రాష్ట్రీయం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

Telangana: మా వద్ద హైదరాబాద్ ఉంది, ఏపీతో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మా పోటీ ప్రపంచంతోనేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.

Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.

Telangana Governor Quota MLC: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య

Arun Charagonda

సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్‌ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత

Arun Charagonda

హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‍లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ

Arun Charagonda

ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్‍లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‍ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‍లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Independence Day 2024: తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్‌, ఎందుకు ప్రదానం చేశారంటే..

Hazarath Reddy

తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం

Har Ghar Tiranga railey:హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, చాంద్రయణగుట్ట నుండి చార్మినార్ వరకు ర్యాలీ, వీడియో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సిఆర్‌పిఎఫ్ క్యాంపస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఫలకనుమ, శాలిబండ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌పిఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Advertisement

Telangana Shocker: దారుణం, కొడుకు జైలుకు వెళ్లాడని తల్లీకూతుళ్లతో మాట్లాడని గ్రామస్తులు, తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

Hazarath Reddy

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఎవరూ మాట్లాడటం లేదని తల్లీకూతుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు.కాగా పది నెలల క్రితం కోడలిని హత్య చేసిన కొడుకు జైలుకు వెళ్లాడు. ఇదే కేసులో జైలుకి వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు

CM Revanth Reddy In Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెట్టుబడులే లక్ష్యంగా సాగిన రేవంత్ టూర్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన సాగింది.

Andhra Pradesh: కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య, బతకడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో

Hazarath Reddy

కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య.. మాచర్ల పట్టణానికి చెందిన చక్క రాజేష్ 30 సంవత్సరాలు, రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన కుటుంబంలో కలహాలు ఉన్నట్లు, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశారు.

Andhra Pradesh: తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సొంత రాష్ట్రంలోనే ప‌ని చేయ‌నున్న ఉద్యోగులు

Hazarath Reddy

తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇక‌పై తెలంగాణ‌లో ప‌ని చేయ‌నున్నారు.

Advertisement

KTR Questions CM Revanth Reddy: పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్

Arun Charagonda

రాష్ట్రంలో పల్లెలు పడకేశాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.

Nalgonda: వాగులో చిక్కుకుపోయిన ఎస్సై వెంకట్‌ రెడ్డి, స్థానికుల సాయంతో బయటపడ్డ ఎస్సై, వీడియో వైరల్

Arun Charagonda

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు గట్టుప్పల్, పుట్టపాక మధ్యలోని ఆరుమాళ్ల వాగు పొంగి పొర్లింది. దీంతో సొంతూరు వెళ్తూ వాగులో చిక్కుకుపోయారు గట్టుప్పల్ ఎస్సై గుత్త వెంకట్ రెడ్డి. సిబ్బంది, స్థానికుల సహాయంతో బయయటపడ్డారు ఎస్సై.

Duvvada Srinivas: క్లాసికల్ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ ఘటన నేపథ్యంలో మాధురి ట్వీట్ వైరల్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. మాధురి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన క్లాసికల్ డ్యాన్స్ చూడాలనుకునేవారి కోసం వీడియో రిలీజ్ చేసింది మాధురి.

Train Hits Goats At Vikarabad: 50 మేకలను ఢీ కొట్టిన ట్రైన్స్, అక్కడికక్కడే మేకలు మృతి,వీడియో వైరల్

Arun Charagonda

వికారాబాద్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 50 మేకల్ని ఢీకొట్టాయి రెండు రైళ్లు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ డీకే తండాకు చెందిన రైతులు మేకల్ని తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల గుంపు ఎదురవడంతో రైలు పట్టాలపైకి వెళ్లాయి మేకలు. 50 మేకలు మృత్యువాత పడ్డాయి.

Advertisement

Andhra Pradesh Shocker: వైరల్ వీడియో.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన స్నేహితులు, ఆస్పత్రిలో చేరిక, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపణ

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం, చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకెళ్లి, అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన కుమారుడిని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది

Andhra Pradesh Shocker: కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు

Arun Charagonda

ఏపీలో హత్యారాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. పత్తికొండ మండలం హోసూరులో మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసుని హతమార్చారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam: గిన్నెలు కడగలేదని కూతురుపై తల్లి దాడి, బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

విశాఖపట్నంలో అమానుషం చోటు చేసుకుంది. గిన్నెలు కడగ లేదనే నెపంతో ఓ తల్లి దారుణానికి తెగబడింది. విశాఖపట్నం సింహాద్రి నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 సంవత్సరాల బాలికపై తన తల్లి తీవ్రంగా దాడి చేయగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతోంది బాలిక.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య యత్నం, ట్యాంక్ బండ్ శివ సాయంతో యువతి సేఫ్‌..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ - ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది మహిళ. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు.. ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకుతీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement