ఆంధ్ర ప్రదేశ్
SI Commits suicide: వివాహేతర సంబంధమే కొంప ముంచిందా, గుడివాడలో ఎస్ఐ ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టూ టౌన్‌ పిల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. విజయ్ కుమార్ మృతికి (SI Commits suicide) వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడికి రెండు నెలల కిందటే వివాహమైంది.
Devineni Uma Arrested: టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్, గొల్లపూడిలో 144 సెక్షన్, దీక్షకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు, బహిరంగ చర్చకు సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Hazarath Reddyవిజయవాడలోని గొల్లపూడిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేవినేని ఉమ సవాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీక్షకు యత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి (Devineni Uma Arrested) తీసుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఏపికి సంబంధించిన కరోనా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి
Team Latestlyఆదివారం నాటికి రాష్ట్రంలో 32,144 మంది టీకాలు వేయించుకున్నారు. అయితే రెండో రోజు సుమారు 27 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 13 వేల మంది మాత్రమే టీకాపై ఆసక్తి చూపారు. అనుకున్న దానికంటే 50 శాతం తక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది....
CM YS Jagan Delhi Tour: రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైయస్ జగన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ, నేడు విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి (CM YS Jagan Delhi Tour) వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమం‍త్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు.అమిత్ షాతో (Home minister amit shah) పాటు ఇతర ముఖ్యనేతలతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Vizianagaram: ఏపీలో ఎస్‌ఐపై యువకుల దాడి, బైక్‌ని అతివేగంగా నడపొద్దన్నందుకు విజయనగరం పాచిపెంట ఎస్‌ఐ రమణపై దాడి, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో విజయనగరం జిల్లాలో యువకులు ఏకంగా ఎస్ఐ పైనే దాడికి దిగారు. బైక్ అతి వేగంగా నడవద్దని వారించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పై వారు దాడికి దిగారు. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది.
N. T. Rama Rao Death Anniversary: ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి నేడు, ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyదివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి (N. T. Rama Rao Death Anniversary) నేడు.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది
Grama Ujala: ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి ఈ పథకాన్ని చేపట్టనున్న ఏపీ విద్యుత్ శాఖ
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులను ఇచ్చేందుకు (ap led bulbs distribution) రెడీ అయింది. ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్‌ఈడీ బల్బులను (4 LED bulbs per house in AP) విద్యుత్‌ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ‘గ్రామ ఉజాలా’ (Grama Ujala) పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు.
Kabaddi Palyer Died in Court: కబడ్డీ కోర్టులోనే గుండెపోటుతో మృతి చెందిన ఆటగాడు, వైయస్సార్ కడప జిల్లాలో విషాద ఘటన, అతని సొంత గ్రామంలో విషాద ఛాయలు
Hazarath Reddyవైయస్సార్ కడప జిల్లాలో వల్లూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్‌ అయిన తర్వాత తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కోర్టులోనే మృతి (Kabaddi Palyer Died in Court) చెందాడు. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఆర్కే యువసేన ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి.
Covid Updates: దేశంలో తాజాగా 15,144 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 299 కరోనా కేసులు నమోదు, ఏపీలో 114 మందికి కోవిడ్ పాజిటివ్, దేశ వ్యాప్తంగా 1,52,274 మంది కరోనాతో మృత్యువాత
Hazarath Reddyదేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు (Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్‌ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది.
Covid Vaccination in AP: ఏపీలో హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో కోవిడ్ వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన (AP CM YS Jagan Mohan Reddy) వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు.
RTC Dispute Row:దెబ్బకు దెబ్బ..దిగొచ్చిన తమిళనాడు ఆర్టీసీ, ఆఘమేఘాల మీద ఎపీఎస్ఆర్టీసీతో చర్చలు, సద్దుమణిగిన వివాదం, ఆర్టీసీ బస్సులను వదిలేసిన రెండు రాష్ట్రాల అధికారులు
Hazarath Reddyపండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీ బస్సులను నిలిపివేస్తూ (RTC Dispute Row) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. చెన్నైకు వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులను పర్మిట్ లేదంటూ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఫైర్ అయింది. వెంటనే తమిళనాడుకు చెందిన 16 బస్సులను (Tamil nadu rtc bus) పర్మిట్లు లేవంటూ ఆపేసింది. ఈ దెబ్బతో తమిళనాడు అధికారులు దిగొచ్చారు. వెంటనే ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చలకు (RTC officials talks) దిగారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం ముగిసింది.
Covid Vaccination in AP&TS: వ్యాక్సినేషన్‌కు రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ (Coronavirus Vaccination) కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా కరోనా మహమ్మారిని కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్‌ (Mega Covid-19 vaccination) కార్యక్రమానికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు.
AP's COVID Updates: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి టీకా అవసరమా? టీకా పట్ల సందేహాలు నివృత్తి చేస్తున్న ఏపీ ఆరోగ్యశాఖ; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో అత్యల్పంగా 96 కేసులు నమోదు
Team Latestlyజనవరి 16వ తేది నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్19 టీకా పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా ఆరోగ్య సిబ్బంది మరియు క్షేత్ర సిబ్బంది కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే జాబితాలో ఎవరికైనా కోవిడ్ సోకి ఉంటే వారికి 14 రోజుల ఐసోలేషన్ తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు....
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో 332 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు, రాష్ట్రంలో కొత్తగా మరో 179 కరోనా కేసులు నమోదు, ఏపికి సంబంధించిన కరోనా అప్‌డేట్స్ చూడండి
Team Latestlyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ శనివారం 332 కేంద్రాలలో కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కొక్కరికి 0.5 మిల్లీలీటర్ల డోసును (ఇంట్రా మస్క్యులర్) ఇంజక్షన్‌ చేయనున్నారు....
Makar Sankranti 2021: మకర సంక్రాంతి అంటే అర్థం ఏమిటి? సూర్యుడికి సంక్రాంతికి సంబంధం ఏమిటి? మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి? పెద్ద పండుగ విషెస్, వాట్సప్ మెసేజెస్, కోట్స్‌తో కూడిన పూర్తి సమాచారం మీ కోసం
Hazarath Reddyసంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి.
AP High Court: ఎస్ఈసీ నిమ్మగడ్డకు మరో షాకిచ్చిన ఏపీ హైకోర్టు, సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపనవసరంలేదంటూ వెల్లడి, విచారణ 18వ తేదీకి వాయిదా
Hazarath Reddyపంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న 4.96 లక్షల కోవిషీల్డ్ డోసులు, టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, రాష్ట్రంలో మరో 197 కరోనా కేసులు నమోదు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పుణెలోని సీరమ్ సంస్థ నుంచి రాష్ట్రానికి సుమారు 4,96,680 వ్యాక్సిన్ మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకుంది....
Jagananna Amma Vodi: ప్రతి గ్రామానికీ అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌, మూడేళ్లలో 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం, అమ్మఒడి వద్దనుకుంటే ల్యాప్‌టాప్ ఆప్సన్, అమ్మఒడి కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీఘ వేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) ద్వారా పేద పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నారు.
Covishield Vaccine: తెలుగు రాష్ట్రాల్లో భద్రంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఏపీలో గన్నవరంకు..తెలంగాణలో కోఠి ఆరోగ్య కార్యాలయానికి చేరుకున్న వ్యాక్సిన్లు, రేపు జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ
Hazarath Reddyదేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయానికి ఈ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చేరుకోగా ఏపీలో గన్నవరం శీతలీకరణ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.