ఆంధ్ర ప్రదేశ్

Tirumala Update: తిరుమలలో భక్తులకు ఇక వసతి లభ్యత మరింత సులభతరం, జూన్ 12 నుంచి అందుబాటులోకి రానున్న నూతన బుకింగ్ కౌంటర్లు; శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సీజే ఎన్వీ రమణ

Team Latestly

శనివారం ఉదయం 8 గంటల నుండి తిరుమలలోని ఈ ఆరు ప్రదేశాల నుంచి వసతి గది కోసం బుకింగ్ చేసుకోవచ్చు. అనంతరం గది ఎక్కడ కేటాయించబడిందనే విషయం మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీని తర్వాత నేరుగా ఉప విచారణ కార్యాలయాలకు వెళ్లి...

COVID19 in TS: తెలంగాణలో పాస్‌పోర్ట్ సేవలు పునరుద్ధరణ; రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్ కరోనా.. కొత్తగా 1798 పాజిటివ్ కేసులు నమోదు, 24 వేల దిగువకు ఆక్టివ్ కేసులు

Team Latestly

లాక్‌డౌన్ కారణంగా గత నెల 12న నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవలు గురువారం ఎప్పట్లాగే సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది. ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే..

Second Wave in AP: ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి వస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్, కొత్తగా 8,110 పాజిటివ్ కేసులు నమోదు; థర్డ్ వేవ్‌ను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధం అని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

Team Latestly

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1416 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 1,042 , అనంతపూర్ జిల్లా నుంచి 906 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 792 కేసులు వచ్చాయి....

Monsoon 2021 Update: ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు, రాగల 24 గంటల్లో ఏపి, టీఎస్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Team Latestly

తెలుగు రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా...

Advertisement

Covid in AP: ఏపీలో భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, 24 గంటల్లో 12,292 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, కొత్తగా 8,766 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం 1,03,995 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,766 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Andhra Pradesh logs 8766 new Covid cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,76,878 మందికి కరోనా వైరస్‌ (Covid in Andhra Pradesh) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,696కు చేరింది.

Andhra Pradesh: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం, సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన, డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపిన జూనియర్ వైద్యులు

Hazarath Reddy

ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు తెలిపారు.

Tenali Shocker: తొలి రాత్రే భర్త నపుంసకుడు అని తెలియడంతో షాక్ తిన్న వధువు, తల్లిదండ్రులకు చెప్పుకుని భోరున విలపించిన యువతి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hazarath Reddy

తెనాలితో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఎన్‌ఆర్‌ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తొలి రాత్రి భర్త తాను నపుంసకుడినని చెప్పడంతో పెళ్లైన యువతి ఒక్కసారిగా కంగుతింది. ఆ తరువాత అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు.

YSR Bheema Scheme: ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు సాయం, జులై 1 నుంచి వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, జూలై 8వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభం

Hazarath Reddy

వైఎస్ఆర్ బీమా’ పథకంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ బీమా పథకాన్ని (YSR Bheema Scheme) జులై1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.

Advertisement

Hyderabad Metro Timings Changed: హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు, ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌, సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌, సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు

Hazarath Reddy

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు (Hyderabad Metro Timings Changed) చేశారు. మారిన సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి.

Andhra Pradesh: ఏపీలోనే అత్యధికంగా ప్రాజెక్టులు, గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారనడానికి జీడీపీ గణాంకాలే నిదర్శనమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Industries Minister Goutham Reddy) పేర్కొన్నారు. 2020–21లో దేశ జీడీపీ (ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా) 2.97 శాతం క్షీణిస్తే మన రాష్ట్రంలో 1.58 శాతం వృద్ధి (Andhra Pradesh Records 1.58% Growth Rate) నమోదైందని ఆయన గుర్తు చేశారు.

weather in Telugu States: మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు, ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం, వివరాలను వెల్లడించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

రాగల రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు (southwest monsoon) పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Black Fungus in Andhra pradesh: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్, ఇప్పటి వరకు 1,623 కేసులు, 103 మంది మృతి, ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల కోసం కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చామని తెలిపిన సింఘాల్

Hazarath Reddy

ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు (103 people have died) నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ (Black Fungus in Andhra pradesh) చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు, టాబ్లెట్లని కేంద్రమే సరఫరా చేస్తోందన్నారు.

Advertisement

Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 7,796 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 77 మంది మృతి, తాజాగా 14,641 మంది కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం 1,07,588 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా... 7,796 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు.

COVID-19 Vaccination in AP: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌, గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు, వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

దేశవ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. అయితే రాబోయే నెలల్లో మూడవ దశ వస్తుందని అది చిన్న పిల్లలపై తీవ్ర ప్రభాదం చూపుతుందనే వార్తల నేపథ్యంలో ఏపీ సర్కారు అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌కు (vaccinate mothers of children under the age of five) ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

AP SSC & Inter Exams Update: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు కరోనా తగ్గిన తర్వాతే..మీడియాతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు (AP SSC& Inter Exams Update) నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన ( Education Minister Adimulapu Suresh) మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Madanapalle Gas Explosion: మదనపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు, ఇద్దరి మృతి..మరొకరికి తీవ్రగాయాలు, సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం పారిశ్రామికవాడలోని టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థలో సిలిండర్ (Madanapalle Gas Explosion) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. యూకలిప్టస్ ఆయిల్ నాణ్యతను పరిశీలించేందుకు వినియోగించే గ్యాస్ క్రోమాటోగ్రఫీ యంత్రం అమర్చుతుండగా ఈ ప్రమాదం (oxygen gas explosion in Madanapalle) జరిగింది.

Advertisement

Jagananna Thodu Funds Released: చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు, రూ.370 కోట్ల నిధులను జగననన్న తోడు పథకం కింద విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల (Jagananna Thodu Funds Released) చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

CM Jagan writes to PM Modi: 2022 కల్లా పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై పథకం పూర్తి, నిధులు విడుదల చేయాలని ప్రధానికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశామని లేఖలో తెలిపిన సీఎం

Hazarath Reddy

పీఎంఏవై కింద గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం జగన్‌ కోరారు. దీనికోసం ఆర్థిక సాయం చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ (CM Jagan writes to PM Modi) రాశారు.

Anandaih K Medicine: ఆనందయ్య కె మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్, తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ఆదేశాలు, కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి సూచించిన ధర్మాసనం

Hazarath Reddy

ల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు (Anandaih K Medicine) ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Curfew Extended in AP: జూన్‌ 20 వరకు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు, జూన్‌ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు, కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

Hazarath Reddy

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను (Curfew Extended in AP) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్‌ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి.

Advertisement
Advertisement