రాష్ట్రీయం
Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Jitta Balakrishna Allegations On Kishan Reddy: కిషన్ రెడ్డి పచ్చి సమైఖ్యవాది, కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను సస్పెండ్ చేశారంటూ జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు
VNSకేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై(Kishan Reddy) బీజేపీ బహిష్కృత నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని జిట్టా ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అని జిట్టా మండిపడ్డారు.
Brahmanandam Meets CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం దంపతులు
kanhaహైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ.. శనివారం నాడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కుటుంబ సమేతంగా కలిసి.. వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సినీ నటుడు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
MP Vijay Sai Reddy: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ పర్యటన సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు
kanhaనూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ పర్యటన సందర్భంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు.
Jayasudha: బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జయసుధ ? ముషీరాబాద్‌ నుంచి జయసుధ పోటీ చేసే అవకాశం ?
kanhaప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నాన్నారు.
Hyderabad Shocker: లహరి రెడ్డి మృతి కేసులో ట్విస్ట్, భర్త వల్లభ్ రెడ్డి మృతురాలి తల గోడకు గట్టిగా బాదడంతో మృతి - పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు..
kanhaవల్లబ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు కేసు తేలింది. లహరి తలపై గాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నా లహరి తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేయడం లేదు. లహరి తల్లితండ్రులను వల్లబ్ బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Viral Video: ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి, శ్రీలంక తిరిగి వెళ్లిపోవాలని యువతికి చిత్తూరు పోలీసుల నోటీసులు
kanhaఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి..శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విజిటింగ్ వీసాపై ఈనెల 8న వచ్చిన విఘ్నేశ్వరి, లక్ష్మణ్ వివాహం చేసుకున్నారు.
Telangana Rains: వరంగల్ భద్రకాళి చెరువుకు గండి, ముంపు ప్రాంత ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
kanhaవరంగల్ జిల్లాలో తాజాగా వరంగల్‌ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతననగర్ వైపు భద్రకాళి చెరువుకు గండి పడింది. దీంతో ఉదృతంగా వరద పోతోంది. దీంతో భయాందోళనలో పోతననగర్, సరస్వతి నగర్ వాసులు ఉన్నారు. వర్షం లేకపోయినప్పటికీ భద్రకాళి చెరువుకు భారీగా తరలివస్తోంది వరద. చెరువుకు వరద పోటేత్తడంతో కోతకు గురైంది కట్ట. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Bay of Bengal: బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.. సముద్రంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ
Rudraబంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
MMTS Trains Cancelled: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ సర్వీసులు రద్దు
Rudraఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది.
Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ.. ముస్తాబైన బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు.. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా ప్రసిద్ధి
Rudraఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెల్లూరులోని రొట్టెల పండుగ మొదలైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ పండుగ జరగనుంది.
Godavari’s Danger Level In Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. 54 అడుగులు దాటిన నీటిమట్టం.. నీటమునిగిన భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం.. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Rudraభద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది.
Fake Judge Arrest: జైలు నుంచి వచ్చి జడ్జీగా అవతారమెత్తిన కేటుగాడు, నేను న్యాయమూర్తిని మీ భూసమస్యలు పరిష్కరిస్తానంటూ రూ. 10లక్షలు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్
VNSజిల్లా జడ్జి పేరుతో (Fake judge) మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు, ఆయ‌న‌కు భ‌ద్ర‌తా సిబ్బందిగా పనిచేస్తున్న మరోవ్యక్తిని శుక్రవారం మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు, ఉప్పల్‌ (Uppal) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్ద‌రి నుంచి పిస్టల్‌, రెండు మ్యాగ‌జైన్స్‌, ఫోర్‌వీలర్‌ వాహనం, మూడు సెల్‌ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana Rains: భారీ వరదల్లో నీటిలో ఈదుకుంటూ వెళ్లి గ్రామానికి కరెంట్ సరఫరా అందించిన విద్యుత్ ఉద్యోగి, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంతం మధ్యలో వైరు తెగిపోవడంతో గ్రామంలో కరెంటు లేకుండా పోయిందని తెలుసుకున్న ఎలక్ట్రికల్ హెల్పర్‌ కొప్పుల సంతోష్‌ ఏ మాత్రం వెనుకాడకుండా నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి తీగను మరమ్మత్తు చేసి గ్రామం మొత్తానికి విద్యుత్‌ను తిరిగి తీసుకువచ్చాడు.
TSRTC: ప్రయాణికులకు అలర్ట్, హైదరాబాద్ - విజయవాడ బస్సు సర్వీసులు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ, ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది.
Telangana Floods: భారీ వర్షాల్లో ప్రజలకు అండగా తెలంగాణ పోలీసులు, వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో బిజీ బిజీ
Hazarath Reddyతెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పోలీసులు దగ్గరుండి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్లు శ్రమిస్తున్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యం.
BRO Movie Chaos: థియేటర్లో స్క్రీన్ చింపేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ "బ్రో" సినిమాకు అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి తోపులాటలో స్క్రీన్ చింపారు. స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Telangana Rains: తెలంగాణలో పది జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Hazarath Reddyవికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల పైచిలుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Video: దుకాణదారుడికి టోపీ పెట్టిన కిలేడీ, యజమాని కళ్లు గప్పి స్మార్ట్‌గా బంగారం దొంగతనం ఎలా చేసిందో వీడియోలో చూడండి
Hazarath Reddyశ్రీకాకుళంలో కి'లేడీ' దొంగతనం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. శ్రీకాకుళం - సోంపేటలో శుక్రవారం ఓ జ్యుయలరీ షాపులో దొంగతనం జరిగింది. బంగారం కొనుగోలు చేస్తామని వచ్చిన ఒక అమ్మాయి దుకాణదారుడు కళ్ళు కప్పి దొంగతనం చేసింది. దానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైరల్ అవుతోంది.