రాజకీయాలు
Prashant Kishor Jan Suraaj Party: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పేరు ఇదే, జన్సురాజ్తో వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ రాజకీయ వ్యూహకర్త
Hazarath Reddyమాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్రలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బిహార్లో ఆయన ప్రారంభించిన జన్సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది
AP Volunteers: ఏపీ సీఎం చంద్రబాబు గుడ్న్యూస్, త్వరలో వాలంటీర్లకు శుభవార్త చెప్పనున్న టీడీపీ సర్కార్?
Arun Charagondaప్రజల వద్దకే సంక్షేమం ,ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంలో 2019లో వైసీపీ అధినేత, నాటి ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్ సిస్టమ్. దాదాపు ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఒకేసారి వాలంటీర్లుగా నియమించి ప్రతి 50 కుటుంంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు అద్భుత స్పందన వచ్చింది.
Janasena: ఏపీలో వైసీపీ - టీడీపీలకు జనసేన పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయమా?, వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ పవనేనా?, పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ఏం చెబుతోంది!
Arun Charagondaఏపీలో వైసీపీ - టీడీపీ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోప్ వచ్చింది. వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగాను పట్టు సాధించారు పవన్. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి...పవన్పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
KCR New Strategy: సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్? త్వరలో ఎన్నికలు రావడం ఖాయం? మళ్లీ అధికారం మనదేనని సంకేతాలు?
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్ది ప్రత్యేక శైలీ. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.
NITI Aayog meeting: నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్య
Arun Charagondaప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న 9వ నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వాస్తవానికి ఇండియా కూటమి నుండి ఏకైక సీఎంగా హాజరయ్యారు మమతా. అయితే మమతా మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Slams BJP: హైదరాబాద్ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్
Arun Charagondaగత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది.. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం నుంచి పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదు, శత్రుదేశానికి ధీటైన బదులిస్తామని కార్గిల్ నుంచి ప్రధాని మోదీ హెచ్చరిక
Hazarath Reddyకార్గిల్ 25వ విజయ దివస్ (Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు
Kargil Vijay Diwas 2024: ఆర్మీ అంటే 140 కోట్ల భారతీయుల నమ్మకం, అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడిన భారత ప్రధాని
Hazarath Reddyఅగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రధాని మండిపడ్డారు.
CM Chandrababu on Andhra Pradesh Debt: ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల (White paper on State Debt) చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు
YS Jagan on Andhra Pradesh Debt: ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్, చంద్రబాబు రూ .14 లక్షల కోట్ల శ్వేతపత్రంపై సెటైర్లు, ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతంటే..
Hazarath Reddy2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా ఆర్థిక నిర్వహణ లోపాలు జరిగాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యిందని, ఇది నేటికి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.
Harishrao: రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
Arun Charagondaతెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుండగా ,ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది.
Andhra Pradesh: నార్కో టెర్రరిస్ట్ పాబ్లో ఎస్కోబార్ తో జగన్ను పోల్చిన చంద్రబాబు, టాటా, రిలయన్స్, అదానిల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే జగన్ ఆరాటం అంటూ విమర్శలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు.
Telangana Budget 2024: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది
YS Jagan Slams Chandrababu Govt: నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు, ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyకావాలంటే నన్ను టార్గెట్ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి.
Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు దక్కని ఊరట, సీబీఐ కేసులో రెండు వారాల పాటు కస్టడీ పొడగింపు, మరిన్ని రోజులు జైల్లోనే ఢిల్లీ సీఎం
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కడం లేదు. ఇవాళ్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Assembly Session: దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ఏపీలో జరిగింది, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభలో పలు అంశాలపై సమావేశాల్లో (Andhra Pradesh Assembly Session) చర్చలు చేపట్టారు. వైసీపీ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందంటూ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో బుధవారం విడుదల చేశారు.
Bihar Assembly: సహనం కొల్పోయిన సీఎం నితీష్ కుమార్, మహిళా ఎమ్మెల్యేపై సీరియస్, నువ్వు స్త్రీవి, నీకు ఏమీ తెలియదు?అంటూ మండిపాటు
Arun Charagondaఎప్పుడూ కూల్గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్తారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. అందుకే అటూ బీజేపీతో జత కట్టినా, ఇటు ఆర్జేడీతో జత కట్టినా ఆయన స్టైలే వేరు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. తాను ఏం చేయదలుచుకున్నాడో అది చేసేస్తారు. కానీ అలాంటి నితీష్ తొలిసారి సహనం కొల్పోయారు.
Harish Rao VS Revanth Reddy: వీడియో ఇదిగో, అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో విరుచుకుపడిన హరీష్ రావు
Hazarath Reddyరాజీనామా చేయమంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పారి పోయినటువంటి చరిత్ర నీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది నువ్వు.. సోనియా గాంధీని అప్పుడు దెయ్యం ఇప్పుడు దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీని అప్పుడు పప్పు అని ఈనాడు పీఎం కాండిడేట్ అంటున్నావ్ అని హరీష్ రావు మండిపడ్డారు.
Kilari Rosaiah Resigns YSRCP: గుంటూరు జిల్లాలో వైసీపీని వీడిన మరో నేత, పార్టీకి రాజీనామా చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య
Hazarath Reddyగుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా అదే బాటలో నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
YSRCP Protest in Delhi: ఏపీ దాడులపై కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు, వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతామని వెల్లడి
Hazarath Reddyసంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు.