ఆంధ్ర ప్రదేశ్
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో గత రికార్డులను బద్దలు కొడుతూ నమోదవుతున్న కరోనా కేసులు, కొత్తగా మరో 7,998 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, రాష్ట్రంలో 72 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదు కాగా, అనంతపూర్, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచైతే ఏకంగా వెయ్యికి మించి కేసులు నమోదయ్యాయి....
CM Jagan Review: ఆరోగ్య ఆస‌రా కింద మహిళలకు రూ.5 వేల నగదు, ఉచిత చికిత్సకు ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి, రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ బలోపేతం, ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు
Hazarath Reddyఅంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణపై ఏపీ సీఎం స‌మీక్షా స‌మావేశం (AP CM YS Jagan Review) నిర్వ‌హించారు. ఈ సమావేశంలో భ‌విష్య‌త్తులో అంగ‌న్‌వాడీ (Anganwadi) కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స‌వం అయిన మ‌హిళ‌ల‌కు ఆరోగ్య ఆస‌రా కింద ఐదువేల రూపాయ‌లు అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాల‌ని అధికారులను ఆదేశించారు. అంగ‌న్‌వాడీల‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల‌ని పేర్కొన్నారు.
AP SEC Row: ఏపీ సీఎం చెంతకే మళ్లీ నిమ్మగడ్డ ఫైలు, ఎస్‌ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్, సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున నిర్ణయం తీసుకోలేమంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
Hazarath Reddyఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (AP Governor Biswabhusan Harichandan) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు (AP High Court) స్పందిస్తూ ఈ అంశంపై గవర్నర్‌ను కలవాలని సూచించింది.
AP Capital Bill Row: రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు
Hazarath Reddyఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు ఈ అంశాలపై గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ వద్దకు రాజధాని బిల్లు చేరుకుంది. దీనిపై విశ్వభూషణ్ హరిచందన్ (Andhra Pradesh Governor Biswabhusan Harichandan) ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించుకునేందుకు ఈ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపింది.
Jagananna Pacha Thoranam: జగనన్న పచ్చతోరణంలో వేప, రావి మొక్కలు నాటిన ఏపీ సీఎం వైయస్ జగన్, 20 కోట్ల మొక్కల్ని నాటడమే లక్ష్యంగా 71వ వన మహోత్సవం
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 71వ వన మహోత్సవాన్ని (Van Mahotsav program) ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడు ‘వనం మనం’ ప్రాంగణానికి చేరుకొన్న ఏపీ సీఎం పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ (Jagannanna Pacha Thoranam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు
AP Coronavirus Updates: అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 6,045 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, వచ్చే నెల 5 వరకు తిరుపతిలో పూర్తి స్థాయి ఆంక్షలు
Hazarath Reddyవైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (YCP MLA Ambati Rambabu) కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా తన ఆరోగ్యంపై స్పందించిన అంబటి రాంబాబు కరోనా పాజిటివ్‌గా (Corona Positive) వచ్చిందని చెప్పారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) విడుదల చేశారు.
AP Cabinet Expansion: వైసీపీలో పండగ వాతావరణం, కొత్తగా ఇద్దరు మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం, సీఎం పరిధిలో రెండు శాఖలు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్త మంత్రులుగా (New Ministers) సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (Biswabhusan Harichandan) ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు.
Chirala SI Assaulting Incident: చీరాల ఎస్పై దాడిలో యువకుడి మృతి, కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం, ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరపాలని ఏపీ సీఎం ఆదేశం
Hazarath Reddyప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయకుమార్‌ దాడి చేసిన ఘటనలో (Chirala SI Assaulting Incident) కిరణ్‌ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈనెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడిని ఎస్సై విజయ్ కుమార్ (SI vijaykumar) చితకబాదారు. సదరు యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ (Kiran Kumar) మృతి చెందాడు.
Dalit Youth Tonsured Case: శిరోముండనం చేసిన ఎస్ఐ అరెస్ట్, దళిత యువకుడిపై అమానుష దాడి, ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా స్టేషన్‌లో శిరోముండనం చేసిన కేసులో (Dalit Youth Tonsured Case) ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఎస్సీ యువకుడు (Dalit Youth) ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఫిరోజ్‌ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేగిన విషయం విదితమే.
