రాష్ట్రీయం

Video: కొడుకు మృతదేహం చూసి కుప్పకూలిపోయిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గుండెపోటుతో మృతి చెందిన పెద్ద కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు. కొడుకు మృతదేహం చూసిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

Andhra Pradesh Floods: ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు

Hazarath Reddy

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

Telangana Floods: మూసీ నదిలోకి భారీగా పెరిగిన వరద ప్రవాహం, అప్రమత్తమైన అధికారులు, నల్గొండ మూసీ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Telangana Floods: దిగువ గ్రామాలకు వణుకుపుట్టిస్తున్న కడెం ప్రాజెక్ట్, భారీగా చేరుతున్న వరద నీరు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది.

Advertisement

Patancheru MLA Son Dies: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి, కిడ్నీలు పాడవటంతో ఆస్పత్రిలో చేరిన విష్ణువర్ధన్‌రెడ్డి

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు.

Telangana Floods: అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి

Srinivasa Sethu Flyover Accident: తిరుపతి ఫ్లైఓవర్ పనుల్లో మరోసారి ప్రమాదం, సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా తెగిన వైర్లు, ఇద్దరు కార్మికులు మృతి

VNS

తిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో (Srinivasa Sethu Flyover) ప్రమాదం జరిగింది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

Red Alert Issued For Telangana: బీ అలర్ట్! ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన

VNS

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద (Flood) నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Tourists Rescued By NDRF: ములుగు అడవిలో తప్పిపోయిన 84 మంది టూరిస్టులు సేఫ్‌, సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఎన్డీఆర్ఎఫ్, రాత్రంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్

VNS

ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను (Rescued By Police) పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం (Mutyaladhara waterfalls) చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు.

Telangana Rains: షాకింగ్ వీడియో, వాగు దాటుతూ మహిళ గల్లంతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘటన..

kanha

వాగు దాటుతూ మహిళ గల్లంతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.

Telangana Rains: భద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ, 48 అడుగులకు చేరిన గోదావరి వరద

kanha

భద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాధ హెచ్చరిక జారీ గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరిన గోదావరి వరద. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు, నిలిచిపోయిన రాకపోకలు.

Mulugu District Shocker: ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది టూరిస్టులు..

kanha

ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు.

Advertisement

Jitta Suspended from BJP: జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ, పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు

Hazarath Reddy

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటు వేసింది.చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా కొన్ని రోజులుగా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.

Telangana: జీవో నెంబర్‌ 46 రద్దు చేయాలంటూ నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జీవో నెంబర్‌ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు.

Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది

TSRTC T9-30 Ticket: టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్, రూ.50 చెల్లిస్తే 12 గంటలపాటు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించవచ్చు

Hazarath Reddy

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని #TSRTC ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Telangana: రూ. 28 లక్షల క్యాష్ బ్యాగ్ బస్సులో పెట్టి టిఫెన్ కోసం దిగిన ప్రయాణికుడు, తీరా వచ్చి చూసేసరికి షాక్, లబోదిబోమంటూ స్టేషన్‌కి పరుగులు

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. టిఫిన్ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం ఆగడంతో ఆయన బస్సు దిగారు.

Andhra Pradesh Rains: భారీ వర్షాలకు విశాఖలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

Andhra Pradesh: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు కాదు రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా, క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ కమిషనర్

Hazarath Reddy

మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్‌‌ ఫోన్‌ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.

Peacock Dance Video: నెమలి డ్యాన్స్ వేయడం మీరు ఎప్పుడైనా చూశారా, చూడకుంటే ఈ వీడియోలో నాట్య మయూరిని చూడండి

Hazarath Reddy

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వ్యవసాయ పొలాల వద్ద ఓ నెమలి తన నృత్యంతో రైతులను కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు తమ సెల్ ఫోన్లలో ఆ నాట్య మయూరిని వీడియో తీసి బంధించారు.

Advertisement
Advertisement