Travel

Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం, సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని తెలిపిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

తిరుమలలో సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ధరల పెంపుపై కేవలం చర్చ (TTD had no plans to increase service prices) మాత్రమే జరిగిందని ఆయన ( Chairman YV Subbareddy) అన్నారు.

Tirumala: వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, సామాన్య భక్తులకే కేటాయించాలని నిర్ణయం

Hazarath Reddy

వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం​ తీసుకుంది. శని, ఆదివారాల్లో (Saturday and sunday) వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు (TTD cancels VIP break darshan system) చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Bhadrachalam: భద్రాచలం రాములోరి దర్శనం ఇకపై చాలా ఖరీదు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఈవో శివాజీ

Hazarath Reddy

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్‌ ధరలను (vSri Rama Navami celebrations Tickets Price Hike ) పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు.

TTD: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల

Hazarath Reddy

ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనా‌లకు సంబం‌ధించిన టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం (TTD) నేడు విడు‌దల చేయ‌ను‌న్నట్టు తెలి‌పింది. బుధ‌వారం ఉదయం 9 గంట‌లకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

Advertisement

Uttarakhand: చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం, గతంలో దేవ‌స్థానం బోర్డు కింద 51 ఆల‌యాల నిర్వ‌హ‌ణ

Hazarath Reddy

ఉత్త‌రాఖండ్ చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును పుస్క‌ర్ సింగ్ ధామి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌.. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం పుస్క‌ర్ సింగ్ ధామి వెల్ల‌డించారు. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు.

Tirumala Rains: శ్రీవారి చెంత నుంచి పరుగులు పెట్టిన గంగమ్మ, అలిపిరి మెట్ల మీద నుంచి కిందకు భారీగా దూసుకువస్తున్న వరద, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

శ్రీవారి చెంత నుంచి కిందకు గంగమ్మ తల్లి ఉప్పొంగి ప్రవహించింది. అలిపిరి మెట్ల మీద నుంచి వరద నీరు కిందకు భారీగా పోటెత్తింది. శ్రీవారిని చేరుకునేందుకు ప్రయాణికులు వెళ్లే కాలిబాట పూర్తిగా వరదనీటితో జాలువారింది. భారీ వర్షం ధాటికి అలిపిరి గేట్లు మూసివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharmapatham: దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, ధర్మ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పథకం ఉద్దేశం

Hazarath Reddy

TTD Sarva Darshan Tokens: టీటీడీ సర్వదర్శనానికి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను (TTD Sarva Darshan Tokens) సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల (TTD Sarvadarshan Tickets To Be Available) చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Advertisement

Char Dham Yatra 2021: నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర, అనుమతి ఇచ్చిన నైనిటాల్ హైకోర్టు, వ్యాక్సిన్ తీసుకున్నవారికి, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మాత్రమే అనుమతి

Hazarath Reddy

చార్‌ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు (Char Dham Yatra 2021) నైనిటాల్ హైకోర్టు అనుమతించింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారిని మాత్రమే యాత్రకు అనుమతించాలని షరతు విధించింది.

Tirumala Update: ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను (Srivari Brahmotsavam) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) ప్రకటించారు.

Battery Cars in Tirumala: తిరుమలలో ఇకపై బ్యాటరీ కార్లు, విద్యుత్‌ బస్సుల కోసం త్వరలోనే టెండర్లను పిలుస్తామని తెలిపిన దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి

Hazarath Reddy

తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో 35 బ్యాటరీ వాహనాలను ప్రారంభించిన సుబ్బారెడ్డి.. అదే వాహనంలో తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించారు.

Tirumala: తిరుమలపై అసత్య ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులు, 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ నెల 19న వాచీల ఈ–వేలం

Hazarath Reddy

తిరుమల శ్రీవారికి చెందిన 1,500 కిలోల బంగారు నగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు (18 Social media users booked) చేశారు.

Advertisement

Domestic Airfares Hike: విమాన ప్రయాణం ఇకపై మరింత ఖరీదు, దేశీయ విమానయాన ఛార్జీలను పెంచిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, వివిధ మార్గాల్లో సర్వీసుల సంఖ్య కూడా పెంపు

Team Latestly

డొమెస్టిక్ విమానయాన కనిష్ఠ మరియు గరిష్ఠ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సెకండ్ వేవ్ కోవిడ్19 తర్వాత సడలింపులు లభించడంతో ప్రయాణాలు పెరిగాయి. ఇంతకాలంగా లాక్డౌన్ కారణంగా ప్రయాణాలు లేకపోవడం, అలాగే ఇంధన ధరలు కూడా పెరుగుతుండటంతో...

Y. V. Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా మరోసారి వై.వి.సుబ్బారెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, టీటీడీ బోర్డు సభ్యుల నియామకం త్వరలో జరిగే అవకాశం

Hazarath Reddy

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే.

TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి

Hazarath Reddy

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి.

Ramappa Temple: కాకతీయ శిల్పా కళావైభవం.. రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన యునెస్కో, హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్

Vikas Manda

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....

Advertisement

Jagannath Puri Rath Yatra 2021: ఘనంగా పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర, కరోనా కారణంగా భక్తులకు అనుమతి నిరాకరణ, పూరీ రాజు, వేది పండితులు, ఆల‌య అర్చ‌కులు, సిబ్బందితో రథయాత్ర

Hazarath Reddy

Bonalu 2021: భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి షురూ, తొలిగా ప్రారంభం అయిన గోల్కొండ బోనాలు, వచ్చే నెల 8వ తేదీ వరకు జగదాంబిక మహంకాళి అమ్మవారి ఉత్సవాలు, ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా నేటి నుంచే..

Hazarath Reddy

గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు (Golkonda Bonalu 2021) ప్రారంభం అయ్యాయి. గతేడాది కోవిడ్‌ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కాగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు (Golconda Jagadamba Mahankali Bonalu 2021 ) చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది.

Kerala's Sabarimala Temple: ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం, కరోనా టీకా వేయించుకున్న వారికి మాత్రమే అనుమతి, కేరళలో పెరుగుతున్న కరోనా, జికా వైరస్ కేసులు

Hazarath Reddy

కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 17 నుంచి దేవస్థానాన్ని (Kerala's Sabarimala Temple) తిరిగి తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు ( July 17 to 21 for Monthly Puja) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకూ అవకాశం కల్పించనున్నారు.

Space Travelling: అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ

Vikas Manda

అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే...

Advertisement
Advertisement