YSRCP MP Vijayasai Reddy: వైసీపీలో కరోనా కలకలం, సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతల ట్వీట్‌లు
Hazarath Reddyఏపీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా కలకలం మధ్య సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. విజయసాయి రెడ్డితో (YSRCP MP Vijayasai Reddy) పాటు పాటు ఆయన పీఏ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి (self quarantine) వెళ్లిపోయారు. వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ (Twitter) చేశారు.
Rajya Sabha MPs Oath Ceremony: రాజ్యసభ చరిత్రలో తొలిసారి, సమావేశాలు జరగకుండా రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఏపీ నుంచి ముగ్గురు వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం
Hazarath Reddyరాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 61 మంది సభ్యులు (Rajya Sabha MPs Takes Oath) బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారితో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. సమావేశాలు జరగనప్పుడు సభలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగడం రాజ్యసభ (Rajya Sabha) చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు (YSRCP MPs) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
AP Schools Reopen Date: సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీలో కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని (AP Schools Reopen Date) నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి (Education Minister Adimulapu Suresh) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
Rajamandri Gang Rape Case: బాలికకు మత్తు మందు ఇచ్చి ఏడు మంది గ్యాంగ్ రేప్, 12మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్
Hazarath Reddyదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ఆడపిలలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం ఘటన (Rajamandri Gang Rape Case) ఇందుకు ప్రత్యక్ష్య సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఘటనపై ఏపీలో ఇప్పుడు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
Dalit Youth Tonsured Incident: అసలేం జరిగింది? దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, ఎస్సై,ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్
Hazarath Reddyఏపీలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండరం చేయడంపై (Dalit Youth Tonsured Incident) తీవ్ర దుమారం రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్టేషన్‌లో (Seethanagaram police station) దళిత యువకుడికి స్టేషన్ ఎస్ఐ కొట్టడమే కాకుండా జుట్టు, మీసాలు (Dalit youth allegedly beaten, tonsured) తొలగించారు. గాయపడిన బాధితుడిని రాజ మహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇసుక లారీలను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని బాధితుడు చెప్పాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో ఢీ కొట్టినట్లు ఆరోపించాడు.
Coronavirus in AP: ఏపీలో తాజాగా 4,994 కరోనా కేసులు నమోదు, ఒక్కరోజులో 62 మంది మృత్యువాత, రాష్ట్రంలో 58,668కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 4,994 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,162 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది. తాజాగా కరోనాతో కోలుకున్న 1,232 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,574కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
AP Govt Signs MoU with Amul: ఏపీలో మహిళలకు మంచి రోజులు, అమూల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (AP Govt Signs MoU with Amul) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు.
AP Cabinet Expansion: కొత్త మంత్రి పదవులు ఆ ఇద్దరికేనా? రేపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS jagan) నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
AP Coronavirus Update: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంపు, ఏపీలో తాజాగా 4,074 పాజిటివ్‌ కేసులు నమోదు
Hazarath Reddyకోవిడ్‌-19పై సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు (Covid Hospitals) సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతున్నట్లు సీఎం (AP CM YS jagan) ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్లు వైయస్ జగన్ తెలిపారు.
Tirupati Lockdown: తిరుపతిలో మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్, వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొనసాగనున్న ఆంక్షలు, శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత, సంతాపం తెలిపిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyక‌రోనావైరస్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో తిరుప‌తిలో రేప‌టినుంచి సంపూర్ణ ఆంక్ష‌లు (Tirupati Lockdown) విధిస్తున్న‌ట్లు కలెక్ట‌ర్ నారాయణ భరత్ గుప్తా సోమవారం ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ఈ స‌మ‌యం దాటాకా వాహ‌నాల‌కు కూడా అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. జిల్లాలో కోవిడ్-19 వైరస్‌ ( COVID-19) తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు.
UG,PG Exams in AP: ఏపీలో సెప్టెంబర్ లోపు పీజీ,యూజీ పరీక్షల నిర్వహణ, మీడియాకు వెల్లడించిన ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి
Hazarath Reddyయూజీసీ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల పరిధిలో పీజీ, యూజీ పరీక్షలను (Andhra Pradesh pg-and-ug-exams) సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రోఫెసర్‌ హేమచంద్రారెడ్డి (Professor Hemachandra Reddy) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌తో పాటు రెగ్యూలర్‌ ఎడ్యుకేషన్‌ రెండు అవసరమేనని గవర్నర్‌ సూచించారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా అకడమిక్‌ కరిక్యులమ్‌ రీ డిజైన్‌ చేస్తున్నామని ఆయన అన్నారు.