రాజకీయాలు
Former MP Ramkishun: పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కిన మాజీ ఎమ్మెల్యే రామ్‌కిషన్‌ యాదవ్‌, జడ్పీ సభ్యులంతా ఐక్యతతో పార్టీ అభ్యర్థి తేజ్‌ నారాయణ్‌ యాదవ్‌‌ను జడ్పీ ఛైర్‌పర్సన్‌ గెలిపించాలని కోరిన సమాజ్ వాదీ పార్టీ నేత
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో శనివారం 53 స్థానాల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన జడ్పీ సభ్యులంతా ఐక్యతతో ఉండాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, చందౌలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రామ్‌కిషన్‌ యాదవ్‌, పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కారు.
Andhra Pradesh: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌‌ను అందజేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.
FIR Lodged Against Sasikala: శశికళపై మరో కేసు నమోదు, బెదింరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసిన అన్నాడీఎంకే పార్టీ నేత సీ వీ ష‌ణ్ముగం, ఐపీసీలోని 506(1), 507, 109 సెక్ష‌న్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్ష‌న్ ప్ర‌కారం శశిక‌ళ‌పై కేసు న‌మోదు
Hazarath Reddyతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు (FIR Lodged Against Sasikala) నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..
Ban on International Flights: అంతర్జాతీయ విమానాల‌పై జూలై 31వ తేదీ వరకు నిషేధం పొడిగింపు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు ఆంక్షలు వర్తించని స్పష్టం చేసిన డీజీసీఏ
Hazarath Reddyఅంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
High Speed Track: ఆసియాలోనే అతి పొడవైన, ప్రపంచంలో ఐదవ పొడవైన హై స్పీడ్ ట్రాక్‌ భారత్‌‌లో ప్రారంభం, ఆటోమొబైల్ హబ్‌గా ఇండియా అవతరిస్తోందన్న కేంద్ర మంత్రి
Team Latestlyఅన్ని రకాల వాహనాల గరిష్ట వేగ సామర్థ్య పరీక్షలకు ఏక కేంద్ర పరిష్కారం ఈ ట్రాక్‌. ప్రపంచ పొడవైన ట్రాకుల్లో ఒకటి. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు విస్తృత శ్రేణి వాహనాల అవసరాలను ఇది తీర్చగలదు. స్టీరింగ్ నియంత్రణతో, వంపుల వద్ద కూడా గరిష్టంగా 375 కిలోమీటర్ల వేగాన్ని....
PV Narasimha Rao Jayanti: నవభారత నిర్మాత, తెలుగు జాతి కీర్తి పతాక- పీవీ నరసింహారావు జయంతి నేడు. నెక్సెస్ రోడ్డులో పీవీ శతజయంతి వేడుకలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
Vikas Mandaనరసింహారావు సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయనకు ఘనమైన నివాళి ఇవ్వాలని నిర్ణయించారు...
Revanth Reddy as New TPCC Chief: కాంగ్రెస్‌లో రాజీనామా కలకలం, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా, తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలిపిన పీసీసీ నూతన చీఫ్
Hazarath Reddyతెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy as New TPCC Chief) అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తన చురుకుదనం, పోరాటనైజం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నాడు.
AP Parishad Election Row: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఆదేశాలకు స్టే విధించిన డివిజన్ బెంచ్, ఎన్నికలు రద్దు చేయాలనే ఉత్తర్వులు నిలిపివేత, తదుపరి విచారణ జూలై 27కి వాయిదా
Team Latestlyజెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఈ ఎన్నికలను రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్ట్ డివిజన్ బెంచ్ నిలిపివేసింది....
Mission 2024: మిషన్‌ 2024 లక్ష్యంగా ఏకం కాబోతున్న విపక్షాలు, ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్ ఆధ్వర్యంలో నేడు 15 పార్టీల నేతల సమావేశం, ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపిన రాష్ట్రమంచ్‌ వ్యవస్థాపకులు యశ్వంత్‌సిన్హా, కీలక పాత్ర పోషించనున్న ప్రశాంత్ కిషోర్
Hazarath Reddyఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు మిషన్‌ 2024 (Mission 2024) ద్వారా ఏకమయ్యే వ్యూహాంలో ఉన్నాయి. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పావులు కదుపుతున్నారు.
Indian IT Rules 2021: సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దుర్వినియోగం జరుగుతోంది, సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన ఐటీ చట్టాల రూపకల్పన.. ఐక్యరాజ్య సమితికి స్పష్టం చేసిన భారత్
Team Latestlyభారత ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళికి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగం వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ స్పందించింది....
Vitapu Balasubrahmanyam: ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఎం జగన్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, కొత్త సభ్యులతోమండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్న విఠపు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం (Vitapu Balasubrahmanyam as protem speaker) ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు.
Etela Rajender Joins BJP: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్న కేంద్ర మంత్రి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్, కండువా కప్పి ఆహ్వానించిన ధర్మేంద్ర ప్రధాన్, ఈటెలతో పాటు కాషాయపు కండువా కప్పుకున్న పలువురు నేతలు
Hazarath Reddyఅనుకున్న ముహూర్తానికే తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులు..సన్నిహితులతో కలిసి కాషాయ కండువా (Etela Rajender Joins BJP) కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు.
Farmers’ Protest: జూన్‌ 26న రాజ్‌భవన్ల ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు, ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా గవర్నర్ల నివాసాల ఎదుట నల్లజెండాలతో నిరసన
Hazarath Reddyనూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి (Farmers Protest) ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ‘రాజ్‌భవన్ల ముట్టడి’కి (Agitating Farmers To Protest at Raj Bhavans) రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ టూర్, ఏపికి తిరుగు ప్రయాణం; రెండు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా జరిగిన సమావేశాలు మరియు చర్చల విశేషాలు ఇలా ఉన్నాయి
Team Latestlyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఇప్పుడు విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, ఈ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా సహా మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారు....
Anup Chandra Pandey: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌
Hazarath Reddyయూపీ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అనూప్‌ చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది.
Etela Rajender Road Show: ప్రగతి భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ చదివే వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు, హుజూరాబాద్ నుంచే తెలంగాణ ఆత్మగౌరవ బావుటా జెండా ఎగరవేస్తాం, ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన ఈటెల రాజేందర్
Hazarath Reddyతెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్రబిందువని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ (kamalapur) మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో (Etela Rajender Road Show) పాల్గొన్నారు.
Telangana: మరోసారి తెరపైకి పీవీ నరసింహారావు జిల్లా.. హుజూరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు? నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం
Vikas Mandaఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ మినహాయింపులు ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది....
YSR Telangana Party: వైఎస్సార్‌ జయంతి రోజున షర్మిలారెడ్డి కొత్త పార్టీ ప్రకటన, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ పూర్తి, జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నట్లు తెలిపిన షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రాజగోపాల్
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ రాబోతోంది. వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిలారెడ్డి తెలంగాణలో కొత్త పార్టీని (YS Sharmila New party) ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీని సైతం నేడు ఒక ప్రకటన ద్వారా షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్ వెల్లడించారు.