ఆంధ్ర ప్రదేశ్

AP Coronavirus Report: ఏపీలో కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదు, 21,101 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 101 మంది కరోనాకు బలి, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది.

Krishna Water Dispute: కృష్ణా మిగులు నీరుపై సీడబ్ల్యూసీ కీలక వ్యాఖ్యలు, సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు, వివాదాన్ని బోర్డు నేతృత్వంలో పరిష్కరించుకోవాలని సూచన

Hazarath Reddy

కృష్ణా నదీ జలాల వాటా మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఒక నీటి సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే.. ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది.

Former Dharmavaram MLA Nagireddy Dies: కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత, ధర్మవరం నియోజకవర్గానికి మూడు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

కోవిడ్ బారీన పడి మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) (Former MP Nagireddy Dies) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Raghu Rama Krishnam Raju Case: ట్విస్టులతో సాగుతున్న ఎంపీ కథ, ఆ గాయాలు అంతా అబద్దమని తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన సీఐడీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నరసాపురం ఎంపీ

Hazarath Reddy

నరసాపురం ఎంపీ కేసు (Raghu Ramakrishna Raju Case) ట్విస్టుల మధ్య సాగుతోంది. కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు (Special court) ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌ ( judicial custody) విధించింది.

Advertisement

AP Covid Report: ఏపీలో 24 గంటల్లో 18,739 మంది డిశ్చార్జ్, తాజాగా 22,517 మందికి కరోనా పాజిటివ్‌, 98 మంది మృతితో 9,271కు మొత్తం మరణాల సంఖ్య, జ్వరాలపై ఇంటింటి సర్వే ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 89,535 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 మందికి కరోనా పాజిటివ్‌గా (AP Coronavirus Update) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,11,320 మందికి కరోనా వైరస్‌ (Covid in AP) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,271కు (Covid Deaths) చేరింది

Amalapuram Shocker: అమలాపురంలో నడిరోడ్డుపై మహిళను దారుణంగా నరికి హత్య చేసిన దుండుగులు, తీవ్రగాయాల పాలైన మహిళ కొడుకు, పాత కక్షలే కారణమా..,దర్యాప్తు చేపట్టిన అమలాపురం పోలీసులు

Hazarath Reddy

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణ ఘటన (Amalapuram Shocker) చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ మహిళను నడిరోడ్డు మీద దారుణంగా హతమార్చేలా (Woman Brutally Assassination) చేశాయి. ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేయగా తల్లి ఘటనా స్థలంలోనే హత్యకు గురైతే కొడుకు రమేష్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

AP 10th Exam Dates: జూన్‌ 7 నుంచి 10వ తరగతి పరీక్షలు, షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని సూచించిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఏపీలో జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల (AP 10th Exam Dates) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Education MInister Adimulapu Suresh) వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.

MP Raghurama Krishnam Raju Case: రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు, CRPC 124 (A) సెక్షన్‌, 120 (B) IPC సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన సీఐడీ

Hazarath Reddy

ఎంపీ రఘురామకృష్ణరాజుకు (MP Raghurama Krishnam Raju Case) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు (High Court) తిరస్కరించింది. రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది.

Advertisement

Covid Fear: కరోనా తగ్గదనే భయంతో కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య, పురుగుల మందు తాగి బావిలో దూకిన దంపతులు, విజయనగరం జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందని భయపడి (Coronavirus Fear) ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం (3 covid patients commits suicide) నింపింది.

