ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు
Hazarath Reddyకర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు
AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీపై అప్‌డేట్, ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు (AP Inter Results 2024) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన పోతిన మహేష్, విజయవాడ వెస్ట్‌లో జనసేనకు బిగ్ షాక్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు షాక్‌ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్‌ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే.
Andhra Pradesh Elections 2024: గేదెను ఢీకొట్టిన కారు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్‌కి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ కీ ప్రమాదం తప్పింది.. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా అడ్డొచ్చిన గేదెని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..కారు బెలూన్ ఓపెన్ అవ్వడంతో స్వల్ప గాయాలతో నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఫరూఖ్ బయటపడ్డారు.
YSRCP Memantha Siddham Bus Yatra: 12వ రోజు 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. గంటావారిపాలెం నుంచి జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం..
sajayaమేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైయ‌స్ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు.
TOEFL Exams In AP: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..పాల్గొంటున్న 21 లక్షల మంది పాఠశాల విద్యార్థులు
sajayaవిద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు నేడు నిర్వహించనున్నారు.
Tamanna Simhadri : పవన్ కళ్యాణ్‌పై పోటీకి పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి
sajayaట్రాన్స్‌జెండర్ అయిన సింహాద్రి తమన్నా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భరత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా తమన్నా ఎన్నికల్లో పోరాడనుంది.
Heatwave Warning For AP: ఏపీలో వచ్చే రెండు రోజులు 145 మండలాల్లో వడగాడ్పులు, బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ, మండలాల లిస్టు ఇదిగో..
Hazarath Reddyబుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Ugadi 2024: ఉగాది సందర్భంగా సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం, తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్న జనసేనాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు
Ugadi Asthanam at Tirumala: తిరుమలలో కన్నుల పండువగా ఉగాది ఆస్థాన వేడుకలు
Rudraతిరుమలలో(Tirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi Asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Rudraషడ్రుచుల సమ్మేళనమే ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి.
Royal Challengers Bengaluru Greetings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరూ చూడండి!
Rudraరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు
Andhra Pradesh Elections 2024: సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసిన టీడీపీ, దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్సన, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు
Hazarath Reddyఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు
Andhra Pradesh: రోడ్డు లేకపోవడంతో రాని అంబులెన్స్, నడిరోడ్డు మీదే ఆడశిశువును ప్రసవించిన గిరిజన మహిళ, భారీగా రక్తస్రావం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది.
Inner Ring Road Scam: హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారనే వార్తలు ఫేక్, రూమర్స్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ
Hazarath Reddyఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ వస్తున్న కథనాలను ఏపీ సీఐడీ ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి, భావోద్వేగాలకు గురైన పవన్ కళ్యాణ్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.
Andhra Pradesh Elections 2024: వైసీపీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా, వైసీపీ టికెట్ రాకపోవడంతో కుమారుడితో కలిసి పార్టీకి రాజీనామా
Hazarath Reddyఅనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్‌లో పవన్‌కు బిగ్‌ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్‌, ఏ పార్టీలోకి వెళతారంటే..
Hazarath Reddyజనసేన పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పోతిన వెంకట మహేష్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఓ లేఖ విడుదల చేశారు. జనసేనకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారు