రాజకీయాలు
Ram Vilas Paswan No More: 'నేను ఒక మంచి మిత్రుడిని, విలువైన సహోద్యోగిని కోల్పోయాను' కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Team Latestlyరామ్ విలాస్ పాస్వాన్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని, ఆయన మృతికి గౌరవ సూచకంగా శుక్రవారం రోజున దేశ రాజధాని దిల్లీ సహా, అన్ని రాష్ట్ర రాజధానులలో జాతీయ జెండాను ఎగురవేస్తామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు....
IAF Day 2020: అట్టహాసంగా భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవ వేడుకలు, హైలైట్‌గా నిలిచిన రాఫెల్ యుద్ధ విమానాల విన్యాసాలు, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు
Team Latestlyనింగిని మరియు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను నిరంతరం కాపాడే భారత వాయుసేనకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు....
Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు అధికార పార్టీలో ముగిసిన రాజకీయ సంక్షోభం, అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి కె పళనిస్వామి, 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీ
Hazarath Reddyతమిళనాడులోని అధికారిపార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి (Edappadi K. Palaniswami) మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం (Deputy Chief Minister Panneer Selvam) ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అన్నాడీఎంకే చీఫ్‌ను నిర్ణయించనుంది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections 2021) జరగనున్నాయి.
KCR Warns AP Govt: 'ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలను ఆపకపోతే...' ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ వార్నింగ్, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు కాదు, క్రమశిక్షణ పాటించాలని సూచన
Team Latestlyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణా నదిపై అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....
Dubbaka Bypoll: దుబ్బాక సమరం, ఎన్నికల నియామావళిని విడుదల చేసిన ఎన్నికల సంఘం, దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచే పార్టీల ప్రధాన అభ్యర్థులపై ఓ లుక్కేయండి
Hazarath Reddyకరోనావైరస్ నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక (Telangana Dubbaka bypoll) సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల నియమావళిని (new electoral code) విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య సూచించారు.
CM YS Jagan Meets PM Modi: ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం సమావేశం, 17 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపిన అధికార వర్గాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం
Hazarath Reddyరాష్ట్ర అభివృద్ధి ఎజెండాలో (state development agenda) భాగంగా న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం (CM YS Jagan Meets PM Modi) ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు(The meeting lasted for about 40 minutes) ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
CM YS Jagan to Meet PM Modi: మరికొద్ది సేపట్లో ప్రధానితో వైయస్ జగన్ భేటీ, రాష్ట్రంలో జరిగిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, తదనంతరం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం
Hazarath Reddyదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు న్యూ డిల్లీలో సమావేశం (CM YS Jagan to Meet PM Modi కానున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటలకు ఆయన (YS Jagan Mohan Reddy) ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఢిల్లీ వచ్చారు.
CBI Raids D.K. Shivakumar's Premises: డి.కె. శివ‌కుమార్‌ నివాసంపై సీబీఐ ఆకస్మిక దాడి, ఏక కాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు, ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు
Hazarath Reddyకర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ నివాసంపై సీబీఐ అధికారులు (CBI Raids D.K. Shivakumar's Premises) ఆకస్మిక దాడులు చేశారు. డీకే శివకుమార్ (D. K. Shivakumar) పై ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ (CBI) గతంలో కేసులు నమోదు చేసిన విషయం విదితమే. డీకే శివకుమార్ తోపాటు అతని సోదరుడు డీకే సురేష్ కు చెందిన కర్ణాటక, ముంబై ఇళ్లలోనూ (DK Shivakumar's Premises) సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.
Kheti Bachao Yatra: మీ చట్టాలతో రైతులకు అన్యాయం చేస్తారా? ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, ఖేతీ బచావో యాత్ర పేరుతో 3 రోజుల పాటు పంజాబ్‌లో ర్యాలీలు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyగత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై విపక్షాలు ప్రధాని మోదీ సర్కారుపై విమర్శానాస్త్రాలు సంధించాయి. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీపై (Rahul Gandhi Lashes Out at Narendra Modi Government) విరుచుకుపడ్డారు. కేంద్ర ప్ర‌భుత్వానికి అంత ఆత్రంగా వ్య‌వ‌సాయ చ‌ట్టాలు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ప్ర‌శ్నించారు.
Bihar Assembly Elections 2020: బీహార్‌లో పూర్తయిన సీట్ల పంపకం, కూటమి నేతగా తేజస్వీ యాదవ్‌ ఏకగ్రీవ ఎన్నిక, బీహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో పోలింగ్‌
Hazarath Reddyబీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ను (Tejashwi Yadav) కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు ( Congress) 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్‌)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు.
