ఆంధ్ర ప్రదేశ్

Apex Council Meeting Highlights: ముగిసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం, కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల తుది నిర్ణయం అపెక్స్‌ కౌన్సిల్‌దే, ప్రెస్ మీట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించిన కేంద్రమంత్రి షెకావత్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం (TS-AP Water Sharing) కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం (Apex Council meeting) ముగిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు

AP ECET Results 2020: ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు విడుదల, 30,654 మంది క్వాలిఫై, ఫలితాలను https://sche.ap.gov.in/ ద్వారా తెలుసుకోండి

Hazarath Reddy

ఇంజనీరింగ్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు (AP ECET Results 2020) మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను (AP ECET results 2020 declared) విడుదల చేశారు. విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు.

RTC Workers Row: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, ఆర్టీసీ ఉద్యోగులు స్థానికత అంశంపై హైకోర్టు విధించిన స్టేని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ కార్మికుల విభజన వ్యవహారానికి (RTC Workers Row) సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగులు, టీఎస్‌ఆర్టీసీకి (TSRTC) నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (Joint Andhra Pradesh) ఏపీ స్థానికత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు తెలంగాణలో విధుల్లో చేరి బదిలీ, డిప్యుటేషన్లపై స్వస్థలమైన ఆంధ్రాలో విధులు నిర్వర్తించారు.

CM YS Jagan Meets PM Modi: ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం సమావేశం, 17 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపిన అధికార వర్గాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం

Hazarath Reddy

రాష్ట్ర అభివృద్ధి ఎజెండాలో (state development agenda) భాగంగా న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం (CM YS Jagan Meets PM Modi) ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు(The meeting lasted for about 40 minutes) ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

CM YS Jagan to Meet PM Modi: మరికొద్ది సేపట్లో ప్రధానితో వైయస్ జగన్ భేటీ, రాష్ట్రంలో జరిగిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, తదనంతరం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం

Hazarath Reddy

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు న్యూ డిల్లీలో సమావేశం (CM YS Jagan to Meet PM Modi కానున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటలకు ఆయన (YS Jagan Mohan Reddy) ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఢిల్లీ వచ్చారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 4,256 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 6 వేలు దాటిన కొవిడ్ మరణాలు

Team Latestly

తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 853 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 513 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి 666 మరియు గుంటూరు నుంచి 444 కేసుల చొప్పున నమోదయ్యాయి....

Sabbam Hari Apologized: సబ్బం హరి వివాదం ముగిసినట్లేనా? సారీ చెప్పిన టీడీపీ అధినేత, అక్రమ నిర్మాణాన్ని మాత్రమే కూల్చేశామని తెలిపిన జీవీఎంసీ అధికారులు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మేయర్‌ సబ్బం హరి 24 గంటల తర్వాత.. నేను ఆ రోజు సహనం కోల్పోయి మాట్లాడాను. ఆవేశంలో అన్న మాటలకు మన్నించమని (Former MP Sabbam Hari regrets) కోరుతున్నాను.. అని క్షమాపణ కోరారు. జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని నిబంధనల మేరకు కూల్చివేసిన అధికారులతో పాటు ఏకంగా పాలకులపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు. దీనికి ఆయన చింతిస్తున్నానంటూ సారీ (Sabbam Hari Apologized) చెప్పారు.

Jagananna Vidya Kanuka: అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుక, లాంఛనంగా ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ

Hazarath Reddy

ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’(Jagananna Vidya Kanuka) కార్యక్రమాన్ని అక్టోబర్‌ 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా (AP CM YS Jagan Mohan Reddy to launch Vidya Kanuka) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

AP Weather Update: బంగాళఖాతంలో మరో అల్ప పీడనం, రానున్న రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Low pressure) 9వ తేదీన ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తర అండమాన్ తీర ప్రాంతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

Crop Purchase in AP: రైతులకు జగన్ సర్కారు శుభవార్త, అక్టోబర్ 16 నుంచి పంటల కొనుగోలు, రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన

Hazarath Reddy

ఏపీలో అక్టోబర్ 16 నుంచి రైతుల వద్ద నుండి పంటను ప్రభుత్వం కొనుగోలు (crops purchase from Farmers) చేయనుంది. ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల పంటల ఉత్పత్తులు చేతికందివస్తున్న తరుణంలో వ్యాపారుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను (Crop Purchase in AP) ఏర్పాటు చేసి మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తుల సేకరణ ఈ నెల 16 నుంచి చేపట్టనుంది. దీనిపై రైతు భరోసా కేంద్రాల(RBK)లోని వ్యవసాయ సహాయకులను కలసి ఈ నెల 15లోగా పేర్లను నమోదు చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

Suspected Deaths: కృష్ణా జిల్లాలో మిస్టరీ డెత్స్ కలకలం, మూడు అనుమానాస్పద మృత దేహాలను గుర్తించిన స్థానికులు, రంగంలోకి దిగిన పోలీసులు, ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణ

Hazarath Reddy

ఏపీలో అనుమానాస్పద చావుల మిస్టరీ (Suspected dead bodies కలకలం రేపుతున్నాయి. కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట (vissannapeta) శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను (mystery deaths) అక్కడి స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.

