ఆంధ్ర ప్రదేశ్

AP Coronavirus: ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా, తాజాగా 1555 కోవిడ్-19 కేసులు నమోదు, 13 మంది మృతి, రాష్ట్రంలో 23,814కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1555 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 53 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు ( Andhra Pradesh) ఉన్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 23,814 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 277 మంది మృతి చెందారు. వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Food Poison in AP: చనిపోయిన ఆవును తిని 70 మంది ఆస్పత్రి పాలు, ఆరుగురి పరిస్థితి విషమం, బాధితులను పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, విశాఖ మన్యంలో ఘటన

Hazarath Reddy

లుషిత ఆహారం (Food Poison in AP) తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగతపాలెంలో (Magatapalem village) చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు.

Corona Medical Fee in AP: ఆరోగ్యశ్రీ ఉంటే కరోనా సేవలు ఉచితం, మందుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ప్రైవేట్ అస్పత్రులకు కోవిడ్-19 ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం

Hazarath Reddy

కోవిడ్‌-19 బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ( private hospitals) కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.

AP New Liquor Policy: మద్యం అక్రమంగా తరలిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు, 5 నుంచి 8 ఏళ్ళ వరకు జైలు శిక్ష, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో మద్యం అక్రమ రవాణాపై (Liquor smuggling) రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యం సరఫరా చేస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే (Liquor smugglers) ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.

Advertisement

Vizag Gas Leak: విశాఖ సెంట్రల్‌ జైలుకు ఎల్జీ పాలిమర్స్‌ నిందితులు, 14 రోజుల రిమాండ్‌ విధించిన సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు

Hazarath Reddy

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు (Visakhapatnam police) బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్‌ గ్యాస్‌ ప్రమాద ఘటనకు (LG Polymers gas leakage) సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

YSR Rythu Dinotsavam: మాది రైతుల ప్రభుత్వం, గత ప్రభుత్వ బకాయిలను పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఏడాది ఆరు నీటి ప్రాజెక్టులు లైవులోకి..

Hazarath Reddy

దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతిని (YS Rajasekhara Reddy Birthday) వైఎస్సార్‌ రైతు దినోత్సవంగా (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (Tadepalli CM Office) నిర్వహించిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో (TDP Govt) వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది.

AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 12 మంది కరోనాతో మృతి, రాష్ట్ర వ్యాప్తంగా 22, 259కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, చిత్తూరులో ఒక్క రోజే 70 మందికి కరోనా పాజిటివ్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) వెలుగు చూశాయి. కరోనా నుంచి కోలుకొని 1,332 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు (coronavirus Cases) నమోదు అయినప్పటి నుంచి ఇదే అత్యధికంగా డిశ్చార్జ్‌ అవ్వడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. కాగా నిన్న ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో కర్నూల్‌లో 3, అనంతపూర్‌లో 2, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరులో 1, గుంటూరులో 1, విశాఖపట్నంలో ఒకరు చొప్పున మరణించారు.

Vizag Gas Leak: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ సీఈఓ అరెస్ట్, ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు

Hazarath Reddy

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో (Vizag Gas Leak) మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో (LG Polymers CEO) సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు.

Advertisement

YSR Rythu Dinotsavam: వైఎస్సార్ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ ఉత్తర్వులు

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి దినోత్సవం (YSR jayanthi 2020) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. ఈసందర్భంగా రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో ముఖాముఖి, వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది.

Y. S. Rajasekhara Reddy Birthday: తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

ప్రజల నేత, తెలుగు ప్రజల గుండె చప్పుడు, దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి (Y. S. Rajasekhara Reddy) ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి (Y. S. Rajasekhara Reddy Birthday) సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు.

AP Coronavirus Report: ఏపీలో తాజాగా 1178 కరోనా కేసులు నమోదు, 13 మంది మృతి, రాష్ట్రంలో 21,197కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 252కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1178 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి.

125 Feet Ambedkar Statue: ఏపీలో 125 అడుగుల బి.ఆర్‌. అంబేడ్కర్ విగ్రహం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో విగ్రహం ఏర్పాటు, ఈ నెల 8న ప్రారంభించనున్న ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని (125 Feet Ambedkar Statue) ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) ఏర్పాటు చేయనుంది. ఈనెల 8న సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సోమవారం పరిశీలించారు.

Advertisement

YS Jagan Review Meeting: అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వైయస్సార్ హౌసింగ్ స్కీము (YSR Housing Scheme 2020) ఆగస్టు 15కి వాయిదా పడిన విషయం విదితమే. కరోనా సమయంలో ఇళ్లపట్టాలు ఎలా పంచుతారని టీడీపీ నేతలు కోర్టు గడట తొక్కడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) తెలిపారు. కాగా వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం (Government of Andhra Pradesh) సిద్దమయింది.

Visakhapatnam Gas Leak: ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్‌ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్‌ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన (LG Polymers Gas Leak) జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ (High Power committee) ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో (AP CM Camp Office) సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తుది నివేదికను సమర్పించారు.

'One Million COVID Tests': చంద్రబాబు మిలియన్ కరోనా టెస్టుల ట్వీటుకు రిప్లయి ఇచ్చిన ఏపీ హెల్త్ మినిస్ట్రీ, ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం సరైన పద్దతి కాదంటూ హితవు

Hazarath Reddy

ఏపీలో పది లక్షల కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం ప్రకటించడంతో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ట్విట్టర్ (Twitter)ద్వారా విమర్శించారు.దీనికి ఏపీ హెల్త్ మినిస్ట్రీ (AP Health Ministry) రిప్లయి ఇచ్చింది.

AP Coronavirus Report: ఏపీలో కొత్తగా 1322 కరోనా కేసులు, ఏడు మంది మృతి, రాష్ట్రంలో 20 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 239కి చేరిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1322 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా (new positive cases) నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ (Andhra Pradesh Medical Department) విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

Advertisement

Free Borewells for Farmers: పేద రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సన్న, చిన్న కారు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్ కింద ఉచిత బోర్ పథకం, అర్హతలు ఇవే

Hazarath Reddy

పలు సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS jagan) రాష్ట్రంలోని పేద రైతుల కోసం మరో పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యంలో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని (Free Borewells for Farmers) ప్రవేశపెట్టింది.

AP DGP Gautam Sawang: విశాఖపట్నంలో త్వరలో గ్రేహౌండ్స్ నిర్మాణం, వెల్లడించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కరోనా కష్టకాలంలో ఏపీ పోలీసులు పనితీరు అద్భుతమని ప్రశంస

Hazarath Reddy

కోవిడ్-19 కష్టకాలంలో పోలీసుల పనితీరు అద్భుతమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 24 గంటలూ విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (AP DGP Gautam Sawang) కొనియాడారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 78 వేల మంది పోలీస్‌ సిబ్బందిని (police department) అభినందించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీస్‌ శాఖ అప్రమత్తత గురించి చర్చ జరిగిందని డీజీపీ (Damodar Goutam Sawang) తెలిపారు.

Rain Alert in AP: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలపై చురుగ్గా నైరుతి రుతుపవనాల ప్రభావం

Hazarath Reddy

ఏపీలో రానున్న మూడు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert in AP) కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, 18 వేల మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ, గత 24 గంటల్లో కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

ఇప్పటివరకు 8,422 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 10,043 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

Advertisement
Advertisement