Hathras Case: దేశ వ్యాప్త నిరసనలతో దిగొచ్చిన యూపీ సర్కారు, సీబీఐకి హత్రాస్ దారుణ హత్య కేసు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని తెలిపిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyహత్రాస్‌ జిల్లాలో కామాంధుల చేతుల్లో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు (CBI Probe Ordered) ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP Chief Minister Yogi Adityanath) ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో (Hathras Gang Rape) నిర్లక్ష్యంగా దర్యాప్తు చేసినందుకు ఎస్పీ హత్రాస్ విక్రాంత్ వీర్, సీఐ రామ్ షాబాద్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బాలిక హత్యోదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
Water Row: రైతుల కోసం దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం, నీటి వాటాలపై ఎలాంటి రాజీ లేదు, తెలంగాణ ఉద్యమమే నీటితో ముడిపడి ఉంది; అధికారులతో సమావేశంలో టీఎస్ సీఎం కేసీఆర్
Team Latestlyతెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై....
Dubbaka By Election Date: నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నిక, నవంబర్ 10న పోలింగ్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఎన్నిక
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల (Dubbaka By Election Date) చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేసి నవంబర్‌ 3న (dubbaka bypoll election november 3) పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.
Bye-Elections 2020: మోగిన ఉప ఎన్నికల నగారా, 11 రాష్ట్రాల్లో 54 స్థానాలకు నవంబర్ 3 న ఎన్నికలు, నవంబర్ 10న ఓట్ల లెక్కింపు, కరోనా నేపథ్యంలో 4 రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం
Hazarath Reddy11 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు (By-Elections 2020) నవంబర్ 3 న జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా, బీహార్‌లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, మణిపూర్ నుండి రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7 న ఎన్నికలు (Bye-Elections 2020) నిర్వహిస్తామని ఇసిఐ ధృవీకరించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, జార్ఖండ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
TDP New Parliament Observers: చంద్రబాబు నయా వ్యూహాం, తెలుగుదేశం పార్టీకి కొత్త టీం, ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
Hazarath Reddyఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఏపీ సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష హోదా సైతం గల్లంతయ్యే పరిస్థితుల్లో టీడీపీ ఉండటంతో అధినేత చంద్రబాబు (N. Chandrababu Naidu) సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు కొత్తగా టీం విస్తరణ (13 parliament observers) చేశారు. టీడీపీ పార్టీని ప్రక్షాళన చేస్తూ యువకులకి అవకాశాలను కల్పిస్తూ ఏపీలో పార్లమెంట్‌ స్థానాల వారీగా పార్టీ అధ్యక్షులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (TDP chief Chandrababu Naidu) నియమించారు.
Jaswant Singh Dies At 82: బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, పలువురు బీజేపీ నేతలు, 2014లో బీజేపీ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జశ్వంత్ సింగ్‌
Hazarath Reddyకేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత జశ్వంత్‌ సింగ్‌ (Jaswant Singh Dies) కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా జశ్వంత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. దేశానికి ఎంతో కీలకమైన ఆర్ధికశాఖకు సైతం సీనియర్ నేత తనదైన మార్కు సేవలందించారు. జశ్వంత్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్‌ సింగ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.
Bihar Election 2020 Dates: అక్టోబర్‌ 28న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌, నవంబర్‌ 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyబీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్‌ 28వ తేదీ మొదలుకొని మూడు దశల్లో పోలింగ్‌ (Bihar Assembly Elections 2020 Dates And Schedule) జరపనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ( Election Commission of India) శుక్రవారం ప్రకటించింది. 243 స్థానాలున్న శాసనసభకు మూడుదశల్లో అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 10వ తేదీన ఉంటుందని వెల్లడించింది.
Suresh Angadi: కరోనాతో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్; జిల్లా అధ్యక్షుడి నుంచి కేంద్రమంత్రి స్థాయి వరకు ఓటమెరుగని ప్రస్థానం కలిగిన జన నేత
Team Latestlyసురేశ్ అంగడి కర్ణాటకలో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఓటమెరుగని నేత. బెల్గాం స్థానం నుంచి ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ఉత్తర కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ఆయనకు అదనపు బలం...
Xiaomi’s Travelling Store: రోడ్డు మీదకు షియోమి, ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ పేరుతో నేరుగా గ్రామాల్లోకి షియోమి వాహనాలు, అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులోకి..
Hazarath Reddyచైనా..భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువయిన నేపథ్యంలో షియోమి కొత్త వ్యూహానికి తెరలేపింది. చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ ‌ విక్రయాలను విస్తరించడంలో భాగంగా ఎంఐస్టోర్ ఆన్ వీల్స్(MiStore-on-wheels) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షియోమి ట్రావెలింగ్ స్టోర్‌ (Xiaomi’s Travelling Store) ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుంది.
Opposition to Boycott Rajya Sabha: ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలి, అప్పటివరకు సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని తెలిపిన విపక్షాలు, ఎంపీల తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేపట్టిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్
Hazarath Reddyరాజ్యసభలో వ్యవసాయ బిల్లుల దుమారం కొనసాగుతూనే ఉంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు చట్టంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో 8 మంది సభ్యుల వేటు కూడా పడింది. అయితే ఈ సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్‌ (Opposition to Boycott Rajya Sabha) చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ (Ghulam Nabi Azad) మంగళవారం పేర్కొన్నారు.