రాష్ట్రీయం

Viral Video: భారీ వర్షాలకు ఇంట్లోకి పాము, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకోవడంతో జీహెచ్ఎంసీ ఆఫీసుకి పాముని పట్టుకుపోయిన యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్ - భారీ వర్షాలకు అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీరుతో పాటు పాము వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఓపిక నశించి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చి టేబుల్ మీద పామును పెట్టి నిరసన తెలిపాడు.

Video: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీగా మంటలు, కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్

Hazarath Reddy

మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీ మంటలు చెలరేగడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు, మంటలను చూసి డ్రైవర్ వాహనాన్ని ఆపి లారీ నుండి దూకాడు.

Telangana Floods:భారీ వరదలు, శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వాగు దాటిన సిద్దిపేట గ్రామస్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిద్దిపేట - చేర్యాల మండలంలో భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని గ్రామస్థులు వాగు దాటిన కార్యక్రమం పూర్తి చేశారు. వీడియో ఇదిగో..

Telangana Shocker: సోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులర్ అవుతుందని చెల్లిని రోకలి బండతో కొట్టి చంపేసిన అన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

Advertisement

Andhra Pradesh: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్,హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా, ఏపీలో రూల్స్ త్వరలో అమల్లోకి రానున్నట్లుగా వార్తలు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా వేయనుంది.

Video: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా కొట్టుకువచ్చిన మొసళ్లు, నది దగ్గరకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జన జీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలకు మొసళ్లు సైతం వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. తాజాగా నారాయణపేట - మక్తల్ మండలం పసుపుల గ్రామ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి వాగులో మొసళ్ళు కొట్టుకొచ్చాయి. వీడియో ఇదిగో.

No-Confidence Motion: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌కు విన్నపం

Hazarath Reddy

మణిపూర్‌పై వివాదం మధ్య, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోయర్ హౌస్ స్పీకర్ ఈరోజు పార్లమెంటులో నోటీసును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Video: వీడియో ఇదిగో, రద్దీ రోడ్డులో ఒక్కసారిగా పేలిన కారు టైరు, ఈడ్చుకుంటూ వెళ్లిన లారీ, తప్పిన భారీ ప్రమాదం

Hazarath Reddy

హైదరాబాద్ - మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్లో ఆల్టో కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. కారును లారీ ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీడియో ఇదిగో..

Advertisement

Telangana Schools Closed for 2 Days: రేపు,ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Hazarath Reddy

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

Vizag Knife Attack Case: జగన్‌పై కత్తి దాడి కేసు, ఆగస్టు 1న విచారిస్తామని తెలిపిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం

Hazarath Reddy

తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది.

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు

Advertisement

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.

HC Rejects Srinivas Goud Plea: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కదురు, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చిన ధర్మాసనం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

HC Disqualifies Kothagudem MLA: కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు, జలగం వెంకట్రావ్‌ను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Hazarath Reddy

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

Hyderabad Rains: హైదరాబాద్ ట్రాఫిక్ జాం, ఐటీ ఉద్యోగులకు లాగ్ అవుట్‌పై కీలక సూచనలు చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సూచించిన సైబరాబాద్ పోలీస్ శాఖ.

Advertisement

Video: భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం మీద నుంచి దూకిన భర్త, కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరింపులు

Hazarath Reddy

భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. కానీ వారు చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ ఆ బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ భర్త.. భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కారు. ఆపై కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ నానా హడావుడి చేశారు. తీరా పట్టు తప్పడంతో పై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

My Home Cement Factory Accident: మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, అయిదుగురు కార్మికులు మృతి

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది

Justice Dhiraj Singh Thakur: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు

Hyderabad Rains: హోంగార్డుల నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరూ వర్షంలోనే, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసిన యంత్రాంగం

Hazarath Reddy

మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరజీవనం దాదాపు స్తంభించింది. మరో నాలుగురోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement
Advertisement