రాష్ట్రీయం

Fire Accident At Vishakapatnam Beach: విశాఖ బీచ్‌లో అగ్నిప్రమాదం, డైనో పార్కులో చెలరేగిన మంటలు, లక్షల రూపాయల ఆస్తి నష్టం

Arun Charagonda

విశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ

Arun Charagonda

భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్‌ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Telangana Nominated Posts: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మధుయాష్కి, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర, మంత్రివర్గ విస్తరణ కూడా, రేసులో ఉంది ఎవరంటే?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ACB Rides On Rangareddy Additional Collector:ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేయగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.

Advertisement

Andhra Pradesh Shocker: అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు ముమ్మరం

Arun Charagonda

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని గాలింపు చర్యలు చేపట్టారు.

Telangana Shocker: గంజాయి మత్తులో సీఐ కొడుకు వీరంగం, రోడ్డుపై మూత్రం పొయవద్దని చెప్పినందుకు ఓ డ్రైవర్‌పై దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

గంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leopard Caught On Srisailam: వీడియో ఇదిగో.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం, ఓ ఇంట్లో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత పులి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత సంచారం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుత పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం, పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్ పెట్, బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, బేగంపేట,కోటి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Jurala Dam: జూరాల డ్యామ్‌ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)

Rudra

తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.

Visakha MLC By Elections: సీఎం చంద్రబాబు వెనకడుగు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరం, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంతా ఉహించిందే జరిగింది. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

Hyderabad Shocker: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐపై మహిళల దాడి.. అసలేం జరిగింది?

Rudra

ప్రజల భద్రత కోసమే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నూమిన్నూ కానకుండా డ్యూటీలో ఉన్న పోలీసులపట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై కొందరు మహిళలు దాడికి పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

Advertisement

ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

Rudra

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Vangalapudi Anitha On YS Jagan: జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

Telangana JAC Again: తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఉద్యోగ జేఏసీ, ఒకటో తేదీ జీతాలేవి?, రేవంత్ సర్కార్‌ పై పోరాటానికి ఉద్యోగులు రెడీ

Arun Charagonda

తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యోగ జేఏసీ మళ్లీ ఏర్పాటైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉద్యోగులు. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు అన్నారు.

Warangal Shocker: చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య, వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

వరంగల్ జిల్లా: రాయపర్తి చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హన్మకొండ జిల్లా పైడిపెల్లికి చెందిన దూకి అంజలి (25), సంగాల దిలీప్ (30) గా గుర్తించగా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు స్మితా సబర్వాల్ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం...పూర్తి సమాచారంతో అఫిడవిట్ ఇవ్వాలన్న న్యాయస్థానం

Arun Charagonda

దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుందర. ఈ సందర్భంగా పిటీషనర్ అర్హతను ప్రశ్నించింది ధర్మాసనం. తాను ఒక వికలాంగురాలని, స్మితా వ్యాఖ్యలు తన మనోభావాలు దెబ్బతీసే లాగా ఉన్నాయని పేర్కొంది వసుందర. పూర్తి సమాచారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది హైకోర్టు.

Harishrao On Sitarama project: సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ బీఆర్‌ఎస్‌దే, గులాబీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు, డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న హరీష్ రావు

Arun Charagonda

ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(ఆగస్టు 11న) ట్రయల్ రన్ నిర్వహించింది ప్రభుత్వం. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి ఆనందం వ్యక్తం చేశారు.

Telangana Speaker Meets ChandraBabu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ, శ్రీవారి దర్శనాల్లో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై చర్చ

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరుగగా తిరుమల లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. టీటీడీలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ శాసనసభ్యులకు అర్హత కల్పించాలని, శాసనసభ్యుల రిక్వెస్టును ఆమోదించాలని కోరారు.

Botsa Satyanarayana Files Nomination: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

Arun Charagonda

విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.

Advertisement
Advertisement