Inaugurated Kashi Vishwanath Corridor: ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ రేపు జాతికి అంకితం, వారణాసి దశ మార్చిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు, 7 లక్షల ఇళ్లకు లడ్డూల పంపిణీ...

Krishna

ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను రేపు (డిసెంబర్ 13) జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ. 600 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. దీంతో రేపు చేపట్టనున్న వారణాసి పర్యటన ప్రధాని నరేంద్ర మోడీకి చాలా ప్రత్యేకత సంతరించుకుంది.

PM Modi Twitter Hack: ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్, వివరణ ఇచ్చిన ట్విట్టర్, దేశంలో కలకలం

Krishna

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సైతం ధృవీకరించింది. అయితే కొంతసేపటికే ట్విటర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించినట్లు ట్వీట్ చేసింది.

Advertisement

Malayalam Director Ali Akbar Quits Islam: ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి సంచలన నిర్ణయం తీసుకున్న మళయాల దర్శకుడు అలీ అక్బర్, బిపిన్ రావత్ మృతిపై వెల్లువెత్తిన సోషల్ ట్రోలింగ్ కు నిరసనగా నిర్ణయం..

Krishna

ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ CDS జనరల్ బిపిన్ రావత్ విషాద మరణాన్ని వేడుకగా జరుపుకున్న వారికి నిరసనగా ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అలీ అక్బర్ ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు, ఇకపై తనకు , తన కుటుంబానికి ఇకపై మతం లేదని పేర్కొన్నాడు.

Somu Veerraju: నాకు సీఎం అవ్వాలని లేదు, 2024 తర్వాత రాజకీయాల్లో ఉండను, ఏపీలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు

Hazarath Reddy

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు (Somu Veerraju) రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్నారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అన్నారు.

Sasikala Met Rajinikanth: రజనీకాంత్, ఆయన భార్య లతతో భేటీ అయిన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ

Hazarath Reddy

Former AIADMK leader VK Sasikala, Rajinikanth, Latha, Sasikala Met Rajinikanthఅన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ చెన్నైలోని నటుడు రజనీకాంత్, ఆయన భార్య లతతో సమావేశమయ్యారు. రజినీకాంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు.

Teenmaar Mallanna joins BJP: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్

Hazarath Reddy

తీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Parliament Session 2021: మోదీది ఫాసిస్ట్ ప్ర‌భుత్వం, మోదీ ప్ర‌భుత్వంపై ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, బీజేపీపై మండిపాటు

Hazarath Reddy

ధాన్యం సేక‌ర‌ణ‌, విప‌క్ష ఎంపీల స‌స్పెన్ష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా టీఆర్ఎస్ పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను (Parliament Winter Session) బ‌హిష్క‌రించారు. శీతాకాల స‌మావేశాలు పూర్త‌య్యేవ‌ర‌కు పార్ల‌మెంట్ బ‌హిష్క‌రిస్తున్నామ‌ని (TRS MPs to boycott Parliament's Winter Session) వారు ప్ర‌క‌టించారు.

Jammu and Kashmir: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల తరహాలో ఉద్యమిస్తేనే, కశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరించుకోగలం, ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..

Krishna

ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలు రైతులలాగే పోరాడాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగింది.

Prashant Kishor: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే, విప‌క్ష నేత‌ ఎంపిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని ట్వీట్, మా పార్టీ సపోర్ట్ లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని తెలిపిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు

Hazarath Reddy

దేశంలో అసలు యూపీఏనే లేదు’ అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజీకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోస్తూ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee on UPA: ఇంకెక్కడి యూపీఏ, అదంతా గడిచిన చరిత్ర, యూపీఏపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు, శరద్‌ పవార్‌తో దీదీ కీలక భేటీ

Naresh. VNS

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(UPA) కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee). అసలు యూపీఏ ఎక్కడుంది? యూపీఏ అనేది ఇక నుంచి ఒక చరిత్ర లాంటిది, అన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar)తో భేటీ అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Parliament Winter Session: ఈ సమావేశాలు ముగిసేవరకు 12 మంది రాజ్యసభ ఎంపీలు సస్పెండ్, గత సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసిన స్పీకర్

Hazarath Reddy

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలు రాజ్యసభలో సస్పెండ్ కు గురయ్యారు. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

AP Minister Kodali Nani: శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు, జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టిన వారు ఏమయ్యారో చూశారుగా, చంద్రబాబు, పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

తన రాజకీయం కోసం చంద్రబాబే (Chandrababu naidu)భార్యను అల్లరి చేసుకుంటూ.. తనను క్షమాపణ చెప్పమనడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ తాము భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

Kamal Haasan Health Update: కరోనా నుంచి కోలుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్, త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి వస్తారంటూ శృతి హాస‌న్ ట్వీట్, కమల్‌ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రజనీకాంత్

Hazarath Reddy

నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది.

Meghalaya Congress: మేఘాలయాలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన తృణమూల్, అధిష్టానంపై తిరుగుబాటు చేసిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Naresh. VNS

మేఘాలయా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం సహా రాత్రికి రాత్రే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన మద్దతుదారులైన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారు.

Advertisement
Advertisement