రాష్ట్రీయం

Revanth Reddy Missing Posters: రేవంత్ రెడ్డి కనబడటంలేదని పోస్టర్లు, 2023లో వర్షాలు వస్తున్న బటయకు రాలేదంటూ నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు

Hazarath Reddy

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనబడుటలేదని నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు. 2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు, 2023లో వర్షాలు వస్తున్న రాలేదు అంటూ పోస్టర్లు.నియోజకవర్గంలో పలు చోట్ల గోడలకు ఈ పోస్టర్లను అంటించారు. అయితే ఎవరు అంటించారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.

Telangana Floods: భారీ వరదలు, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని పర్యవేక్షించిన సీఎం కేసీఆర్, ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

తెలంగాణలో గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.

Telangana Floods: హైదరాబాద్ - విజయవాడ హైవే మీద 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, మిర్యాలగూడ మీదుగా మళ్లింపు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు వాగు

Hazarath Reddy

హైదరాబాద్ - విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐతవరం వద్ద హైవేపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. కోదాడ - హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Video: శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 25 అడుగుల పొడవున్నఅరుదైన చేప బ్లూ వేల్, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానాలు

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Floods: వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.

Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, ముంపు బాధితులకు బాసటగా నిలవాలని అధికారులకు ఆదేశాలు, గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు

Hazarath Reddy

రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Justice Dhiraj Singh Thakur: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం, శాలువా కప్పి సన్మానం చేసిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకో­ర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనచేత ప్రమాణం చేయించారు. సీఎం జగన్‌ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు.

Godavari Flood Surge Continues: గోదావరికి నదికి అంతకంతకూ పెరుగుతున్న వరద, అలర్ట్ అయిన అధికారులు, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది

Advertisement

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఇంట్లోకి వచ్చిన కొండచిలువ,పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించిన స్నేక్ రెస్క్యూ టీం

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగలు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలకు పాములు, మొసళ్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. తాజాగా ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వెంకటేష్ నగర్లో రోడ్డుపై పారుతున్న నీటిలో రోడ్డు పైకి వచ్చిన కొండచిలువ. దానిని స్నేక్ రెస్క్యూ టీం పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

Telangana Floods: భారీ వరదలకు జంపన్నవాగులో 7 గురు గల్లంతు, నాలుగు మృతదేహాలు లభ్యం, ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు

Hazarath Reddy

ఈ వాగులో ఏడుగురు గల్లంతు కాగా నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృతదేహం కరెంటు తీగలకు వేలాడుతుంది.

Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా

Rudra

హైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.

Medaram Submerged: మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం.. రెండు నుంచి మూడు అడుగుల మేర చేరిన నీరు.. ఏడుపాయలు, వరంగల్ భద్రకాళి, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు

Rudra

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలకుతం అయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది.

Advertisement

Hyderabad Rains: విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి - 65 మీద నందిగామ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వరద నీరు రోడ్డు మీదకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు దాటుతుండగా ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Telugu States Floods: అలర్ట్, విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు, ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు

Hazarath Reddy

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్‌-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి

Telangana Floods: కన్నారం వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

కన్నారం వాగులో బైక్ సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. హనుమకొండ - కన్నారం గ్రామానికి మహేందర్ అనే వ్యక్తి కన్నారం వాగు మీద బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కన్నారం వాగులో పడి కొట్టుకుపోయాడు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు జాలర్ల సహాయంతో గాలించగా అతని మృతదేహం లభ్యం అయింది. వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Telangana Floods: వీడియో ఇదిగో, కన్నారం వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు, జాలర్ల సహాయంతో గాలిస్తున్న పోలీసులు

Hazarath Reddy

హనుమకొండ (Hanmakonda) జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు గల్లంతయ్యాడు. వాహనంపై మహేందర్ అనే వ్యక్తి వాగుమీదుగా వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు

Advertisement

Video: వరదలో బైక్ మీద కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు, తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చిన గ్రామస్తులు

Hazarath Reddy

తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు ఉదృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రయాణికుడు, తాళ్ల సహాయంతో కాపాడి బైటకు లాగిన స్థానికులు.

Telangana Rains: భారీ వర్షానికి నీట మునిగిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు

Hazarath Reddy

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి

Telangana Floods: వీడియో ఇదిగో, వరద నీటిలో మునిగిపోయిన లక్నవరం వంతెన, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు

Hazarath Reddy

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Telangana Rains: ఆపరేషన్ మోరంచపల్లి సక్సెస్, గ్రామస్తులందరినీ సురక్షితంగా బోట్ల ద్వారా తరలించిన అధికారులు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్‌ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రెస్క్యూ చేశారు.

Advertisement
Advertisement