TS Coronavirus Update: తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు, తాజాగా 1,949 మందికి కోవిడ్, 10 మంది మృతితో 1,163కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో శనివారం 51,623 టెస్టులు నిర్వహించగా, 1,949 కేసులు (TS Coronavirus Update) నమోదైనట్లు శ్రీనివాసరావు బులెటిన్‌లో తెలిపారు. ఇప్పటివరకు 32,05,249 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,99,276 మందికి కరోనా (novel coronavirus) సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం బులెటిన్‌లో వెల్లడించారు. ఇక ఇప్పటివరకు కరోనా (Covid 19) నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,70,212గా ఉంది. కరోనాతో తాజాగా 10 మంది మరణించగా మృతుల సంఖ్య 1,163 కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 85.41 శాతం ఉండగా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

Advertisement

Andhra Pradesh Coronavirus: ఏపీలో 7 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసులు, గడచిన 24 గంటల్లో 6,242 మందికి కరోనా, 5,981కి చేరుకున్న మృతుల సంఖ్య, ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో కొత్త‌గా 6,242 కొవిడ్‌‌-19 పాజిటివ్ కేసులు (Andhra Pradesh Coronavirus) న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,811 క‌రోనా టెస్టులు చేయ‌గా వీటిలో 6,242 పాజిటివ్‌గా నిర్ధార‌ణ (coronavirus update) అయ్యాయి. కొత్తగా 40 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 5,981కి (coronavirus Deaths) చేరింది. మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

CM YS Jagan Delhi Tour: ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఖరారు, అక్టోబర్ 6న ప్రధాని మోదీతో వైయస్ జగన్ సమావేశం, అదే రోజు జల వివాదాలపై అపెక్స్‌ కమిటీ భేటీ, పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ (AP CM meeting with PM Modi) ఖరారయ్యింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy) ఈ నెల 6వ తేదీ ఉదయం.. ప్రధాని మోదీతో ( PM Narendra Modi) సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో (Amit Shah) సమావేశమై రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.

Durga Flyover Opening Date: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు, రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు ఈనెల 16న శంకుస్థాపనలు, దుర్గ ప్లై ఓవర్ కూడా అదే రోజు ప్రారంభం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న16 జాతీయ ప్రాజెక్టులకు (National Projects) శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర నారాయణ (R&B Minister Sankhar Narayana) శనివారం తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari), సీఎం వైఎస్‌ జగన్‌లు (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

AP Coronavirus Report: ఏపీలో స్కూళ్లు ప్రారంభం కాకముందే కరోనా కలకలం, 27 మంది విద్యార్థులకు కరోనా, తాజాగా 6224 మందికి కోవిడ్, 41 మంది మృతి, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,51,791 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 72,861కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 6,224 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా (AP Coronavirus Report) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,13,014కి (Coronavirus in AP) చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 60,21,395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Food Poisoning: తూర్పు గోదావరి జిల్లాలో పుడ్ పాయిజన్, 12 మంది చిన్నారులకు అస్వస్థత, ఇద్దరి పరిస్థితి విషమం, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని తెలిపిన ఎస్సై బి.వెంకట్‌

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లాలో తినుబండారాలు వికటించి (Food Poisoning in Children) 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పులుసు మామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

CM YS Jagan Father-in-law Dies: వైయస్ జగన్ మామ ఈసీ గంగి రెడ్డి మృతి, పులివెందులకు చేరుకున్న ఏపీ సీఎం, వైయస్ భారతి తండ్రి మృతి పట్ల సంతాపం ప్రకటించిన పలువురు ఎమ్మెల్యేలు

Hazarath Reddy

పీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి (EC gangi reddy) చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి (CM YS Jagan Father-in-law Dies) చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి తండ్రి (YS Bharati Father). ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు

Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 6555 మందికి పాజిటివ్, 7485 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 56,897గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, 5900కు పెరిగిన కొవిడ్ మరణాలు

Team Latestly

గత సెప్టెంబర్ నెలలోనే దేశవ్యాప్తంగా 25 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఇండియా 26,21,418 పాజిటివ్ కేసులను నమోదు చేసింది....

Water Row: రైతుల కోసం దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం, నీటి వాటాలపై ఎలాంటి రాజీ లేదు, తెలంగాణ ఉద్యమమే నీటితో ముడిపడి ఉంది; అధికారులతో సమావేశంలో టీఎస్ సీఎం కేసీఆర్

Team Latestly

తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై....

Advertisement
Advertisement