ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Horror: దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు
Anantha Venkatarami Reddy: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు
Hazarath Reddyమీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు.
MLA Gummanur Jayaram: అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్, వీడియో ఇదిగో
Arun Charagondaఅడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు.
Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్
Arun Charagondaతెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.
Republic Day Parade 2025: రిపబ్లిక్ డే పరేడ్ 2025 అవార్డులు.. టాప్ 3లో ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, వివరాలివే
Arun Charagondaరిపబ్లిక్ డే పరేడ్ 2025 వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్చ్ నిర్వహించాయి.
Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్
Arun Charagondaవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నేతృత్వంలో తొలి మిషన్
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది
Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.
Bhumana Karunakar Reddy: సూపర్ సిక్స్పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్పై మండిపడిన భూమన కరుణాకర్రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్
Hazarath Reddyకూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్
Hazarath Reddyసూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు.
Andhra Pradesh: రాజమండ్రిలో దారుణం, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్ మింగేసిన మహిళ, శస్త్ర చికిత్స చేస్తుండగా ఆక్సిజన్ అందక మృతి, మానసకి సమస్యలే కారణమని తెలిపిన వైద్యులు
Hazarath Reddyరాజమహేంద్రవరంలో 35 ఏళ్ల మహిళ సెల్ఫోన్ కీప్యాడ్ మింగి దారుణంగా మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.
APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Nellore Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాకిచ్చిన కార్యకర్తలు, టీడీపీ పార్టీని వదిలి వైసీపీలో చేరిన 200 మంది ఎమ్మెల్యే మద్దతుదారులు
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.31వ డివిజన్కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.
Andhra Pradesh: సూపర్ సిక్స్ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
Hazarath Reddy2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన
Hazarath Reddyవిశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.
SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Hazarath Reddyఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Tension Erupts in Dharmavaram: ధర్మవరంలో టెన్సన్, వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వైసీపీ మైనార్టీ నేత జమీర్
Hazarath Reddyఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు కార్లలో వెళ్తోన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.