రాష్ట్రీయం

Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Ambati Rambabu: వీడియో ఇదిగో, అడ్వకేట్‌గా మారిన అంబటి రాంబాబు, ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మాజీ మంత్రి

Hazarath Reddy

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎ‍ల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

Advertisement

Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.

Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన చెత్త ఊడ్చే వాహనం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.

Advertisement

Telangana New Voter List: తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Hazarath Reddy

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది పురుష ఓటర్లు... 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా

Hazarath Reddy

ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Game Changer Event Tragedy: కాకినాడలో ఇద్దరు అభిమానులు మృతి, మృతుల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

Hazarath Reddy

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన త‌ర్వాత‌ వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చ‌నిపోయారు.

AP SBTET Diploma Results 2025: ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (AP SBTET), 2024–2025 సెషన్‌కు సంబంధించిన డిప్లొమా C16, C20 మరియు C23 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.

Advertisement

Game Changer Event Tragedy: గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

World Telugu Federation Programme: వీడియో ఇదిగో, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రస్తావన

Hazarath Reddy

తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది

Advertisement

Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న

Hazarath Reddy

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

Vikarabad Horror: డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)

Rudra

డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

Advertisement
Advertisement