ఆంధ్ర ప్రదేశ్
Corona in AP: మరో రికార్డు దిశగా ఏపీ, 4 లక్షల కోవిడ్-19 టెస్టులు చేసిన రాష్ట్రంగా గుర్తింపు, కరోనా నియంత్రణ కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం, ఏపీలో 3279కి చేరిన కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Corona in AP) 3279కు పెరిగింది. 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం కోవిడ్‌ (AP Coronavirus) వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 2244 మంది డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం 967 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి 68 మంది మృతి చెందారు.
Dr Sudhakar Case: డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ
Hazarath Reddyఈ మధ్య కాలంలో ఏపీలో పలు సంచలనాలు, వివాదాలకు కారణమైన కేసుల్లో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు (Dr Sudhakar Case) ఒకటి. ఆయన వివాదాస్పద వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు (AP High Court) సీబీఐకి అప్పగించింది. కాగా కేసు సీబీఐ (CBI) దగ్గర కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
Tirumala Srivari Darshan: శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు
Hazarath Reddyకోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు (Tirumala Sri vari Darshan) తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
AP SEC Row: హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (State Election Commissioner) హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
AP Coronavirus: ఏపీలో తాజాగా 82 కేసులు నమోదు, రాష్ట్రంలో 3,200కు చేరిన కరోనా కేసులు, ఏపీ సీఎం ఢిల్లీ టూర్ వాయిదా
Hazarath Reddyఏపీలో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209 చేరింది. కాగా సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,200 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్‌ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు
APSRTC: ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్, రాయలసీమ టూ వైజాగ్ వరకు ఇంద్ర బస్సులను నడపాలని ఏపీ సర్కారు నిర్ణయం, ఆదరణ కోల్పోతున్న పల్లెవెలుగు
Hazarath Reddyలాక్‌డౌన్‌ 5.0 (Lockdown 5) అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఆర్టీసీ జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది . లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది.
AP CM Delhi Tour: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్ జగన్, హోమంత్రి అమిత్ షాతో భేటీ, పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర షెకావత్‌ను కూడా కలిసే అవకాశం
Hazarath Reddyగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కోవిడ్ 19 (COVID-19) వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ 5 (Lockdown 5) విధించడంతో పలు అంశాలపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో (Home Minister Amit Shah) సీఎం జగన్‌ భేటీ కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్‌ షాకు వివరించనున్నారు.
Covid-19 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, ఏపీలో 3,571కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, తెలంగాణలో 2,698కి చేరిన కరోనా కేసులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (Covid-19 in Telugu States) చాపకిందు నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. లాక్ డౌన్ సడలింపులు ( Lockdown Relaxation) మరింతగా ఇచ్చిన నేపథ్యంలో కేసులు రొజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ( Telangana) రికార్డు స్థాయిలో ఒక్కరోజే 199 కేసులు రావడం అక్కడ ఆందోళన కరంగా మారింది. ఏపీలో (Andhra pradesh) తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కావడంతో ఆందోళనకరంగా మారింది. రాష్ట్రాల వారీగా చూస్తే..
Vijayawada Gang War: విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో ఊహించని ట్విస్టు, ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని తెలిపిన డీసీపీ హర్షవర్థన్‌, దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
Hazarath Reddyప్రశాంతంగా ఉన్న ఏపీలోని విజయవాడలో కొందరు రౌడీ మూకల్లా రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమట సెంటర్ లోని శ్రీనివాస్ నగర్ లో రెండు గ్రూపుల మధ్య వివాదం (Vijayawada Gang War) తలెత్తగా.. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తోట సందీప్ (young man lost his life in the fight) మరణించారు. విజయవాడలోని (Vijayawada) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించాడు. మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న పండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Telugu States Lockdown 5.0: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (TS CM KCR) ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ (Lockdown 5.0) అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.
AP Lockdwon 5.0: చంద్రబాబు,నారా లోకేశ్‌లపై కేసు నమోదు, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన ఓ న్యాయవాది, వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు
Hazarath Reddyకోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు(COIVD-19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను (Lockdown) విధించిన సంగతి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రధానంగా భౌతికదూరం, మాస్కుల వినియోగం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ (violating lockdown rules) ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, జూన్ నెల పెన్సన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు (volunteers) ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను (Social security pensions) అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.
Southwest Monsoon: ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం
Hazarath Reddyదేశంలో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) చురుగ్గా కదులుతున్నాయని, జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను (Telugu States) అవి పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్‌ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. జూన్‌ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలిపారు.
AP COVID-19 Report: 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై గట్టి నిఘా, ఏపీలో గత 24 గంటల్లో 33 మందికి కోవిడ్ -19 పాజిటివ్‌, రాష్ట్రంలో 2874కి చేరిన కేసులు సంఖ్య
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు (AP COVID-19 Report) తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని 33 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 79 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2874 కేసులలో (COVID 19 Cases) 2037మంది డిశ్చార్జ్ కాగా, 60 మంది మరణించారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు.
MLA Ambati Rambabu: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Hazarath Reddyనిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను (nimmagadda ramesh kumar) రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ‌తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు (MLA Ambati Rambabu) అన్నారు. నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియమించినట్లు ఆయన వెల్లడించారు.
Nimmagadda Ramesh Kumar: జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఏపీ ప్రభుత్వానికి (AP Govt) హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను (Nimmagadda Ramesh Kumar) కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ (Jagan Govt) ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది.
Andhra Pradesh High Court: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలన్న ఏపీ హైకోర్టు
Hazarath Reddyలాక్‌డౌన్‌ నిబంధనలు (lockdown violations) ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), నారా లోకేష్‌తో (Nara Lokseh) పాటు మరికొందరు అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై (YCP MLAS)హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం (Andhra Pradesh High Court) చివరకు తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
TTD Properties Row: టీటీడీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు, ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (Tirumala Tirupati Devasthanam Board) సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD Board) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు (TTD Properties) విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు, కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది.
Mana Palana-Mee Suchana Day 4: పెద్ద నగరాలతో విశాఖ మాత్రమే పోటీ పడగలదు, మన పాలన-మీ సూచన డే 4 కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్, ఏపీలో పెట్టుబడులపై కియా కీలక ప్రకటన
Hazarath Reddyహైదరాబాద్‌, బెంగళూరులాంటి మహా నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan) తెలిపారు. విశాఖలో (Vizag) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు.
COVID-19 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 5 వేలకు చేరువలో కరోనా కేసులు, తెలంగాణలో కొత్తగా 107 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 54 కోవిడ్-19 కేసులు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు (COVID-19 in Telugu States) పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో 5 వేలకు చేరువలో కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 107 కొత్త కేసులు నమోదు కాగా ఏపీలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 2098కు చేరుకోగా ఏపీలో 2841కి చేరుకున్నాయి. రెండు రాష్ట్రాల కరోనా కేసులను కలుపుకుంటే 4939గా ఉన్నాయి.