MP Raghu Rama Krishnam Raju Arrest: నేడు ఎంపీని మరోసారి విచారణ చేయనున్న సీఐడీ, నిన్న అర్ధరాత్రి వరకు విచారణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు, నేడు విచారణకు రానున్న పిటిషన్

Hazarath Reddy

అరెస్ట్ తరువాత నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును శుక్రవారం అర్ధరాత్రి వరకు సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో భాగంగా డీఐజీ సునీల్‌ పలు కోణాల్లో ప్రశ్నించారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాతో మరో 96 మంది మృతి; ఏపి నుంచి టీఎస్ వెళ్లే అంబులెన్సులకు లైన్ క్లియర్ చేసిన హైకోర్ట్

Team Latestly

ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు మెరుగైన చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్తున్నారు. అయితే తెలంగాణ సరిహద్దు వద్ద టీఎస్ పోలీసులు ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మ్ అయితేనే అనుమతిస్తామని అంబులెన్సులను అడ్డుకోవడం రెండు రాష్ట్రాల మధ్య సామాజికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది....

'Do Not Stop Ambulances' : రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకోవడంపై హైకోర్ట్ ఆగ్రహం, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే, ఏ రూపంలోనూ అంబులెన్సులను ఆడ్డుకోరాదని ఆదేశాలు జారీ

Vikas Manda

Advertisement

'Permission Must' : కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలి, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Team Latestly

కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పేషేంట్లు ముందుగా ఇక్కడి ఆసుపత్రులలో బెడ్ రిజర్వ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కరోనా బాధితులు అంబులెన్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో ....

COVID19 in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,399 పాజిటివ్ కేసులు నమోదు, 89 మంది మృతి.. రాష్ట్రంలో 2 లక్షలు దాటిన ఆక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య

Vikas Manda

COVID in TS & AP: తెలంగాణలో కొత్తగా 4,693 పాజిటివ్ కేసులు నమోదు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,399 పాజిటివ్ కేసులు నమోదు, తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంగా 5 వేలకు మించకుండా కేసులు నమోదవుతుండగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 వేల పైబడి కేసులు నమోదవుతున్నాయి....

Rythu Bharosa Funds Release: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నిధులను విడుదల చేసిన జగన్ సర్కార్, రైతుల బీమా పథకం కోసం అదనపు నిధులు సైతం విడుదల

Team Latestly

రాష్ట్రవ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద వరుసగా ముడో ఏడాది మొదటి విడత కింద రూ. 3,928.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం తెలిపారు....

Advertisement

AP Coronavirus: ఏపీలో 24 గంటల్లో 19,095 మంది డిశ్చార్జ్, 89 మంది కరోనాతో మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు, ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లకు లైన్ క్లియర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఏకంగా 21,452 మంది కరోనా (AP Coronavirus) బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది కరోనా వల్ల మృతి (Covid Deaths) చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) నమోదయ్యాయి.

CM YS Jagan Review Meeting: విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, వాటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దండి, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

ఉన్నత విద్యపై ఏపీ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలని, దేశంలో టాప్‌ టెన్‌లో రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిలవాలని పేర్కొన్నారు.

Covid in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం కేర్ సెంటర్స్, మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Hazarath Reddy

కరోనా కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు (Care centres for children of COVID patients) చేయాలని నిర్ణయించుకుంది.

Tammineni Sitaram: కరోనా నుంచి కోలుకున్న స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దంపతులు, వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసిన ఏపీ స్పీకర్‌, క‌రోనా క‌ష్ట‌కాలంలో రాజ‌కీయ ల‌బ్ది కోసం మాట్లాడ‌టం స‌రికాద‌ని సూచన

Hazarath Reddy

క‌రోనా వైరస్‌ బారిన ప‌డిన ఆంధ్రప్రదేశ్‌ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం (Assembly speaker Tammineni Sitaram) దంపతులు సంపూర్ణంగా కోలుకున్నారు. శ్రీ‌కాకుళంలో మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి వైద్యులు ఆయ‌న‌కు క్రిటిక‌ల్ ట్రీట్‌మెంట్‌ అందించి (recovers from Covid-19) త్వ‌రంగా కోలుకునేట్టు కృషి చేశారు. కాగా శ్రీ‌కాకుళంలో క్రిటిక‌ల్ ట్రీట్‌మెంట్‌ అందించిన వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు స్పీకర్‌ తెలియ‌చేశారు.

Advertisement
Advertisement