రాష్ట్రీయం

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు, సాధారణ అనస్థీషియా లేకుండా ఆపరేషన్

Hazarath Reddy

రాజాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

YS Jagan On Good Book: రెడ్ బుక్ కాదు గుడ్‌ బుక్ పెడదాం...ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలన్న జగన్, కష్టాల్లో నుండే నాయకులు పుడతారని ధైర్యం నింపిన జగన్

Arun Charagonda

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు మనం గుడ్ బుక్ పెడదాం అని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జగన్. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు.

Adulterated Tea Racket Busted: హైదరాబాద్‌లో టీ తాగేవాళ్లు జాగ్రత్త, 300 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాదీ జాగ్రత్తగా ఉండండి, బహుశా మీరు టీ స్టాల్స్‌లో కల్తీ టీ తాగుతున్నారేమో. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం టీ కల్తీ రాకెట్‌ను ఛేదించింది.హైదరాబాద్‌లో 300 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది.

CM Revanth Reddy On SC Categorization: ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్‌ రిపోర్టు సమర్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మాదిగలను మోసం చేస్తున్న నయవంచకుడు సీఎం అని బీఆర్ఎస్ మండిపాటు

Arun Charagonda

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Tension At Kodangal: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన...అడ్డుకున్న పోలీసులు, వీడియో

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం, 100కు కాల్ చేసిన మహిళతో పరిచయం పెంచుకుని అఘాయిత్యం

Hazarath Reddy

వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జరగగా 100కు కాల్ చేసింది.. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.ఆ తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదు. చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా తప్పించుకొని వచ్చానని ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది.

Andhra Pradesh Shocker: ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

KTR On Bathukamma Celebrations: ఈసారి పండుగ..పండుగ లెక్క లేకుండా పోయింది...భయానక వాతావరణంలో తెలంగాణ ప్రజలు..మండిపడ్డ కేటీఆర్, నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని మండిపాటు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి అని తెలిపారు. ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయిందని...రేవంత్ పాలనలో రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, అవినీతి బండారం బయటపెట్టిన ఆమె భర్త

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త.

BJP Leader Video Call Leaked: చిక్కుల్లో గుంటూరు జిల్లా బీజేపీ నేత, ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ రేపు వస్తావా అంటూ పచ్చిబూతులు..వీడియో వైరల్

Arun Charagonda

బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్‌ సోషల్‌ మీడియా సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్‌ లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం అంటూ చేసిన అసభ్యకర లీక్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mahbubnagar: పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగం కొల్పోయిన యువకుడు, ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యంగా ఇవ్వడంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

ఓ పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్పోయాడు ఓ యువకుడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ కి చెందిన నాగరాజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. సెప్టెంబర్ 27 లోపు ఇంటర్వ్యూకి హాజరు కావాలని అధికారులు నాగరాజుకి కాల్ లెటర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు.

Patnam Narender Reddy Arrested: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పాదయాత్రకు బయలుదేరుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ నెలకొల్పకూడదని గ్రామ ప్రజలతో కలిసి ఇవాళ పాదయాత్రకు పిలుపునివ్వగా హైదరాబాద్ నుండి కొడంగల్ బయలుదేరుతుండగా బొమ్మరాసపేట తుంకిమెట్ల వద్ద అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Cyber Fraud In Andhra Pradesh: డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..డ్రగ్స్ మాఫియా పేరుతో రూ. 2 కోట్లు స్వాహా..

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా డాక్టర్‌నే బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అమీన్ ఆసుపత్రి వైద్యుడు ఇంతియాజ్‌కు పోలీసు అధికారి ఫొటో కలిగిన నంబరు నుంచి ఐదు నెలల క్రితం ఫోన్ వచ్చింది.

Pawan Kalyan At Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సరస్వతీ దేవీ అవతారంలో దుర్గమ్మ, ప్రత్యేక పూజలు చేసిన పవన్

Arun Charagonda

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్నారు పవన్. అనంతరం ప్రత్యేక పూజలు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని లక్షలాదిగా దర్శించుకోనున్నారు భక్తులు.

Suryapet: మహిళతో అసభ్య ప్రవర్తన, కర్రలతో దాడి చేసిన కుటుంబ సభ్యులు..వైరల్ వీడియో

Arun Charagonda

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కర్రలతో దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్‌లో ఓ వ్యక్తి గతంలో పరిచయం ఉన్న ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబసభ్యులు కర్రలతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Disciplinary Action On PV Sunil: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ

Arun Charagonda

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్ర‌భుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబ‌ర్ 1695 జారీ చేసింది.

Advertisement

FSSAI Lab At Tirumala: తిరుమలలో FSSAI ల్యాబ్, ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం,22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి సత్యకుమార్

Arun Charagonda

తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయ‌నుంది FSSAI. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క‌ర్నూలులో రూ.40 కోట్ల‌తో స‌మ‌గ్ర ఆహార ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాలను పెంచేందుకు 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు...ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల చ‌ట్టం అమ‌లుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్లడించారు మంత్రి.

Warangal: కూల్చివేతలు..ఎమ్మార్వోపై దాడి, ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని అనుకుని ఎమ్మార్వోపై దాడి చేసిన వరంగల్ ఎస్‌ఆర్‌ నగర్ కాలనీ వాసులు, బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి వచ్చానని చెప్పిన వినని ప్రజలు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని ఎమ్మార్వోపై దాడి చేసిన సంఘటన వరంగల్ ఎస్‌ఆర్‌ నగర్‌లో చోటు చేసుకుంది. బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి ఎమ్మార్వో వెళ్లగా తమ ఇండ్లను కూలగొట్టడానికే ఎమ్మార్వో వచ్చాడేమో అనుకొని ఆయనపై దాడి చేశారు కాలనీ వాసులు. దీంతో తనపై దాడికి పాల్పడిన వారిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో.

Hyderabad Metro Rail Second Phase: హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధం, రూ.24,269 కోట్లతో అంచనా వ్యయం, కేబినెట్ అమోదం తెలిపాక కేంద్రానికి నివేదించనున్న ప్రభుత్వం

Arun Charagonda

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే మూడు కారిడార్లుగా హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతుండగా మరో ఐదు కారిడార్లలో మెట్రో రెండో దశను విస్తరించనున్నారు.

Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన

Vikas M

ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.

Advertisement
Advertisement